loader

ఒడిశా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆరుగురు మృతి

ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు ఇంజక్షన్ వికటించి చనిపోయారు. వ్యవసాయ కూలీల కుటుంబాలకు చెందినవారు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆరుగురు రోగులకు ఒకే బ్యాచ్‌కి చెందిన ఇంజక్షన్లు ఇవ్వగా వాటిని వేసిన కొద్ది నిమిషాల్లోనే రోగులు ఊపిరి ఆడక విలవిలలాడిపోయారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమవారు మృతిచెందారని బంధువులు ఆందోళనకు దిగారు.

4026కు చేరుకున్న కరోనా కేసులు..

మంగళవారం నాటికి దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 4 వేల మార్కును దాటగా.. గడిచిన 24 గంటల్లోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎప్పటిలాగే కేరళ ఎక్కువ కేసులతో అగ్ర స్థానంలో నిలిచింది. అయితే ఢిల్లీలోనూ గణనీయంగా కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం ఈ కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజీవ్ బహల్ తెలిపారు. కాకపోతే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, అత్యధికంగా కేరళ

దాదాపు రెండేళ్ల తరువాత దేశంలో ఇప్పుడు కరోనా మరోసారి భయం రేపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల 3 వేల వరకు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. కేరళలో 1147 కరోనా కేసులు, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్‌లో 223 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.  కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా 7 మంది […]

సూదితో పొడవకుండానే రక్త పరీక్ష.. దేశంలో ఫస్ట్‌ టైమ్‌ హైదరాబాద్‌లో

రక్త పరీక్ష చేయాలంటే సూదితో గుచ్చి రక్తాన్ని తీసుకుని.. పరీక్షలు చేస్తారు. రిజల్ట్ కూడా త్వరగా రాదు. ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇకపై వీటికి చెక్ పెట్టేందుకు ఏఐ రెడీ అయ్యింది. కేవలం ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా రక్త పరీక్షలు చేయవచ్చు. ఏఐ ను బేస్ చేసుకుని రూపొందించిన ఈ టెక్నాలజీని అమృత్ స్వస్త్‌ భారత్ కార్యక్రమంలో భాగంగా క్విట్ వైటల్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ విధానం చిన్న పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు […]

కరోనాతో ఇద్దరు మృతి..! పెరుగుతున్న కేసులు..

దేశంలో  పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. అంతేకాకుండా కొత్త రూపంలో పంజా విసురుతోంది.. NB 1.8.1, LF.7.. ఈ రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్‌ జీనోమిక్స్‌ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. అయితే.. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర థానేలో కొవిడ్‌తో 21 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. బెంగళూరులో కరోనాతో 84 ఏళ్ల వృద్ధుడు […]

ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం పునరుద్ధరణ, నిధులు విడుదల

గర్భిణీ స్త్రీల కోసం ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునరుద్దరించింది,51 కోట్ల 14 లక్షల 77 వేలు నిధులు విడుదల. ఒక్కో కిట్ కు 1410/- ఖర్చు పెట్టనున్న ప్రభుత్వం… 2014-19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2016లో ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని ప్రారంభించింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని నిలిపివేశారు.

కరోనా డేంజర్‌ బెల్స్‌తో మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండడంతో టెక్‌ రంగం తీవ్రంగా ప్రభావితమవుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో కంపెనీలు ఉద్యోగులకు మరోసారి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఇవ్వగా.. మిగతా కంపెనీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. ిలికానీ వ్యాలీగా గుర్తింపు పొందిన కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. 20 రోజులుగా క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు ఉద్యోగుల పని విధానంలో మార్పులు చేస్తున్నాయి.

దేశంలో కొత్త కరోనా వేరియంట్లు..

భారత్‌లో కొవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1.. ఎల్‌ఎఫ్‌.7లను గుర్తించారని పేర్కొంది. ఎన్‌బీ.1.8.1 రకం కేసు ఏప్రిల్‌లో వెలుగుచూడగా.. ఎల్‌ఎఫ్‌.7కు సంబంధించిన 4 కేసులు ఈ నెలలోనే తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో నమోదయ్యాయి.మరోవైపు.. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొత్త కొవిడ్ కేసులు నమోదవుతున్నప్పటికీ.. వాటి తీవ్రత తక్కువగానే ఉందని.. బాధితులు 4 రోజుల్లో కోలుకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా పాజిటివ్

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో సైతం కోవిడ్ కలకలం చెలరేగింది. హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా సోకింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు మాస్కులు ధరించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, ఎయిర్‌పోర్టుల్లో.. సోషల్‌ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరి అని హెచ్చరిస్తోంది. విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తోంది.

రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్ ధరించాలి…

భారతదేశంలో కోవిడ్ -19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాలలో ప్రజలు మాస్క్ ధరించడం తప్పనిసరి అని పేర్కొంది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలను ఎవరైనా ఎదుర్కొంటే.. వారు సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON