loader

సోషల్ మీడియాలో సైలెన్స్ బ్రేక్ చేసిన విరాట్ కోహ్లి.. న్యూ ఇయర్ పోస్ట్ వైరల్

భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి చేసిన ఓ సోషల్‌ మీడియా పోస్టు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. న్యూ ఇయర్‌ సందర్భంగా కోహ్లి షేర్‌ చేసిన తాజా పోస్టు అభిమానుల హృదయాలను తాకింది. “నా జీవితాన్ని కాంతులతో నింపే అత్యంత ముఖ్యమైన, విలువైన వ్యక్తితో కలిసి 2026లోకి అడుగుపెడుతున్నాను” అంటూ అనుష్క శర్మతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశాడు. ఈ పోస్టు నిమిషాల్లోనే వైరల్‌గా మారి, పది మిలియన్లకు పైగా లైక్‌లు, వ్యూస్‌తో ఇంటర్నెట్‌ను షేక్‌ చేసింది.

అర్జున్‌కు ప్రధాని మోడీ అభినందనలు

దోహా వేదికగా జరిగిన ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశిని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం అభినందించారు. అర్జున్ విజయం దేశ యువతకు స్ఫూర్తిగా పనిచేస్తుందన్నారు. ప్రపంచ చెస్‌లో భారత్ హవా నడుస్తుందన్నారు. దీనికి ప్రపంచ చెస్‌లో దేశ క్రీడాకారులు సాధిస్తున్న పతకాలే నిదర్శనమన్నారు. బ్లెట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించి అర్జున్ భారత ఖ్యాతిని ఇనుమడింప చేశాడని ప్రశంసించారు.

ఫైనల్​లో శ్రీలంకపై విజయం- టీ20 సిరీస్ భారత్​ సొంతం

శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్​లో భారత్ 15 పరుగుల తేడాతో​ విజయం సాధించింది. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు  చివరి మ్యాచ్​ కూడా గెలిచి శ్రీలంకను వైట్​వాష్ చేసింది. ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్  20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో ఛేదనకు శ్రీలంక మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.

చిన్న తప్పుతో 12 ఏళ్ల బాలుడి చేతిలో గుకేష్ ఘోర పరాజయం..!

ప్రపంచ చెస్ రంగంలో సరికొత్త సంచలనం సృష్టించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ డి.గుకేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో కేవలం 12 ఏళ్ల రష్యన్ బాలుడు సెర్గీ స్క్లోకిన్ చేతిలో గుకేష్ అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. గెలిచే స్థితిలో ఉండి కూడా ఒక చిన్న పొరపాటు కారణంగా గుకేష్ ఈ మ్యాచ్‌ను కోల్పోవడం ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశమైంది. ఇటీవలే ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత స్టార్ డి.గుకేష్, […]

శ్రీలంకపై భారత్ ఘనవిజయం

శ్రీలంకతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ మహిళా జట్టు 30 పరుగుల తేడాగా విజయం సాధించింది. దీనితో 5 మ్యాచ్​ల సిరీస్​లో 4 విజయాల అధిక్యంలోకి వెళ్లింది.  చివరి మ్యాచ్​లో కూడా గెలిచి శ్రీలంకను వైట్​వాష్ చేస్తారో లేదో చూడాలి. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోర్ చేసింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 221 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. అయితే భారత్ విధించిన 221 టార్గెట్​ను […]

ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీకి అరుదైన గౌరవం

ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌ లీకి అరుదైన గౌరవం దక్కింది. తాజాగా బ్రెట్‌లీ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోకి ప్రవేశించాడు. అత్యంత అరుదైన ఈ జాబితాలో లీ 66వ ఆటగాడిగా చేరాడు. లీ కంటే ముందు ఇదే ఏడాది (2025) మైఖేల్ క్లార్క్, మైఖేల్ బెవాన్, క్రిస్టినా మాథ్యూస్ ఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్, అలెన్ బోర్డర్, షేన్ వార్న్, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలు […]

IPL 2026 సీజన్‌కి ముందే యశ్ దయాల్ అరెస్ట్?

ఐపీఎల్ 2025 సీజన్ టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆర్‌సీబీ బౌలర్ యశ్ దయాల్, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐదేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని యశ్ దయాల్‌పై  పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. అలాగే మరో 17 ఏళ్ల అమ్మాయి కూడా తనపై యశ్ దయాల్,  లైంగిక దాడి పాల్పడినట్టు ఫిర్యాదు చేసింది. posco యాక్ట్‌లో ఇరుక్కున్న యశ్ దయాల్, త్వరలోనే యశ్ దయాల్‌ని అదుపులోకి తీసుకోబోతున్నారు పోలీసులు. ఐపీఎల్ 2026 సీజన్‌లో యశ్ దయాల్ అందుబాటులో ఉండడం అనుమానమే.

విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్..!

సుమారు 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోకి అడుగుపెట్టిన కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. అయితే, అతనికి నగదు బహుమతిగా కేవలం రూ. 10,000 మాత్రమే అందజేశారు. “కోహ్లీ కారు సర్వీసింగ్‌కు కూడా ఈ డబ్బు సరిపోదు” అని ఒకరు, “బీసీసీఐకి అంత కరువు వచ్చిందా?” అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. అంతర్జాతీయ స్టార్ ఆడుతున్నప్పుడు ఈ మొత్తం […]

బాల పుర‌స్కారం అందుకున్న క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ

ప్ర‌ధాన‌మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కారాన్ని యువ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ అందుకున్నారు. రాష్ట్ర‌ప‌తి ముర్ము చేతుల మీదుగా 14 ఏళ్ల ఆ క్రికెట‌ర్ అవార్డును స్వీక‌రించారు. ఢిల్లీలో ఇవాళ ఆ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ధైర్య‌సాహ‌సాలు, క‌ళ‌లు, సంస్కృతి, ప‌ర్యావ‌ర‌ణం, ఇన్నోవేష‌న్‌, సైన్స్ అండ్ టెక్నాల‌జీ, క్రీడ‌ల్లో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన‌ వారికి బాల పుర‌స్కారాన్ని ప్ర‌తి ఏడాది అంద‌జేస్తారు.

అథ్లెటిక్ జ్యోతి యర్రాజీకి ప్రభుత్వ సహకారం

భారత హర్డిల్ క్వీన్, తెలుగు తేజం జ్యోతి యర్రాజీ పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతోంది. ఆమె 100 మీటర్ల హార్డిల్స్ లో 12.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరి సరికొత్త రికార్డు సృష్టించారు. జ్యోతి యర్రాజి తండ్రి సూర్యనారాయణ స్థానికంగా సెక్యూరిటీ గార్డు. రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ సహకారంతో జ్యోతి యర్రాజీ అథ్లెటిక్స్‌లో రాణిస్తోంది. ఆమెకు సంబంధించిన ట్రైనింగ్, న్యూట్రిషన్ రిలయన్స్ ఫౌండేషన్ చూసుకుంటుంది. జ్యోతి యర్రాజీకి ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తామని, ఏపీ శాప్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON