loader

టీ20 ప్రపంచ కప్ 2026.. 100 మందికి పైగా బంగ్లా జర్నలిస్టుల అక్రిడేషన్ తిరస్కరణ

టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ తీసుకుంటున్న నిర్ణయాలపై వివాదం మరింత ముదురుతోంది. ఈ మెగా టోర్నీ(T20 World Cup 2026) కవరేజీ కోసం అప్లై చేసుకున్న ఏకంగా వంద మందికి పైగా బంగ్లా జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలుస్తోంది. బంగ్లా మీడియాను ఐసీసీ దూరం పెట్టడం వెనుక కారణాలేమీ తెలియరాలేదు. బీసీబీ(BCB) మీడియా కమిటీ ఛైర్మన్‌ అంజద్ హుస్సేన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

అభిషేక్, సూర్య ఊచకోత..10 ఓవర్లలోనే భారత్ ఘన విజయం

మూడో టీ20లో టీమిండియా బ్యాటర్లు న్యూజీలాండ్ బౌలర్లను ఊచకోత కోశారు. మ్యాచ్ ప్రారంభం నుంచే బౌండరీల వర్షం కురిపించారు. సూర్య 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సులతో 57 పరులతో అజేయ హాఫ్ సెంచరీ సాధించాడు. వన్ డౌన్ లో వచ్చిన ఈషాన్ కిషన్ భారీ సిక్సులతో కివీస్ బౌలర్లకు షాకిచ్చాడు. కిషన్ 13 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సులతో 28 పరుగులు చేశాడు. దీంతో భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం […]

క్రీడా దిగ్గజాలకు పద్మ పురస్కారాలు..

భారత టెన్నిస్ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన విజయ్ అమృత్‌రాజ్‌కు గౌరవప్రదమైన ‘పద్మభూషణ్’ లభించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ‘పద్మశ్రీ’ వరించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక రికార్డులు సృష్టించిన రోహిత్, 2024లో భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించి దేశం గర్వపడేలా చేశారు. మహిళా క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ‘పద్మశ్రీ’కి ఎంపికయ్యారు.ఆమెతో పాటు హాకీ గోల్‌కీపర్ సవితా పునియా, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఫుట్‌బాల్ దిగ్గజం ఐ.ఎం. విజయన్‌లకు […]

మాకు ఇది గోల్డెన్ ఛాన్స్!- వరల్డ్​కప్​ ఎంపిక​​పై స్కాట్లాండ్ రియాక్షన్

బంగ్లా స్థానాన్ని తమ జట్టుతో రిప్లేస్​ చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించగానే స్కాట్లాండ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. తమ జట్టు స్టార్ ఆటగాళ్లు ప్రాక్టీస్​ చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది. దీనికి ‘ఎల్లప్పుడూ సిద్దమే’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీనిపై స్కాట్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రూడీ లిండ్‌బ్లేడ్ (Trudy Lindblade) శనివారం మాట్లాడారు. తమ జట్టును వరల్డ్​కప్​ టోర్నీకి ఆహ్వానించినందుకు ఐసీసీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

చరిత్ర సృష్టించిన PV సింధు- భారత తొలి షట్లర్​గా అరుదైన రికార్డ్

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అరుదైన రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 500 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఇండోనేషియా మాస్టర్స్‌ 2026లో భాగంగా డెన్మార్క్‌ క్రీడాకారిణి లైన్‌ హోజ్‌మార్క్‌ను వరుస సెట్లలో ఓడించి ఈ ఘనతను సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్‌ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో ఇప్పటి వరకు ఈ రికార్డును ఐదుగురు మాత్రమే అందుకున్నారు. ఇప్పుడు ఆరో ప్లేయర్‌గా సింధు నిలిచింది. భారత్‌ తరఫున ఈ ఘనత నెలకొల్పింది సింధునే.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బిసిఎ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ ఆడిన ఐదు మ్యాచుల్లో ముంబై 2 మ్యాచుల్లో విజయం సాధించి 4 పాయింట్లతో టేబుల్‌లో రెండో స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ ఆడిన 4 మ్యాచుల్లో కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే గెలిచి 2 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది.

నా రిటైర్మెంట్‌కు అదే కారణం.. బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు పలికిన సైనా

భారత మహిళల బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ సంచలన ప్రకటన చేశారు. బ్యాడ్మింటన్‌ ఆటకు వీడ్కోలు పలికారు. ‘నేను రెండేళ్ల కిందటే ఆడటం ఆపేశాను. ఎంతో ఇష్టంతో నా అంతట నేను ఆటలోకి వచ్చా. ఇప్పుడు నా అంతట నేను నిష్క్రమిస్తున్నా. ఆర్థరైటిస్ వచ్చింది.. కార్టిలేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. గతంలోలాగా ఎక్కువ సమయం తీవ్రమైన శిక్షణను తట్టుకోలేకపోయాను. ఇక చాలు. ఇంతకంటే నేను కష్టపడలేను అని. అందుకే ఆటకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాను’ అని సైనా […]

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

మహిళల ప్రీమియర్ లీగ్-2026లో మరో ఆసక్తికర మ్యాచ్ వడోదర బిసిఎ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ జెయింట్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచుల్లో విజయం సాధించి.. ఆర్‌సిబి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇక ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు మ్యాచుల్లో గెలిచిన గుజరాత్ మూడోస్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే అభిమానుల్లో […]

చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB

కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కి రాసిన లేఖలో, RCB ఫ్రాంచైజీ చిన్నస్వామి స్టేడియంలో 300-350 AI-ఎనేబుల్డ్ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇది ప్రజల కదలికలను పర్యవేక్షించడానికి, పెద్ద క్యూ లైన్లు, స్టేడియం ఎగ్జిట్ ప్రాంతాలను కూడా పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది. స్టేడియంలో AI కెమెరాలను ఏర్పాటు చేసే ఖర్చును తామే భరిస్తామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ (RCB) తెలిపింది. దీని మొత్తం వ్యయం దాదాపు 4.5 కోట్ల రూపాయలు కావచ్చని తెలుస్తోంది.

రాజ్‌కోట్ వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ అలవోక విజయం

రాజ్‌కోట్‌లో భారత్ vs న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ జరిగిన 2వ వన్డేలో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 284 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ బ్యాటర్లు అలవోకగా చేధించారు. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి న్యూజిలాండ్ జట్టు 286 పరుగులు సాధించి.. మూడు మ్యాచ్‌ల వన్డే సీరిస్‌ను 1-1తో సమం చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్(131), విల్ యంగ్ 98 బంతుల్లో 87 పరుగులు సాధించి జట్టు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON