టీ20 ప్రపంచ కప్ 2026.. 100 మందికి పైగా బంగ్లా జర్నలిస్టుల అక్రిడేషన్ తిరస్కరణ
టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ తీసుకుంటున్న నిర్ణయాలపై వివాదం మరింత ముదురుతోంది. ఈ మెగా టోర్నీ(T20 World Cup 2026) కవరేజీ కోసం అప్లై చేసుకున్న ఏకంగా వంద మందికి పైగా బంగ్లా జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలుస్తోంది. బంగ్లా మీడియాను ఐసీసీ దూరం పెట్టడం వెనుక కారణాలేమీ తెలియరాలేదు. బీసీబీ(BCB) మీడియా కమిటీ ఛైర్మన్ అంజద్ హుస్సేన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

