మౌంట్ ఎవరెస్ట్పై మంచు తుఫాను బీభత్సం..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్పై మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. సుమారు 1,000 మంది పర్వతారోహకులు వేల అడుగుల ఎత్తులో ఈ తుఫానులో చిక్కుకుపోయారు. ఇప్పటి వరకూ దాదాపు 350 మందిని రక్షించినట్లు సమాచారం. వాళ్లందరినీ ఆదివారం నాటికే క్యూదాంగ్ పట్టణానికి తరలించారు. మరో 200 మందిని దశలవారీగా కిందకు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 16 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో వారంతా చిక్కుకుపోయినట్లు చైనా మీడియా పేర్కొంది.