loader

ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్‌ కారణమా?… క్లారిటీ ఇచ్చిన కేంద్రం

కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరిగిన సంగతి తెలిసిందే. యువత కూడా ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. అయితే ఈ మరణాలకు, కోవిడ్ వ్యాక్సిన్లకు సంబంధం ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అధ్యయనం నిర్వహించాయి. ఈ క్రమంలోనే పెద్దలలో ఆకస్మిక మరణాలకు, కోవిడ్-19 వ్యాక్సిన్‌లకు మధ్య సంబంధం లేదని ఆ అధ్యయనాలు స్పష్టం చేశాయి.  వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ […]

హెచ్‌ఐవీ నివారణకు టీకా

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న హెచ్‌ఐవీ వైరస్‌పై చిరకాల పోరాటం ఫలించింది. దశాబ్దాలుగా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో ఒక మైలురాయిగా నిలుస్తూ ప్రపంచంలోనే తొలిసారిగా సంవత్సరానికి రెండుసార్లు ఇచ్చే హెచ్‌ఐవీ టీకాను అమెరికా ఆమోదించింది. కనీసం 35 కేజీల బరువున్న పెద్దలు, కౌమార దశలో ఉన్న వారికి ప్రెప్‌ ఇంజక్షన్‌గా ఉపయోగించడానికి ఎఫ్‌డీఏ అనుమతిని ఇచ్చింది.

ఐదేళ్లలోపు చిన్నారుల కోసం బాల భరోసా

ఐదేళ్ల లోపు చిన్నారుల కోసం మరో కొత్త ప్రథకాన్ని తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ‘బాల భరోసా’ పథకం ద్వారా ఐదేళ్ల లోపు చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోనుంది. గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఈ పథకం వివరాలను వెల్లడించారు. పథకం కింద ఐదేళ్ల లోపు పిల్లలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తామని ఆమె తెలిపారు. అంతేకాకుండా అవసరమైతే ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేయించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

భారత్‌లో 5,755కు చేరిన కోవిడ్ యాక్టివ్ కేసులు

భారతదేశంలో కోవిడ్ -19 కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో మరోసారి దేశంలో కరోనా భయాందోళనలు నెలకొన్నాయి. జూన్ 7తేదీ ఉదయం 8 గంటల వరకు దేశంలో 5,755 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే గత 24 గంటల్లో కరోనాతో నలుగురు మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఏపీలో ప్రస్తుతం 72 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో 9 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఒడిశా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆరుగురు మృతి

ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు ఇంజక్షన్ వికటించి చనిపోయారు. వ్యవసాయ కూలీల కుటుంబాలకు చెందినవారు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆరుగురు రోగులకు ఒకే బ్యాచ్‌కి చెందిన ఇంజక్షన్లు ఇవ్వగా వాటిని వేసిన కొద్ది నిమిషాల్లోనే రోగులు ఊపిరి ఆడక విలవిలలాడిపోయారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమవారు మృతిచెందారని బంధువులు ఆందోళనకు దిగారు.

4026కు చేరుకున్న కరోనా కేసులు..

మంగళవారం నాటికి దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 4 వేల మార్కును దాటగా.. గడిచిన 24 గంటల్లోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎప్పటిలాగే కేరళ ఎక్కువ కేసులతో అగ్ర స్థానంలో నిలిచింది. అయితే ఢిల్లీలోనూ గణనీయంగా కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం ఈ కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజీవ్ బహల్ తెలిపారు. కాకపోతే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, అత్యధికంగా కేరళ

దాదాపు రెండేళ్ల తరువాత దేశంలో ఇప్పుడు కరోనా మరోసారి భయం రేపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల 3 వేల వరకు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. కేరళలో 1147 కరోనా కేసులు, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్‌లో 223 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.  కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా 7 మంది […]

సూదితో పొడవకుండానే రక్త పరీక్ష.. దేశంలో ఫస్ట్‌ టైమ్‌ హైదరాబాద్‌లో

రక్త పరీక్ష చేయాలంటే సూదితో గుచ్చి రక్తాన్ని తీసుకుని.. పరీక్షలు చేస్తారు. రిజల్ట్ కూడా త్వరగా రాదు. ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇకపై వీటికి చెక్ పెట్టేందుకు ఏఐ రెడీ అయ్యింది. కేవలం ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా రక్త పరీక్షలు చేయవచ్చు. ఏఐ ను బేస్ చేసుకుని రూపొందించిన ఈ టెక్నాలజీని అమృత్ స్వస్త్‌ భారత్ కార్యక్రమంలో భాగంగా క్విట్ వైటల్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ విధానం చిన్న పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు […]

కరోనాతో ఇద్దరు మృతి..! పెరుగుతున్న కేసులు..

దేశంలో  పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. అంతేకాకుండా కొత్త రూపంలో పంజా విసురుతోంది.. NB 1.8.1, LF.7.. ఈ రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్‌ జీనోమిక్స్‌ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. అయితే.. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర థానేలో కొవిడ్‌తో 21 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. బెంగళూరులో కరోనాతో 84 ఏళ్ల వృద్ధుడు […]

ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం పునరుద్ధరణ, నిధులు విడుదల

గర్భిణీ స్త్రీల కోసం ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునరుద్దరించింది,51 కోట్ల 14 లక్షల 77 వేలు నిధులు విడుదల. ఒక్కో కిట్ కు 1410/- ఖర్చు పెట్టనున్న ప్రభుత్వం… 2014-19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2016లో ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని ప్రారంభించింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని నిలిపివేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON