loader

నాసాలో కొత్త నియామకం.. భారత సంతతికి చెందిన వ్యక్తికి కీలక బాధ్యతలు!

అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో కొత్త నియామకం జరిగింది. భారత సంతతికి చెందిన అమెరికన్ శాస్త్రవేత్త అమిత్ క్షత్రియకు ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించింది. అంతరిక్ష సంస్థ ఆయనను నాసా కొత్త అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. అమిత్ గత 20 సంవత్సరాలుగా నాసాతో అనుబంధం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ సంస్థ అగ్ర నాయకత్వంలో చేరాడు. అమిత్ నియామకం చంద్రుడు, అంగారక గ్రహాల కోసం అమెరికా ప్రణాళికలకు కొత్త ఊపునిస్తుందని నాసా తాత్కాలిక నిర్వాహకుడు సీన్ పి. […]

ప్రపంచవ్యాప్తంగా చాట్ జిపిటి సేవలకు అంతరాయం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ చాట్ జిపిటి సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా చాట్ జిపిటి వినియోగదారులు తాము సమస్యను ఎదుర్కొంటున్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. డౌన్ డిటెక్టర్ ప్రకారం గత 20 నిమిషాలుగా వందలామాది చాట్ జిపిటి వినియోగదారులు తమ సమస్యలను రిపోర్ట్ చేస్తున్నారని తెలిపింది.

చారిత్రాత్మక క్షణం..! తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ చిప్ అందుకున్న ప్రధాని మోదీ

కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం భారతదేశంలో తయారు చేసిన తొలి చిప్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అందజేశారు. మంత్రి వైష్ణవ్ విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్, నాలుగు ఆమోదించిన ప్రాజెక్టుల టెస్ట్ చిప్‌లను కూడా ప్రధాని మోదీకి అందించారు. నేటి సాంకేతికతకు సెమీకండక్టర్లు చాలా ముఖ్యమైనవి. ఆరోగ్య సంరక్షణ, రవాణా, కమ్యూనికేషన్, రక్షణ, అంతరిక్షం వంటి ముఖ్యమైన వ్యవస్థలలో ఇది ఉపయోగించడం జరుగుతుంది.

సిన్క్లేర్ సీఈఓ చేతుల మీదుగా ఇండియా డిజైన్ చేసిన చిప్ ఆవిష్కరణ

సెమికాన్ ఇండియా 2025 కాన్ఫరెన్స్‌కు ముందు, అమెరికాకు చెందిన సిన్క్లేర్ సంస్థ భారతదేశంలో తయారైన డైరెక్ట్ టు మొబైల్ (D2M) చిప్‌ ఆధారిత టాబ్లెట్‌ను ప్రదర్శించింది. ఈ చిప్‌ను సాంక్య ల్యాబ్స్ అభివృద్ధి చేయగా.. ఇది ఇంటర్నెట్ లేకుండానే టీవీ ప్రసారాలను నేరుగా మొబైల్ ఫోన్‌లకు అందించగలిగే ప్రపంచంలోనే మొదటి టెక్నాలజీ. చిప్‌లో ఉపయోగించిన ప్రుత్వి-3 ATSC 3.0 చిప్‌సెట్ భారత శాస్త్రవేత్తల తేజస్సుకు గొప్ప ఉదాహరణ.

ఎలన్ మస్క్‌ది ఎంత పెద్ద మనసు, గ్రోక్ ఇమాజిన్ ఫ్రీగా వాడుకోవచ్చు

X, టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత అయతే ఎలాన్ మస్క్ కమర్షియల్ వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకున్నారు. అయితే తన కొత్త AI సాధనం గ్రోక్ ఇమాజిన్‌ను మాత్రం ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఇది కావాలంటే కొంత డబ్బులను చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యూజర్లకు ఇది ఫ్రీ. గ్రోక్ ఇమాజిన్ సాధనం అనేక AI మోడళ్లను కలిగి ఉంది. దీన్ని సాయంతో చిత్రాలను సృష్టించవచ్చు. అలాగే 6 సెకన్ల వీడియోలను సంగీతంతో సృష్టించవచ్చు. ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు. ఫిల్టర్లు, […]

గగన్‌యాన్ వ్యోమగాముల సురక్షిత ల్యాండింగ్‌కు కీలక పరీక్ష పూర్తి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘గగన్‌యాన్’ మిషన్ కోసం మొదటి సమగ్ర వాయు డ్రాప్ పరీక్ష (IADT-01)ను విజయవంతంగా నిర్వహించింది. అంతరిక్ష ప్రయాణం పూర్తి చేసిన తరువాత వ్యోమగాములు భూమికి సురక్షితంగా తిరిగి రావడం ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం. పరీక్ష సమయంలో, ఒక నమూనా క్రూ మాడ్యూల్ను విమానం నుంచి కిందకి వదిలారు. దీనిని ప్రత్యేకంగా రూపొందించిన పారాచూట్ వ్యవస్థ ఉపయోగించి సున్నితంగా భూమిపైకి దించారు. మాడ్యూల్ సురక్షితంగా దిగింది, దీనితో పారాచూట్ వ్యవస్థ […]

త్వరలో చంద్రయాన్​-4 వెల్లడించిన శుక్లా

జాతీయ అంతరిక్ష దినోత్సవం 2025 సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఇస్రో చీఫ్ వి. నారాయణన్ మరియు వ్యోమగామి శుభాంశు శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తదుపరి అంతరిక్ష మిషన్లపై వివరాలు వెల్లడించిన నారాయణన్, చంద్రయాన్-4లో భాగంగా వీనస్ ఆర్బిటర్ మిషన్ చేపడతామని చెప్పారు. ఇదే సమయంలో, శుభాంశు శుక్లా ప్రస్తుత కాలాన్ని భారత అంతరిక్ష పరిశోధనకు “స్వర్ణ యుగం“గా అభివర్ణించారు. చంద్రయాన్-4 మిషన్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి.2040 నాటికి భారత్ చంద్రునిపై అడుగుపెట్టడం లక్ష్యమని” స్పష్టం […]

అమెరికాలో భారత ఇంజినీర్‌కు భారీ జరిమానా

భారత సంతతి ఏఐ ఇంజినీర్ ఇంటెల్ కంపెనీకి చెందిన గోప్య సమాచారం మైక్రోసాఫ్ట్‌కి లీక్ చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా నిలిచిన వరుణ్ గుప్తాకు అమెరికా కోర్టు $34,472 జరిమానావిధించింది. అంతే కాదు, అతను రెండేళ్ల పాటు ప్రొబేషన్‌లో ఉండాలన్న ఆదేశం కూడా జారీ చేసింది. 2020లో వరుణ్ ఇంటెల్‌ను వీడి మైక్రోసాఫ్ట్‌లో చేరాడు. ఆ సమయంలోనే అతను ఇంటెల్‌లోని కీలక డాక్యుమెంట్స్‌ను మైక్రోసాఫ్ట్‌కి పంపినట్టు తేలింది. ఇవి అతనికి ఉద్యోగం సాధించడంలో కీలక పాత్ర పోషించాయని […]

ఐఫోన్‌ను హ్యాక్‌ చేస్తే కోట్ల రూపాయలు- ఆపిల్‌

ఐఫోన్‌ను హ్యాక్‌ చేస్తే కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు ఆపిల్‌ సంస్థ ప్రకటించింది. యాపిల్ సెక్యూరిటీ బౌంటీ కార్యక్రమంలో భాగంగా ఐఫోన్‌ సిస్టమ్స్‌ను బ్రేక్‌ చేసిన వారికి రూ.16 కోట్ల నగదు బహుమతిని అందిస్తామని ప్రకటించింది. ఆపిల్ కంపెనీ సెక్యూరిటీ బౌంటీ కింద ఐదు రకాల కేటగిరీల్లో అవార్డ్స్ పొందవచ్చు. లాక్‌స్క్రీన్ బైపాస్ వంటి ఫిజికల్ యాక్సెస్ ద్వారా డివైజ్ అటాక్ యూజర్ ఇంటరాక్షన్‌తో నెట్‌వర్క్ హ్యాక్ చేయడంగా ద్వారా,సింగిల్-క్లిక్‌తో సెన్సిటివ్ డేటాకు అనధికార యాక్సెస్,వన్-క్లిక్‌తో ప్రివిలేజ్ ఎలివేషన్‌తో […]

ఐఐటీలో డ్రైవర్‌లెస్ బస్సులు.. దేశంలోనే తొలి ప్రయోగం!

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్‌ క్యాంపస్‌ ఇప్పుడు నూతన యుగానికి నాంది పలికింది. దేశంలో తొలిసారిగా విద్యాసంస్థ ప్రాంగణంలో పూర్తిగా డ్రైవర్ లేని బస్సులు రవాణా సేవలు అందించటం గర్వకారణం. ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టీహన్)’ IIT హైదరాబాద్‌లో ఈ ప్రత్యేక విభాగం పూర్తిగా దేశీయంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.ప్రస్తుతం క్యాంపస్‌లో రెండు మోడళ్ల బస్సులు నడుస్తున్నాయి. ఇవి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి క్యాంపస్‌లో రవాణా సేవలు అందిస్తున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON