loader

జియో- స్టార్‌లింక్ ఒప్పందం..

జియో ప్లాట్‌ఫామ్స్, స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని, భారత్‌లో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనుంది. భారతదేశంలోని తన కస్టమర్లకు స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి స్పేస్‌ఎక్స్‌తో ఒక ఒప్పందాన్ని ప్రకటించింది. ఇది భారతి ఎయిర్‌టెల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న తరువాత జరిగిన పరిణామం. ఈ ఒప్పందం, స్పేస్‌ఎక్స్ ఇండియాలో స్టార్‌లింక్‌ను అమ్మేందుకు అవసరమైన అనుమతులు పొందే ఆమోదంపై ఆధారపడి ఉంటుంది.

SpaceX తో ఎయిర్‌టెల్‌ జట్టు

టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్‌ తన కస్టమర్లకు వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలకోసం ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో జట్టుకట్టింది. దీనిపై ఇరు సంస్థలు నేడు అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో స్టార్‌లింక్స్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందించడానికి వీలు పడనున్నది. ఈ సందర్భంగా ఎయిర్‌టెల్‌ ఎండీ గోపాల్‌ విఠల్‌ మాట్లాడుతూ..భారత్‌లో ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు స్పేస్‌ఎక్స్‌తో పనిచేయడం ఓ మైలురాయి వంటిదన్నారు. కస్టమర్లకు శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు అందించడానికి కట్టుబడివుందనడానికి ఈ ఒప్పందం […]

ఎక్స్ పై భారీ సైబర్ దాడి : ఎలాన్ మస్క్ ఆరోపణ

సోషల్ మీడియా వేదిక ఎక్స్ (గతంలో ట్విట్టర్)పై భారీ సైబర్ దాడి జరిగిందని దాని యజమాని ఎలాన్ మస్క్ ఆరోపించారు. ఈ దాడి చేయడానికి చాలా వనరులు ఉపయోగించారని, దీన్ని ఏదైనా పెద్ద సమూహం లేదా దేశమే చేసి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ సైబర్ దాడి వల్ల ప్లాట్‌ఫామ్ అంతటా అంతరాయం ఏర్పడింది, వేల మంది యూజర్లు తమ ఖాతాల్లోకి లాగిన్ అవ్వలేకపోయారు.

సునీతా విలియమ్స్ భూమిపైకి వచ్చే రోజుపై క్లారిటీ

అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ భూమిపైకి వచ్చే రోజుపై క్లారిటీ వచ్చేసింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్‌ స్పేస్‌షిప్‌లో వారు అంతరిక్షం నుంచి భూమికి తిరిగిరానున్నట్లు నాసా అధికారులు తేల్చి చెప్పారు. 2025 మార్చి 16వ తేదీన సునీత, విల్‌మోర్ ఇద్దరూ తిరిగి భూమిపైకి వస్తారని తాజాగా నాసా అధికారులు వెల్లడించారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ 10 రోజుల మిషన్‎లో భాగంగా గతేడాది జూన్‎ 5వ తేదీన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోకి వెళ్లి […]

రోదసిలో తొలిసారి వాణిజ్య నిఘా.. దక్షిణ అమెరికాను చిత్రీకరించిన భారత శాటిలైట్‌

ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష నిఘా ఉపగ్రహం కార్యకలాపాలు శనివారం ప్రారంభమయ్యాయి. దీనిని స్పేస్‌ కెమెరా ఫర్‌ ఆబ్జెక్ట్‌ ట్రాకింగ్‌ (ఎస్‌సీఓటీ) అంటారు. ఈ నిఘా ఉపగ్రహం భూ కక్ష్యలో తిరుగుతూ భూమిపై గల 5 సెంటీమీటర్ల వస్తువును సైతం చిత్రీకరించగలదు. భారత స్టార్టప్‌ ‘దిగంతర’ జనవరి 14న ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ ట్రాన్స్‌పోర్టర్‌-12 రాకెట్‌ ద్వారా ప్రయోగించింది. ఈ ఉపగ్రహం తన పనిలో భాగంగా మొదట దక్షిణ అమెరికాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌ నగరాన్ని చిత్రీకరించింది.

మళ్లీ పేలిన మస్క్​ రాకెట్.. ఈ ఏడాదిలో రెండోసారి..

ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ షిప్ 8 ప్రయోగించిన కొంత సమాయానికే పేలిపోయింది. గురువారం నాడు స్టార్‌షిప్ 8 బహామాస్ మీదుగా పేలిపోయింది. ఫిబ్రవరి 6న స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన స్టార్‌షిప్ రాకెట్ కొన్ని నిమిషాలకే నియంత్రణ కోల్పోయింది. దక్షిణ ఫ్లోరిడా, బహమాస్ సమీపంలో స్టార్ షిప్ పేలిపోయి, శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదం తర్వాత కరేబియన్ ప్రాంతంలో పలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చిందని ఫ్లైట్ రాడార్ 24 రిపోర్ట్ చేసింది.

ఇంధనం లేకుండానే అంతరిక్ష ప్రయాణం! . . . నూతన ‘శక్తి’ ఆవిష్కరణ?

నాసా శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనల్లో గేమ్‌ఛేంజర్‌ లాంటి ఆవిష్కరణ చేశారు. ఇంధనం లేకుండానే అంతరిక్షంలో ప్రయాణించేందుకు వీలుగా నూతన ‘శక్తి’ని కనుగొన్నట్టు, విద్యుత్తు క్షేత్రాలను వినియోగించడం ద్వారా ఇంధనం లేకపోయినా రాకెట్లకు కావాల్సిన థ్రస్ట్‌ను ఇది అందిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు నాసాకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ చార్లెస్‌ బుహ్లెర్‌ తెలిపారు. నాసా చెప్పేది నిజమైతే  అంతరిక్ష ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులు జరుగుతాయి. ఇంధనం లేకుండానే అంతరిక్ష మిషన్లను చేపట్టవచ్చు. అయితే, ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి […]

AI లో ఎలాన్ మస్క్ కే సవాల్ విసురుతున్న ఐఐటియన్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు (Elon Musk) కే ఛాలెంజ్ విసిరిన భారతీయ ఐఐటీయన్ అరవింద్ శ్రీనివాస్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) నుంచి ఫండింగ్ తెచ్చుకోకుండా నన్ను ఆపు అని ఏకంగా ఎలాన్ మస్క్‌కు సవాల్ విసిరాడు అరవింద్ శ్రీనివాస్. గూగుల్, OpenAI లాంటి పెద్ద టెక్ కంపెనీల్లో పనిచేసిన ఈ కుర్రాడు ఇప్పుడు Perplexity AI ని స్థాపించారు.

గూగుల్ నుంచి కీలక అప్‌డేట్‌.. వివరాలు తొలగించడం సులభం!

ఇంటర్నెట్ ఉపయోగించే దాదాపు అందరూ ఏదైనాతెలుసుకోవాలనుకుంటే దాన్ని గూగుల్‌లో వెతుకుతారు.  వ్యక్తుల వ్యక్తిగత సమాచారం కూడా సెర్చింగ్‌ రిజల్డ్‌లో ఉంటుంది. ఇప్పుడు గూగుల్ సెర్చింగ్‌ ఫలితాల నుండి వ్యక్తిగత సమాచారాన్ని తొలగించడాన్ని సులభతరం చేసింది. అయితే మీరు సెర్చ్‌ చేసింది కనిపించకూడదని మీరు భావిస్తే, సులభంగా తొలగించడానికి గూగుల్ కొత్త ఇంటర్‌ఫేస్‌ను ప్రారంభించింది. వినియోగదారులు వారి వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్ నంబర్,  లాగిన్ మొదలైన వాటిని తొలగించవచ్చు.

జాతీయ సైన్స్‌ దినోత్సవం. . .

సైన్స్ మన జీవితాలపై చూపిన ప్రభావాన్ని గుర్తుచేసేందుకు ఈ నేషనల్‌ సైన్స్‌ డే జరుపుకుంటారు. భారత శాస్త్రవేత్త, వైద్యుడు సర్‌ సి.వి. రామన్ కనుగొన్న ‘రామన్ ఎఫెక్ట్’ 1928 ఫిబ్రవరి 28వ తేదీన అమల్లోకి వచ్చింది. ఈ చారిత్రాత్మక దినోత్సవాన్ని స్మరించుకునేందుకు ఏటా ఒక్కో థీమ్‌తో జాతీయ సైన్స్‌ దినోత్సవం జరుపుతుంటారు. 2025వ సంవత్సరంలో ”వికసిత్ భారత్ కోసం సైన్స్ మరియు ఇన్నోవేషన్‌లో గ్లోబల్ లీడర్‌షిప్ కోసం భారతీయ యువతకు సాధికారత” థీమ్‌తో ఈ జాతీయ సైన్స్‌ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON