loader

గూగుల్ క్రోమ్‌ను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిన భారత సంతతికి చెందిన సీఈఓ

టెక్ ప్రపంచంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్‌ పర్‌ప్లెక్సిటీ ముందుకొచ్చింది. అమెరికన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ పర్‌ప్లెక్సిటీ AI వ్యవస్థాపకుడు, CEO అరవింద్ శ్రీనివాస్ గూగుల్ క్రోమ్‌ను కొనుగోలు చేయడానికి $34.5 బిలియన్ల (రూ. 3,02,152 కోట్లకు పైగా) ఆఫర్ ఇచ్చారు.

ట్రంప్ అత్యంత అపఖ్యాతి పొందిన నేరస్థుడు.. ఎలాన్ మస్క్‌కు మరో తలనొప్పి

టెస్లా, ఎక్స్ దిగ్గజ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‍బాట్ గ్రోక్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‍ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా గ్రోక్ ఈ వ్యాఖ్యలు చేసింది. “వాషింగ్టన్ డీసీలో అత్యంత అపఖ్యాతి పొందిన నేరస్థుడు ఎవరు?” అని అడగ్గా.. గ్రోక్ నేరుగా డోనాల్డ్ ట్రంప్ పేరును ప్రస్తావించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో.. మస్క్‌కు మరో […]

సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం

దేశంలో సైబర్ నేరాలపై పెరుగుతున్న ముప్పు నేపథ్యంలో, తాజాగా విడుదలైన గణాంకాల్లో తెలంగాణ రాష్ట్రం అత్యధిక సైబర్ నేరాల నమోదుతో దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ రేటు సగటున 4.8 శాతంగా ఉండగా, తెలంగాణలో ఇది 40.3 శాతంగా నమోదైంది. ఇది ఆందోళనకరంగా మారింది.దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ కేసుల్లో చాలా శాతం తెలంగాణకు చెందినవే కావడం గమనార్హం. ఇది రాష్ట్రానికి అప్రతిష్ఠను కలిగిస్తోంది.

యాపిల్‌పై ఎలాన్ మస్క్ తీవ్రహెచ్చరికలు

టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధ AI ఆధిపత్య పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, టెక్ దిగ్గజం యాపిల్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ న్యాయపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. యాపిల్ తన యాప్ స్టోర్‌లో ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీకి అనైతికంగా కొమ్ముకాస్తోందని, ఇది తమ సొంత ఏఐ స్టార్టప్ ‘ఎక్స్‌ఏఐ’ ఎదుగుదలను అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు.

వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌..

ఎప్పుడూ స్టేటస్‌లో కొత్త ఫోటోలు, వీడియోలు పెట్టే వారికి వాట్సాప్ వినియోగదారుల కోసం మరో అదిరిపోయే ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఇకపై ఫోటోలు ఎడిట్ చేయడానికి లేదా థర్డ్ పార్టీ యాప్స్ తో అవసరం లేకుండా చేసింది. యాప్‌లోనే కొలేజ్ రూపొందించుకునే సదుపాయం అందుబాటులోకి రావడంతో, స్టేటస్ అప్‌డేట్ చేయడం మరింత ఈజీగా మారింది. అంటే పుట్టినరోజు పార్టీ, ఫ్యామిలీ గ్యాదరింగ్, ట్రిప్ లేదా ఏదైనా ప్రత్యేక ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలన్నీ ఒకే స్టేటస్‌లో చూపించుకోవచ్చు.

భారతీయ కుర్రాళ్లు… సరికొత్త ఏఐ మోడల్ తో టెక్ దిగ్గజాలకే సవాల్

ముగ్గురు యువకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అద్భుతాలు చేస్తున్నారు. సరికొత్త ఏఐ మోడల్ తో టెక్ దిగ్గజాలకే సవాల్ విసురుతున్నారు. HelpingAI సులభమైన ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇస్తుంది. అదే కాస్త క్లిష్టమైన సమస్యలకు ఆలోచించి సమాధానం ఇస్తుంది… మరీ క్లిష్టమైన ప్రశ్నలకు బాగా లోతుగా ఆలోచించి, అవసరమైతే రెండోసారి సమీక్షించి జవాబు ఇస్తుంది. ఇది చైనీస్ ఏఐ మోడల్ DeepSeek-R1 కంటే 10 రెట్లు వేగంగా పనిచేస్తోందని… OpenAI ChatGPT-4 కంటే సమర్ధవంతంగా పనిచేస్తోందని వినియోగదారులు […]

త్వరలోనే ఇండియా అమెరికాను దాటేస్తుంది.. OpenAI CEO ఆసక్తికర వ్యాఖ్యలు!

ఏఐ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న ప్రముఖ సంస్థ ఓపెన్‌ ఏఐ సంస్థ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్ కొత్త మోడల్ జీపీటీ-5ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఇండియాలో ఏఐ వినియోగంపై ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెరికా తర్వాత ఓపెన్ఏఐకి అతిపెద్ద మార్కెట్‌ ఉన్న దేశం భారత్‌ అని ఆయన అన్నారు. ఇండియాలో ఏఐ వినియోగం అతి వేగంగా పెరుగుతోందని, అతి తక్కువ సమయంలోనే భారత్‌ ఏఐ వినియోగంలో ఆమెరికాను క్రాస్‌ చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

సత్య నాదెళ్లను హెచ్చరించిన మస్క్..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ OpenAI తాజాగా తీసుకొచ్చిన GPT-5 అధికారిక ప్రకటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ స్పందించిన తీరు కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. “ఓపెన్‌ఏఐ… మైక్రోసాఫ్ట్‌ను బతికుండగానే మింగేస్తుంది” అని మస్క్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్య మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ఉద్దేశించిందని టెక్ వర్గాల్లో భావిస్తున్నారు. ఈ ట్వీట్ వెనుక ఉన్న వ్యంగ్యం, హెచ్చరిక స్వభావం సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చకు దారితీసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్….రీపోస్టింగ్ బటన్

ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. రీపోస్ట్ అనే ఫీచర్ సహాయంతో యూజర్స్ వారికి నచ్చిన పోస్ట్ , రీల్‌ను రీపోస్ట్ చేయవచ్చు. ఇది వారి ఫాలోవ్స్ ఫీడ్‌లో కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ ఇంటరాక్షన్ పెంచేందుకు, ఫ్రెండ్స్‌ ఫీడ్‌లో కంటెంట్ డిస్కవరీ ఫీచర్‌ను మెరగుపర్చేందకు ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనితో పాటు మరో 2 ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్ ప్రవేశపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ మ్యాప్(Instagram Map), రీల్స్‌లో ఫ్రెండ్స్ ట్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

సెప్టెంబర్ 1 నుంచి జీతాల పెంపు- TCS

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 1 నుండి జీతాలు పెంచుతున్నట్లుగా ఉద్యోగులకు మెయిల్స్ పంపుతోంది. ఈ జీతాల పెంపులో సుమారు 80 శాతం మంది ఉద్యోగులు ఉంటారని, ముఖ్యంగా జూనియర్, మిడ్-లెవెల్ ఉద్యోగులకు  వర్తిస్తుందని టీసీఎస్ వెల్లడించింది. 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించిన కొన్ని రోజులకే టీసీఎస్ ఈ జీతాల పెంపు ప్రకటన చేయడం గమనార్హం. ఈ చర్యతో కంపెనీ తన నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అట్టిపెట్టుకోవాలని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON