loader

ఈయూలో అక్టోబర్‌ నుంచి రాజకీయ ప్రకటనలు బంద్‌.. ప్రకటించిన మెటా కంపెనీ

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృతసంస్థ మెటా అక్టోబర్‌ నుంచి యూరోపియన్‌ యూనియన్‌ (EU)లో అన్ని రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల ప్రచారాలలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో  కొత్తగా అమలు చేయనున్న ఈయూ నియమాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కంపెనీ వెల్లడించింది. ఈ నియమాలు తమ ప్రక్రియ, వ్యవస్థలపై చాలా అదనపు బాధ్యతలను విధిస్తున్నాయని, ఇది ప్రకటనదారులు, ప్లాట్‌ఫారమ్‌లు ఈయూలో పనిచేయడం చట్టబద్ధంగా చాలా క్లిష్టంగా మారుతుందని కంపెనీ పేర్కొంది.

టిక్ టాక్‌కు ట్రంప్ బిగ్ షాక్..

టిక్ టాక్‌ ఇతర దేశాల్లో మాత్రం పనిచేస్తుంది. అమెరికాలో చాలా మంది దీన్ని వాడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో టిక్‌టాక్ భవిష్యత్తు చైనా చేతుల్లోనే ఉందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ స్పష్టం చేశారు. టిక్‌టాక్ యొక్క యుఎస్ షేర్లను విక్రయించాలనే యుఎస్ ప్రతిపాదనను చైనా అంగీకరించకపోతే.. గతంలో మాదిరి టిక్‌టాక్‌ను మళ్ళీ యుఎస్‌లో నిషేధించనున్నట్లు లుట్నిక్ తెలిపారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి అమెరికా సెప్టెంబర్ 17 వరకు టిక్‌టాక్‌కు గడువు ఇచ్చింది.

ప్ర‌తిష్టాత్మ‌క ప‌రీక్ష‌కు వేదికైన క‌ర్నూలు.. రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌శంస‌లు

ఆంధ్రప్రదేశ్ రక్షణ చరిత్రలో మరో ఘట్టం నమోదైంది. కర్నూలు జిల్లాలో డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన స్వదేశీ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించారు. ఈ పరీక్షలు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలోని NOAR కేంద్రంలో శుక్ర‌వారం నిర్వ‌హించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విజయాన్ని సోషల్ మీడియా వేదిక X ద్వారా ప్రకటించారు. స్వదేశీ టెక్నాలజీతో ఆధునిక మిస్సైల్ సిస్టమ్ రూపొందించిన DRDOతో పాటు MSMEలు, స్టార్టప్స్ సహకారాన్ని […]

రాడార్‌కు చిక్కని డ్రోన్లు.. హైదరాబాద్ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ

హైదరాబాద్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) క్యాంపస్. అక్కడి విద్యార్థులైన జయంత్ ఖత్రీ, సౌర్య చౌధురి హాస్టల్ గదిలో వచ్చిన ఆలోచనకు ఆవిష్కార రూపం ఇచ్చారు. ఆ ఇద్దరూ స్థాపించిన డిఫెన్స్ టెక్ స్టార్టప్ ‘అపోలియన్ డైనమిక్స్’ ఇప్పుడు రాడార్ల కన్నుగప్పి శరవేగంతో దూసుకెళ్లే కమికేజ్ డ్రోన్లను రూపొందించి భారత సైన్యానికి అందిస్తోంది. ఆ డ్రోన్లు ఇప్పటికే ఇండియన్ ఆర్మీలోని జమ్మూ, చండీమందిర్ (హర్యానా), పనగఢ్ (పశ్చిమ బెంగాల్), అరుణాచల్ ప్రదేశ్‌లోని సైనిక […]

హ్యాకర్ల దెబ్బకు కంపెనీయే మూతపడింది

యూకేలోని కేఎన్పీ లాజిస్టిక్స్ అనే కంపెనీ గత 158 ఏళ్ల నుంచి రవాణారంగంలో వ్యాపారం చేస్తోంది. ఈ సంస్థకు దాదాపు 500 లారీలు ఉన్నాయి. ఆకిర గ్యాంగ్ హ్యాకర్త రాన్సమ్వర్ సైబర్ అటాక్కు గురైంది. ఈ ముఠా కేఎన్పీ సిస్టమ్స్ లోని అనధికారికంగా ప్రవేశించింది. మళ్లీ తిరిగి డేటాను పొందాలంటే 58కోట్లు డిమాండ్ చేసింది. కేఎన్పీ అంత సొమ్ము చెల్లించలేని స్థితిలో చివరికీ కంపెనీ పూర్తిగా మూతబడింది. దీంతో ఈ కంపెనీ 700 మంది ఉద్యోగులు రోడ్డున […]

11వేల యూట్యూబ్‌ చానల్స్‌పై గూగుల్‌ వేటు..! చైనా, రష్యావే ఎక్కువ..!

పెద్ద ఎత్తున యూట్యూబ్‌ చానల్స్‌పై గూగుల్‌ చర్యలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా 11వేల యూట్యూబ్‌ చానల్స్‌ను తొలగించినట్లు టెక్‌ కంపెనీ ప్రకటించింది. ఇందులో చైనా, రష్యాకు చెందిన చానల్స్‌ అత్యధికంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. చైనాకు చెందిన 7,700 ఛానెల్స్‌ ఉన్నాయని తెలిపింది. అసత్య ప్రచారం, అపోహలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వాటిని బ్లాక్‌ చేసినట్లు చెప్పింది. రష్యా చెందిన 2వేలకుపైగా యూట్యూబ్ చానల్స్‌పై వేటు వేసినట్లు పేర్కొంది.

ఏఐకి మించిన మానవ మేధ

ఆట్‌కోడర్ వరల్డ్ టూర్ ఫైనల్స్ 2025 హ్యూరిస్టిక్ కాంటెస్టు లో పోలెండ్‌కు చెందిన ప్రోగ్రామర్ ప్రజెమిస్వాఫ్ డెబియాక్ (సైహో) అపూర్వమైన విజయాన్ని అందుకున్నాడు. ఓపెన్‌ఏఐ అత్యాధునిక కోడింగ్ టూల్‌ను మట్టికప్పించి మొదటి స్థానాన్ని సాధించాడు ఈ పోటీకి ఓపెన్‌ఏఐ టూల్ కూడా పోటీదారుగా పాల్గొనడం విశేషం. కానీ, ఫలితాల్లో మానవ మేధస్సు పైచేయి సాధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా మానవులు సృజనాత్మకంగా, బలంగా నిలబడగలరని ఈ పోటీ స్పష్టంగా తెలియజేసింది. సైహో చేసిన పని ఓ […]

రీల్స్ చూసి, చూసి వేళ్లు నొప్పులు పెడుతున్నాయా.? ఆటో స్క్రోల్ ఫీచ‌ర్ వ‌చ్చేస్తోంది

ఇన్‌స్టాగ్రామ్ విజ‌య‌వంతంలో రీల్స్ ఒక కార‌ణ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక రీల్ పూర్తికాగానే మ‌రో రీల్ చూడాలంటే స్క్రీన్‌పై స్క్రోల్ చేయాల‌నే విష‌యం తెలిసిందే. ఆటో స్క్రోల్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచ‌ర్ స‌హాయంతో ఇక‌పై స్క్రోల్ చేయాల్సిన అవస‌రం ఉండ‌దు. ఒక వీడియో పూర్తవగానే దానంత‌ట‌దే తదుపరి వీడియోకి జంప్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను ఇప్పుడు కొంత‌మంది ఎంపిక చేసిన యూజర్లతో ప‌రీక్షిస్తోంది. ఆటో స్క్రోల్ వ‌ల్ల డిజిటల్ అడిక్షన్ పెరిగే ప్రమాదం […]

తెలంగాణలో ఇకపై ఈ-చిప్ ఎనేబుల్డ్ పాస్‌పోర్టులు

తెలంగాణలో కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఇకపై ‘ఈ-చిప్ ఎనేబుల్డ్’ పాస్‌పోర్టులు జారీ కానున్నాయి. విదేశాంగ శాఖ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో ఈ-పాస్‌పోర్టులను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించినట్లు రీజనల్ పాస్‌పోర్ట్ అధికారి జె. స్నేహజా తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాస్‌పోర్టులు ఉపయోగిస్తున్నవారు వాటి చెల్లుబాటు కాలం పూర్తయ్యే వరకు ఉపయోగించవచ్చు. వారి పాస్‌పోర్టు చెల్లుబాటు ముగిసిన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే.. వెరిఫికేషన్ తదితర ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ-చిప్ పాస్‌పోర్టులను […]

ఈ వీడియోలు చేస్తోంది ఆడవాళ్లు కాదా!

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మరింత సంచలనంగా మారింది. ఆ వీడియోలో అమ్మాయిలు జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. అంతా శృంగారానికి సంబంధించిన డబుల్ మీనింగ్ కంటెంటే. ఈ వీడియోల్లో కనిపిస్తున్న వారు నిజమైన అమ్మాయిలు కాదని, AI సాయంతో వీటిని రూపొందించారని తేలింది. కొంత మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఈ అశ్లీల కంటెంట్‌తో వీడియోలు రూపొందించి వైరల్ చేస్తున్నట్లు భావిస్తున్నారు. మహిళలు బూతులు మాట్లాడుతున్నట్లు ఉన్న ఈ వీడియోలన్నీ ఏఐ టూల్స్‌తో రూపొందించినవేనని పోలీసులు ప్రాథమికంగా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON