రాంబాబుకు బెయిల్ మంజూరు
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023లో సత్తెనపల్లి ప్రాంతంలో నిర్వహించిన సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారానికి సంబంధించిన అవినీతి కేసులో ఆయనకు ఉపశమనం లభించింది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

