loader

ట్రంప్ సంచలన నిర్ణయం.. ఈసారి సినిమాలపై..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆయన దృష్టి సినిమాలపై పడింది. అమెరికా వెలుపల నిర్మించే చిత్రాలపై 100 శాతం సుంకం విధిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా కాలిఫోర్నియాకు ఉన్న అసమర్థ, బలహీన గవర్నర్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యను 100 శాతం సుంకం విధించడం ద్వారా పరిష్కరించి అమెరికాను మరోసారి అగ్రస్థానంలో నిలుపుతాను’’ అని ట్రూత్‌లో ట్రంప్ పేర్కొన్నారు.

పాల‌స్తీనాకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌మంటే.. యూదుల‌ను చంప‌డ‌మే: నెత‌న్య‌హూ

ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశాల్లో ఇజ్రాయిల్ ప్ర‌ధాని బెంజిమిన్ నెత‌న్య‌హూ ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో కొన్ని దేశాల ప్ర‌తినిధులు వాకౌట్ చేశారు. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం జ‌రిగింది. కొన్ని దేశాల ప్ర‌తినిధులు మాత్రం నెత‌న్య‌హూ మాట్లాడుతున్న స‌మ‌యంలో లేచి నిల‌బ‌డి చ‌ప్ప‌ట్లు కొట్టారు. పాల‌స్తీనాకు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని వాదిస్తున్న ప‌శ్చిమ దేశాల‌ను నెత‌న్య‌హూ త‌ప్పుప‌ట్టారు. యూదుల‌ను ఊచ‌కోత కోసేందుకు ప‌శ్చిమ దేశాలు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు.

హెలికాప్టర్‌లో ట్రంప్‌ దంపతులు గొడవ..? వీడియో వైరల్‌

న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాలకు ట్రంప్‌ తన భార్య మెలానియాతో కలిసి హాజరైన విషయం తెలిసిందే. సమావేశాల అనంతరం మెరైన్‌ వన్ హెలికాప్టర్‌లో అధ్యక్షుడి దంపతులు తిరుగు పయనమయ్యారు. ఆ సమయంలో హెలికాప్టర్‌లో ఎదురెదురుగా కూర్చున్న ట్రంప్‌-మెలానియా ఒకరివైపు ఒకరు వేలు చూపించుకుంటూ మాట్లాడుతూ కనిపించారు. వారిద్దరూ ఏదో విషయంపై గొడవ పడుతున్నట్లు ఆ వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

ఐరాస వేదికగా పాక్‌ ప్రధానికి గట్టిగా బదులిచ్చిన పేటల్‌ గహ్లోత్‌..

పాకిస్థాన్ తన విదేశాంగ విధానంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలను చెబుతోందంటూ ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఎగుమతి చేయడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని, అంతర్జాతీయ వేదికపై పాక్‌ ప్రధానిని కడిగిపారేసిన ఈ యువ దౌత్యవేత్త గురించి ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తోంది. పేటల్‌ గహ్లోత్‌ న్యూఢిల్లీలో జన్మించారు. ముంబైలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. 2015లో IFS లో చేరి దౌత్యవేత్తగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఈ […]

పాక్ ప్రధాని, ఆర్మీచీఫ్ తో ట్రంప్ ప్రత్యేక భేటీ

మారిన రాజకీయ, వాణిజ్య సమీకరణాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ లకు వైట్ హౌస్ లో ఘనస్వాగతం పలికారు. ఈ పరిణామం ఇరుదేశాల మధ్య సంబంధాలలో కొత్త అధ్యాయానికి సంకేతంగా నిలుస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మర్కో రూబియో కూడా హాజరైన ఈ సమావేశానికి ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ,పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ఇద్దరూ ‘గొప్ప నాయకులు’ అని కొనియాడారు.

అరెస్టు భయంతో సుదీర్ఘ మార్గంలో నెతన్యాహు ప్రయాణం..

ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరు అయ్యేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అసాధారణ మార్గంలో అమెరికాకు వెళ్లారు. యుద్ధ నేరాల ఆరోపణలపై అరెస్టు వారెంట్లు జారీ కావడంతో యూరప్ గగనతలం మీదుగా వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. సాధారణ మార్గం కాకుండా మొత్తంగా 373 మైళ్ల దూరం (600 కిలో మీటర్లు) అదనంగా ప్రయాణించి అమెరికా చేరుకున్నారు. ఫ్రాన్స్ అనుమతి ఉన్నా ఆ మార్గాన్ని ఎందుకు వద్దనుకున్నారో తెలియదని ఫ్రెంచ్ అధికారి తెలిపారు.

పదవిని వదిలేస్తా : జెలెన్‌స్కీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఒక సంచలన నిర్ణయం వెల్లడించారు. రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాత తాను పదవిని వదులుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్ష పదవిని కొనసాగించడం తన లక్ష్యం కాదని చెప్పారు. ప్రజలకు శాంతిని తీసుకురావడమే తన ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటే పార్లమెంటు చర్చించాలని కూడా కోరారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

అమెరికా పొమ్మంటే మా దేశానికి రండి…ఉద్యోగులకు జర్మనీ ఆహ్వానం

విదేశాల్లో పని చేయాలని ఆశపడేవారికి జర్మనీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. అమెరికాలో హెచ్-1బి వీసాల సమస్యలు కొనసాగుతున్న తరుణంలో, జర్మనీ నుంచి ఉద్యోగులకు ఆహ్వానం అందుతోంది. జర్మనీలో ఉన్న భారతీయ రాయబారి ఫిలిప్ అకెర్మాన్ ఎక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇండియన్ ఎంప్లాయిస్‌కి పిలుపునిచ్చారు. అమెరికా హెచ్-1బి వీసా ఫీజు పెంపు నేపథ్యంలో, జర్మనీ భారతీయులకి ఒక స్థిరమైన, నమ్మకమైన వలస విధానంతో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఆయన చెప్పారు.

ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు

అస్సాం సంగీత ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిన జుబీన్ గార్గ్ మరణం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఆయన అంత్యక్రియలకు హాజరైన జనసంద్రం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద అంత్యక్రియల గ్యాదరింగ్‌గా దీనిని గుర్తించారు. మైఖేల్ జాక్సన్, పోప్ జాన్ పాల్ II, క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఇంతటి పెద్ద సంఖ్యలో ప్రజలు ఒక కళాకారుడి అంతిమ వీడ్కోలు కార్యక్రమానికి హాజరవడం విశేషమని లిమ్కా బుక్ పేర్కొంది.

చైనాతో జాగ్రత్త.. భారత్‌ను హెచ్చరించిన టిబెట్ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే

ప్రవాసంలో ఉన్న టిబెటన్ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ లోబ్సాంగ్ సంగే సంచలన విషయం వెల్లడించారు. చైనాతో భారత్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం భారతీయ రాజకీయనేతలను ప్రభావితం చేసేందుకు చురుకుగా ప్రయత్నిస్తుంటుందని, చివరకు ప్రభుత్వ మార్పుకు సైతం ప్రణాళిక వేస్తుందని అన్నారు. ‘ఎలైట్ -ఆప్షన్ అనేది చైనా అనాదిగా అనుసరిస్తున్న వ్యూహం’ అని ఎన్డీటీవీకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON