loader

అమెరికన్‌ గోల్డ్‌కార్డు విడుదల చేసిన ట్రంప్‌..

అమెరికా పౌరసత్వం కావాలనుకునే వారు గోల్డ్ కార్డు కొనుక్కోవాలని గతంలో చెప్పిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ గోల్డ్ కార్డు  ఫస్ట్ లుక్  విడుదల చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో  విలేకరులతో మాట్లాడుతూ ఆయన గోల్డ్‌ కార్డు ఫస్ట్‌ లుక్‌ను చూపించారు. ఈ గోల్డ్ కార్డును EB5 వీసాకు ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. దీని అర్థం ఇన్వెస్టర్ల వీసా విధానాన్ని రద్దుచేసి దాదాపు 5 మిలియన్‌ డాలర్లు వెచ్చించే వారికి అందిస్తారు. మన రూపాయిలో ఇది […]

మోదీకి థాయి ప్రధాని ప్రత్యేక గిప్ట్ …

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పెయిటోంగ్‌టార్న్ షిన్‌వత్రా ఆయనకు “ది వరల్డ్ త్రిపీటిక : సజ్జయ పొనెటిక్ ఎడిషన్” అనే త్రిపిటకాన్ని బహుమతిగా ఇచ్చారు. మోదీకి థాయ్‌లాండ్ ప్రధానమంత్రి ఇచ్చిన బహుమతి త్రిపిటక (పాలీలో) లేదా త్రిపిటకం (సంస్కృతంలో) అనేది బుద్ధుని బోధనల యొక్క ప్రసిద్ధ సమాహారం. ఇందులో 108 సంపుటాలు ఉన్నాయి. ఇది ప్రధాన బౌద్ధ గ్రంథంగా పరిగణించబడుతుంది.

భారత్‌పై ప్రతీకార సుంకాలు షురూ..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలపై కీలక ప్రకటన చేశారు. లిబరేషన్ డే సందర్భంగా 60కి పైగా దేశాలపై ఆయన ప్రతీకార సుంకాలను ప్రకటించారు. అలాగే అధికారిక ఉత్తర్వులపై కూడా ట్రంప్‌ సంతకాలు చేశారు. ఇతర దేశాలపై విధించిన టారిఫ్‌లు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు..ట్రంప్‌. ఈ రోజును ‘లిబరేషన్‌ డే’గా అభివర్ణించిన ట్రంప్‌..అమెరికా ఇండస్ట్రీ ఈరోజు పునర్జన్మించిందని చెప్పారు. అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారని మండిపడ్డ ట్రంప్‌.. ఇక అలా జరగదని […]

మయన్మార్‌కు మరోసారి భారత్ 30 టన్నుల విపత్తు సాయం

మయన్మార్, థాయిలాండ్ భారీ భూకంపాలు కుదిపేసిన విషయం తెలిసిందే.  భూకంపాల ధాటికి మృతుల సంఖ్య గంటకు పెరుగుతోంది. మయన్మార్, థాయిలాండ్ లో మృతిచెందిన వారి సంఖ్య 16వందలకు చేరింది. ఆదివారం కూడా 30 టన్నుల విపత్తు సహాయాన్ని తరలించారు. వివిధ రకాల ఆహార వస్తువులతో పాటు వైద్య సామాగ్రిని యాంగోన్‌కు పంపించారు. భారత నావికాదళ నౌకలు ఐఎన్ఎస్ కర్మూక్, ఎల్ సీ యూ 52 లలో 30 టన్నుల సాయాన్ని పంపినట్లు విదేశాంగ శాఖ మంత్రి జై […]

భారీ భూకంపం మిగిల్చిన పెను విషాదం..

మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని నింపింది. భారీ భూకంపం ధాటికి అతలాకుతలమైన మయన్మార్​‌లో మృతుల సంఖ్య 1,644కు పెరిగిందని ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. అంతేగాక, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం గాయపడిన వారి సంఖ్య 3408కి పెరిగిందని, 139 మంది ఆచూకీ ఇంకా తెలియలేదని తెలిపింది. పలు దేశాలు సహాయక సామగ్రిని, సిబ్బందిని పంపిస్తున్నప్పటికీ, ఫ్లైట్స్ లాండ్ చేయడానికి అనువుగా […]

ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. విద్యాశాఖను మూసివేస్తూ ఉత్తర్వులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 2.0 పాలనలో సంచలనలకు కేంద్ర బిందువుగా మారారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ.. అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా, ఆయన ఏకంగా విద్యాశాఖనే మూసివేశారు. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై  సంతకం చేశారు. ఈ ఉత్తర్వులతో ఫెడరల్ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్ శాశ్వతంగా తొలగించడం మొదలైందని ట్రంప్ అన్నారు. ‘‘మేము వీలైనంత త్వరగా మూసివేస్తాం.. దీని వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు.. విద్యను రాష్ట్రాలకు […]

41 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. మరో బాంబ్ పేల్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌  అమెరికాను  నంబర్ వన్‌గా చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. అయితే ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్లప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలపైనా ఆ ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాల కోతలు, ప్రపంచ దేశాలపై ట్యాక్స్‌లు పెంచడం, అమెరికా వీసా నిబంధనల్లో మార్పులు వంటి సంచలన నిర్ణయాలకు తెరలేపారు.. అయితే తాజాగా మరో బాంబ్ పేల్చారు. 41 దేశాల పౌరులు తమ దేశంలో అడుగు పెట్టకుండా ట్రావెల్ […]

ISIS పై అమెరికా ఉక్కుపాదం.. ఇస్లామిక్ స్టేట్ లీడర్ ఖతం..

అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల మద్దతుతో ఇరాకీ భద్రతా దళాలు అబూ ఖదీజాను చంపాయని ప్రధాన మంత్రి మొహమ్మద్ షియా అల్-సుడానీ తెలిపారు. అతన్ని “ఇరాక్, ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులలో ఒకరు” అని అభివర్ణించారు. ఇరాకీ ఇంటెలిజెన్స్, భద్రతా దళాల సంయుక్త సహకారంతో ఇరాక్ లో జరిపిన ఆపరేషన్ లో అతన్ని హతమార్చింది. అబు ఖదీజా, మరోటెర్రరిస్టు వాహనంప వెళ్తుండగా క్షిపణిని ప్రయోగించి చంపేసింది. దీనికి సంబంధించిన వీడియో వైట్ హౌస్ విడుదల చేసింది

గ్రీన్‌కార్డుతో శాశ్వత నివాసం రాదు

గ్రీన్‌కార్డు ఉన్నంత మాత్రాన అమెరికా లో నిరంతరం ఉండలేరని, ఆ హక్కు గ్రీన్‌కార్డు హోల్డర్లకు ఉండబోదని, అమెరికా ప్రభుత్వం తలచుకుంటే వారిని వారి దేశాలకు డిపోర్ట్ చేయొచ్చ ని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి.వాన్స్ అన్నారు. అమెరికాలో అత్యధిక గ్రీన్ కా ర్డులు కలిగిన వారిలో రెండో స్థానం భారతీయుల దే. ‘అమెరికా అధ్యక్షుడు లేక విదేశాంగ కార్యదర్శి ఏ ప్రవాసి అయినా తమ దేశంలో ఉండకూడదనుకుంటే అలాంటి వారికి చట్టబద్ధంగా నివసించే హక్కు ఉండదు’ అని వాన్స్ […]

భారత్‌ను ఓడించకపోతే పేరు మార్చుకుంటా.. పాక్ ప్రధాని వింత వ్యాఖ్యలు

భారత్‌ విషయంలో పాక్ ప్రధాని సంచలన సవాల్ స్వీకరించారు. భారత్‌ను తాము ఓడిస్తామని.. ఒకవేళ ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని.. అతి విశ్వాసంతో కీలక వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఏదో క్రికెట్ మ్యాచ్‌లో కాదు.. ఏకంగా ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో భారత్‌ను పాక్ ఓడిస్తుందని.. తలపొగరు వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. షెహబాజ్ షరీఫ్ పేరు మార్పు ఖాయం అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON