loader

సౌదీ ప్రమాదం… రెండు కుటుంబాల్లోని వారంతా

సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో హైదరాబాద్‌ వాసులు ఎక్కువగా ఉన్నారు. ఇక ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది, మరో కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారు. ఎనిమిది మందిలో మహమ్మద్ అబ్దుల్ షోయబ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారుఅలాగే మరో కుటుంబానికి చెందిన ఏడుగురు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారికి సంబంధించి ఎలాంటి సమాచారం అందకపోవడంతో […]

సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి. సహాయ చర్యలకు ఆదేశాలు

సౌదీ అరేబియాలో భారతీయ ఉమ్రా యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందినవారు ఎక్కువగా ఉన్నారనీ, మృతుల్లో 11 మంది మహిళలు, 10 మంది పిల్లలు ఉన్నారని సమాచారం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. తెలంగాణకు చెందిన బాధితుల సంఖ్య ఎంతో తెలుసుకోవాలనీ, కేంద్ర విదేశాంగ శాఖ (MEA), సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు.

మక్కాలో ప్రార్థనలు ముగించుకుని వెళుతూ..

సోమవారం తెల్లవారు జామున యాత్రికులు మక్కాలో ప్రార్థనలు ముగించుకుని బస్సులో మదీనా వెళుతూ ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు 1.30 గంటల ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులందరూ నిద్రలో ఉన్నారు. ఎక్కువ మంది నిద్రలోనే ప్రాణాలు విడిచారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఒకరికంటే ఎక్కువ మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవటం విషాదకరం. ఇండియన్ ఎంబసీ ఈ ఘటనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. హజ్ కమిటీ, […]

ఘోర రోడ్డు ప్రమాదం.. సౌదీలో 42 మంది భారతీయులు మృతి..

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు – ట్యాంకర్ ఢీకొట్టుకున్న సంఘటనలో ఏకంగా 42 మంది చనిపోయారు. మృతుల్లో 20 మంది మహిళలు కాగా.. 11 మంది చిన్నారులు ఉన్నారు. వీరంతా మక్కా నుంచి మదీనా వెళ్తున్న భారతీయ యాత్రికులు కావటం గమనార్హం. బదర్‌-మదీనా మధ్య ముఫరహత్‌ దగ్గర ఘటన జరిగింది. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాద్‌ వాసులు ఉన్నారు.

అమెరికాను వణికిస్తున్న సరికొత్త వైరస్‌..

అమెరికాలో H5 N5 వైరస్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. బర్డ్‌ ఫ్లూ లాంటి జంతువులకు మాత్రమే సోకే ఈ వైరస్‌, ఫస్ట్‌ టైమ్‌ మనుషుల్లో కన్పించడం హడలెత్తిస్తోంది. వాషింగ్టన్‌లో ఓ వ్యక్తికి H5 N5 అనే సరికొత్త వైరస్‌ సోకినట్టు గుర్తించారు వైద్యులు. ఈ వైరస్‌ సాధారణంగా జంతువులకు మాత్రమే సోకుతుందన్నారు మనుషులకు సోకడం ఇదే ఫస్ట్‌ టైమ్‌ అంటున్నారు డాక్టర్లు. H5 N5 వైరస్‌ ప్రభావం చలికాలంలో ఎక్కువగా వుంటుందన్నారు. ముఖ్యంగా పౌల్టీ రంగంలో ఉన్న […]

రాగి గనిలో కుప్పకూలిన వంతెన.. 32 మంది మృతి

ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. రాగి గనిలో వంతెన కుప్పకూలింది. దీంతో 32 మంది మృతి చెందారు. కాంగోలోని లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో సైట్‌లో రాగి గని ఉంది. ఈ మైనింగ్‌ సైట్‌లో వందలమంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మైనింగ్‌ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో అది కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం

మెక్సికోలో రెచ్చిపోయిన జెన్‌ జెడ్ ..నిరసనల్లో చెలరేగిన హింస

జెన్ జెడ్ ఉద్యమం ఉత్తర అమెరికాను తాకింది. తాజాగా మెక్సికోలో వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చిన నిసనలు చేశారు. దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్‌బామ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ ప్యాలెస్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను ముసుగులు ధరించిన కొందరు నిరసనకారులు కూల్చేశారు.అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిరసనకారులపైకి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. కాగా, ఈ ఘర్షణల్లో 100 మంది పోలీసులకు గాయాలయ్యాయని సిటీ సిటిజెన్ సేఫ్టీ […]

అమెరికాలో పెరిగిన ధరలు.. సుంకాలు తొలగించిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల పలు దేశాలపై సుంకాలు విధించి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ట్రంప్‌ సుంకాల కారణంగా అమెరికాలో పలు వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్.. ఆహార ఉత్పత్తులపై సుంకాలను తొలగించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. అమెరికాకు బ్రెజిల్ నుంచి భారీగా గొడ్డు మాంసం ఎగుమతి అవుతుంది. బ్రెజిల్‌పై కూడా ట్రంప్ భారీ సుంకాలు విధించారు. దాంతో గొడ్డు […]

మైక్రోసాఫ్ట్ యూజర్లకు కేంద్రం ‘హై-రిస్క్’ వార్నింగ్-డిజిటల్ డోర్లను లాక్ చేసుకోండిలా!

భారతదేశంలోని మైక్రోసాఫ్ట్ విండోస్, అజూర్, ఆఫీస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం హై-రిస్క్ అలెర్ట్స్ జారీ చేసింది. ఇండియన్ CERT-In టీం మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులలో ప్రత్యేకంగా విండోస్, ఆఫీస్ అప్లికేషన్‌లను ప్రభావితం చేస్తుంది. Windows అప్డేట్ చేసుకోవడం, Office యాప్‌లను అప్డేట్ చేసుకోవడం, మీరు వారాల తరబడి ల్యాప్‌టాప్‌ను ” “Sleep” మోడ్​లో ఉంచే వారిలో ఒకరైతే ఈరోజే దాన్ని రీస్టార్ట్ చేయండి. తాజా సాఫ్ట్‌వేర్​కి అప్డేట్​ చేసుకున్న యూజర్ల పరికరాలు ఇప్పుడు సురక్షితమని ధృవీకరించింది.

లిబియాలో పడవ బోల్తా 42 మంది గల్లంతు

లిబియా తీరానికి సమీపంలో వలసదారులతో వెళ్తున్న పడవ సముద్రంలో బోల్తా పడింది. అక్రమంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్తున్న ఈ పడవలో మొత్తం 42 మంది ఉన్నారు. వీరంతా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. పడవ సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత ఇంజిన్ పనిచేయడం ఆగిపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రయాణికుల్లో ఏడుగురు వలసదారులు దాదాపు ఆరురోజుల పాటు సముద్రం మధ్యలో ఉన్నారు. చివరకు లిబియా దేశ అధికారులు వారిని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON