2030 నాటికి అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీ భారత్ : సత్యనాదెళ్ల
2030 నాటికి ప్రపంచంలో అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా భారత్ అవతరిస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. భారత్లో మైక్రోసాఫ్ట్ సేవలు విస్తృతమవుతున్నాయని పేర్కొన్నారు. 2030 నాటికి దేశంలో 57.5 మిలియన్ల డెవలపర్లు ఉంటారని అంచనా వేశారు. ఏఐని ఉపయోగించి సామాజిక సమస్యల పరిష్కారాలు కనుగొనేందుకు ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ప్రపంచ కంప్యూటర్గా అజ్యూర్ను రూపొందిస్తున్నామని అన్నారు. గురువారం బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యనాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు.

