loader

రాంబాబుకు బెయిల్‌ మంజూరు

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023లో సత్తెనపల్లి ప్రాంతంలో నిర్వహించిన సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారానికి సంబంధించిన అవినీతి కేసులో ఆయనకు ఉపశమనం లభించింది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

జగన్..నా దుడ్లతోనే మ్యాచ్ చూశాను..నీ దుడ్లను ఏమైనా ఖర్చు చేశానా?: లోకేష్

టి20 వరల్డ్ కప్‌లో భాగంగా పాక్-టిమిండియా జరిగిన మ్యాచ్‌ను ఎపి మంత్రి నారా లోకేష్ కొలంబో స్టేడియంలో వీక్షించారు. ప్రభుత్వ సొమ్మును మంత్రి లోకేష్ వృధా ఖర్చు చేస్తున్నారని వైసిపి నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఫ్లైట్ టికెట్ తనదేనని, మ్యాచ్ టికెట్ కూడా తనదేనని అని తెలిపారు. తన దుడ్లతోనే మ్యాచ్ చూశానని, వైసిపి అధినేత జగన్ దుడ్లను ఏమైనా ఖర్చు […]

క్యాతన్ పల్లిలో కొనసాగుతున్న బంద్

మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లిలో బంద్ కొనసాగుతుంది. బిఆర్ఎస్, సిపిఐ బంద్‌కు పిలుపునివ్వడంతో వ్యాపారులు సంపూర్ణంగా బంద్‌లో పాల్గొన్నారు. బిఆర్ఎస్ బంద్‌తో క్యాతన్‌పల్లిలో హైటెన్షన్ కొనసాగుతోంది. చైర్మన్ ఎన్నిక వాయిదాను నిరసిస్తూ బిఆర్ఎస్, సిపిఐ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. దీంతో బిఆర్ఎస్, సిపిఐ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిన్నటి రాళ్ల దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అరెస్టు పర్వం కొనసాగుతుంది.

శాసనమండలిలో తిరుమల కల్తీ నెయ్యిపై చర్చ

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ వ్యవహారం పై చర్చకు వైసీపీ పట్టుబడుతోంది. మంగళవారం, బుధవారం కూడా వైసీపీ తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు. ఇందాపూర్, హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చకు తీర్మానాన్ని అందజేయగా, ఛైర్మన్ దానిని డిస్మిస్ చేశారు.మండలి విపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో ఇందాపూర్, హెరిటేజ్ నెయ్యి సరఫరాపై అసెంబ్లీలో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, అందుకే మండలిలో చర్చకు డిమాండ్ […]

వన్ క్లాస్-వన్ టీచర్ స్కూల్స్‌ను 33శాతానికి పెంచాం: మంత్రి నారా లోకేశ్

శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు. ‘గత ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా 233 పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా పాఠశాల విద్యాభివృద్ధిలో వన్ క్లాస్ – వన్ టీచర్ విధానం చాలా కీలకమైంది. గతంలో 3శాతం పాఠశాలల్లో మాత్రమే వన్ క్లాస్ – వన్ టీచర్ ఉంటే, ఇప్పుడు 33శాతానికి పెంచాం. దీనిద్వారా పిల్లలకు మెరుగైన విద్య అంది, పరీక్షల్లో మెరుగైన […]

తెలంగాణ భవన్‌లో ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. మాజీమంత్రి, కేసీఆర్ 72 వ జన్మదినాన్ని పురస్కరించుకుని 72 కిలోల భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమం నేపథ్యంతో రూపొందించిన పాటలు, డాక్యుమెంటరీ ని ప్రదర్శించారు.

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నుంచి కాపాడండి

డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు నుంచి ఉండి నియోజకవర్గాన్ని కాపాడాలంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు విజ్ఞప్తి చేశారు. తనను చంపించేందుకు రఘురామ కుట్ర పన్నారని చెప్పారు. తనను చంపాలని కుటుంబ సభ్యుల ఎదుటే అనుచరుడిని ఆదేశించారని తెలిపారు. ఆయన పక్కన ఉండి వ్యవహారాలు చక్కబెట్టే కొత్తపల్లి నాగరాజు సహకారంతో ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

లక్కీడ్రాలోనూ బీఆర్ఎస్‌కు నిరాశే.. జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం

రెండు రోజుల హైడ్రామా తరువాత జరిగిన జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మున్సిపాలిటీ కోసం జరిగిన ఓటింగ్ లో రెండు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో నిర్వహించిన లక్కీ డ్రాలో కాంగ్రెస్ పార్టీని అదృష్టం వరించింది. దాంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. జనగామ మున్సిపల్ చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కడకంచి బాలమణి ఎన్నికైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్‌గా తూణం శ్రవణ్ […]

చైర్మన్ ఎన్నికకు వెళ్లకుండా మధుసూదనచారిని అడ్డుకున్న పోలీసులు

మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు వెళ్లకుండా ఇంచార్జిలు మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తొర్రూరు వెళ్లకుండా మహబూబాబాద్‌ఋలోనే సత్యవతి రాథోడ్‌ను హౌస్ అరెస్టు చేశారు. ఇక మధుసూదనచారిని అమరావతి నగర్‌లోని తులసీ బార్ ఎదురుగా ఉన్న శాంతినికేతన్ అపార్ట్‌మెంట్‌లో సుబేదారి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తన 45 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని […]

హంగ్ మున్సిపాలిటీలపై కేటీఆర్ ఫోకస్, కొత్త ఇన్‌ఛార్జులు!

హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎనిమిది పట్టణాల్లో ఎన్నికల పరిస్థితులను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు సీనియర్ నేతలను ప్రత్యేక ఇన్‌ఛార్జులుగా నియమించారు. తొర్రూర్:  మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్, జనగామ:  బండ ప్రకాశ్,  పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి క్యాతనపల్లి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఖానాపూర్: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇంద్రేశం: ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి,  కాగజ్‌నగర్:  జోగు రామన్న జహీరాబాద్: చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి ఇబ్రహీంపట్నం:  సబితా ఇంద్రారెడ్డి, శంభీపూర్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON