loader

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. 30 శాతం పెరిగిన రోగులు

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యధిక స్థాయిలో పెరిగిపోతుండడంతో శ్వాసకోశ వ్యాధుల రోగులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. రోజువారీ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య కన్నా 20 నుంచి 30 శాతం ఎక్కువగా శ్వాసకోశ వ్యాధుల రోగుల సంఖ్య ఉంటోందని డాక్టర్లు చెప్పారు. జలుబు, దగ్గు, ఊపిరాడకపోవడం, ఛాతీ బిగుసుకుపోవడం, తదితర లక్షణాలతో రోగులు వస్తున్నారని తెలిపారు. కాలుష్యం ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల నుంచే రోగులు అధిక సంఖ్యలో వస్తున్నారని డాక్టర్లు తెలిపారు.

నాలుగేళ్ల చిన్నారికి స్క్రబ్ టైఫస్ వైరస్

గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. బొండపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారికి మూడు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో ఏరియా ఆస్పత్రిలో స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేశారు. రిపోర్టులో పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ర్యాపిడ్ టెస్ట్, ఎలీసా టెస్ట్‌లో కూడా పాజిటివ్ వచ్చిందని గజపతినగరం ఏరియా ఆస్పత్రి వైద్యాధికారి ప్రవీణ్ చెప్పారు. దీంతో మరువాడ గ్రామంలో అధికారులు క్లోరినేషన్‌ను చేపట్టారు.

స్క్రబ్ టైఫస్ అనే కీటకం కుట్టడంతో.. మహిళ మృతి

విజయనగరంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో ఓ మహిళ చనిపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జ్వరంతో పాటు శరీరంలో నల్లటి చుక్కలాంటి గాయం, తీవ్రమైన అలసట, వణుకులు, శ్వాసకోస ఇబ్బందులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మొదట టైఫాయిడ్ గా గుర్తించి చికిత్స అందించారు వైద్యులు. చివరికి ఆయాసం పెరిగి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయింది. వైద్యులు లోతైన పరీక్షలు చేయగా ఫైనల్ గా స్క్రైబ్ టైఫిస్ లక్షణాలతో మృతి చెందినట్లు ప్రాథమికంగా […]

న్యూమోకోకల్ కన్జువేట్ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌వో అనుమతి..

ఫార్మాసూటిల్ కంపెనీ బయలాజికల్ ఈ లిమిటెడ్ కంపెనీ మరో ముందడుగు వేసింది. ఆ కంపెనీ ఇటీవల తయారు చేసిన 14 వలెంట్ న్యూమోకోకల్ కన్జువేట్ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ ముందస్తు అర్హత (ప్రీ-క్వాలిఫికేషన్) స్టేటస్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌ 14 రకాల స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా బ్యాక్టీరియా నుంచి రక్షణనిస్తుంది. ఆరువారాల వయసున్న శిశువుల్లో న్యూమోనియా, మెనింజైటిస్‌తో పాటు సెప్సిస్‌ వంటి వ్యాధులను PNEUBEVAX 14 నయం చేయగలదు.

క్యాన్సర్ అవగాహన దినోత్సవం

క్యాన్సర్ నివారణ, ముందుగానే గుర్తించడం, చికిత్స మరియు దాని సంబంధిత సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం. భారతదేశంలో నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం. ఈ రోజులు క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి, నివారణ, ముందస్తు గుర్తింపు మరియు చికిత్స ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి ఉద్దేశించబడ్డాయి

పూర్తి బకాయిలు చెల్లించేవరకు ఆందోళనలు – నెట్వర్క్ ఆసుపత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవా పథకం బకాయిల వివాదం మళ్లీ ముదురుతోంది. ప్రభుత్వం ఇటీవలే రూ.250 కోట్లు విడుదల చేసినప్పటికీ, నెట్వర్క్ ఆసుపత్రులు తమ ఆందోళనను ఉపసంహరించుకోకుండా కొనసాగించాలని నిర్ణయించాయి. ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటనలో, తాము డిమాండ్ చేస్తున్న మొత్తం రూ.2,700 కోట్ల బకాయిలు పూర్తిగా చెల్లించకపోతే, సేవలు పునరుద్ధరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. పరిష్కారమవకపోతే ప్రజల ఆరోగ్య హక్కులే ప్రమాదంలో పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు

ఏపీలో రేపటి నుంచి NTR హెల్త్ సేవలు నిలిపివేత

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ వైద్య సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడనుంది. ప్రభుత్వం రావాల్సిన బకాయిలు ఇంకా విడుదల కాలేదని ఆర్థిక భారం పెరిగిందని నెట్‌వర్క్ ఆసుపత్రులు తెలిపాయి. ప్రభుత్వం నుంచి దాదాపు 2700 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని వెల్లడించాయి. వాటిని చెల్లించే వరకు సేవలు కొనసాగించలేమని ఓ ప్రకటన చేశాయి. గత రెండు రోజులుగా అనేక సందర్భాల్లో ఆందోళన చేశామని ప్రజాప్రతినిధులను కలిశామని అయినా రావాల్సిన బకాయిలపై స్పందన లేదని అన్నారు.

మరో రెండు దగ్గు మందులను బ్యాన్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం

పిల్లలకు ప్రమాదకరంగా మారిన దగ్గు మందు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండు దగ్గు మందులను రాష్ట్రంలో నిషేధించింది. ఇప్పటికే కోల్డ్‌ రిఫ్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఔషధ నియంత్రణ విభాగం (డీసీఏ) ప్రకటించగా.. తాజాగా రిలీఫ్‌, రెస్పి ఫ్రెస్‌-TR సిరప్‌లపై నిషేధం విధించింది. ఈ రెండు సిరప్‌లలో కల్తీ జరిగిందని తేలడంతో వాటి విక్రయాలు వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎయిడ్స్ నిరోధ‌క చ‌ర్య‌ల్లో ఏపీకి రెండో ర్యాంకు

ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి నిరోధ‌ చ‌ర్య‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ AP ఎయిడ్స్ నియంత్ర‌ణ సంస్థ‌కు రెండో ర్యాంకు ల‌భించింది. చికిత్స పొందుతున్న వారిలో 95 శాతం మందిలో వైర‌ల్ లోడ్ త‌గ్గింది. రాష్టంలోని ఎఆర్‌టి సెంట‌ర్ల‌ను స‌మ‌ర్ధ‌వంగా నిర్వ‌హించ‌డం, హెచ్ఐవి అనుమానితులకు ప‌రీక్ష‌లు చేసేందుకు ఉద్దేశించిన టార్గెట్‌డ్ ఇంట‌ర్వెష‌న్స్‌, లింక్ వ‌ర్క‌ర్స్ స్కీం విభాగాల్లో నూరు శాతం ప్రగ‌తిని సాధించింది. క‌మ్యూనిటీ ఆర్గ‌నైజేష‌న్లు, స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌లు( ఎన్జీఓలు), అవుట్ రీచ్ వ‌ర్క‌ర్ల ద్వారా ఈ కార్య‌క్ర‌మాన్ని ఏపీశాక్స్ […]

బ్రెస్ట్ క్యాన్సర్‌ చికిత్స కోసం అందుబాటులోకి సరికొత్త ఔషధం..!

భారతదేశంలోని ప్రముఖ ఔషధ కంపెనీలలో ఒకటైన హెటిరో హెల్త్‌‌‌‌కేర్ లిమిటెడ్  బ్రెస్ట్‌ క్యాన్సర్‌ చికిత్స కోసం సరికొత్త ఔషధాన్ని తీసుకొచ్చింది. హెచ్‌‌‌‌ఈఆర్‌‌‌‌‌‌‌‌2-పాజిటివ్ రకం బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే పెర్టుజుమాబ్‌ అనే ఔషధానికి‌‌‌ బయోసిమిలర్‌ అయిన‌‌‌‌‌‌‌ పెర్జియా (Perzea) ను అందుబాటులోకి తెచ్చింది. పెర్జియా 420 ఎంజీ ఇంజెక్షన్ ధర రూ.30 వేలుగా నిర్ణయించింది. పెర్టుజుమాబ్‌‌‌‌ను క్యాన్సర్ చికిత్సలో ట్రాస్టుజుమాబ్‌‌‌‌తో కలిపి వినియోగిస్తున్నారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కీమోథెరపీల్లో ఈ కాంబినేషన్‌ కీలకంగా మారింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON