loader

ఎయిర్‌బస్‌లో సాంకేతిక సమస్య.. ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో విమానాలపై ఎఫెక్ట్

ఫ్రెంచ్ విమానయాన దిగ్గజం ఎయిర్‌బస్ ఎ320 మోడల్‌ విమానాల్లో సోలార్‌ రేడియేషన్‌ కారణంగా సాంకేతిక సమస్య తలెత్తిందని.. దీని కారణంగా విమాన నియంత్రణ వ్యవస్థలకు సంబంధించిన కీలకమైన డేటా దెబ్బతిన్నట్టు పేర్కొంది. విమాన నియంత్రణపై ప్రభావం చూపవచ్చని పేర్కొంది. విమానాల్లో సాఫ్ట్‌వేర్ మార్చులు చేయాల్సి ఉందని తెలిపింది. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 6వేల ఎయిర్‌బస్‌ విమానాల్లో ఈ మార్పులు చేయాలని స్పష్టం చేసింది. భారత్‌కు ఎయిర్ ఇండియా, ఇండిగో వద్ద ఎ320 విమానాలు 560 […]

ఏపీ మంత్రి సంధ్యారాణి కుమారుడు, పీఏపై లైంగిక ఆరోపణలు! వేధిస్తున్నారని మహిళ ఫిర్యాదు!

ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ, పీఏ సతీష్‌ తనను లైంగికంగా వేధిస్తున్నారని, గంట వచ్చి వెళ్లమన చెబుతున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చిన ఓ మహిళ. మంత్రి కుమారుడు పృథ్వీ కూడా తనకు మెసేజ్ చేశాడని మహిళ ఆరోపిస్తోంది. తన ఫ్రెండ్స్‌ దగ్గరకు వెళ్లాలని చెప్పాడని చెప్పుకొచ్చింది. తన భర్త కరోనాతో చనిపోయాడని, ఉద్యోగం ఇప్పిస్తానని ఐదు లక్షలు సతీష్ తీసుకున్నారని చెప్పింది. స్థానిక పోలీసులు కనీసం ఫిర్యాదు తీసుకోవడానికి […]

‘ఆ స్లీపర్ బస్సులు ఇక వాడొద్దు, పక్కన పెట్టేయండి’: రాష్ట్రాలకు NHRC కీలక ఆదేశాలు

దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల వరుసగా జరుగుతున్న ఘోర బస్సు ప్రమాదాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్లీపర్ కోచ్ బస్సులను తక్షణమే రోడ్లపై నుంచి పక్కన పెట్టేయాలని NHRC అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.స్లీపర్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని.. దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని […]

ఎన్ని జన్మలెత్తినా నటుడిగానే పుడతా – రజినీకాంత్ భావోద్వేగం

56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు 50 ఏళ్ల సినీ ప్రస్థానం పురస్కరించుకుని గోవాలో ఘన సత్కారం లభించింది. నటనపై ప్రేమ కారణంగా 50 ఏళ్లు పది–పదిహేనేళ్లలా అనిపిస్తున్నాయని నటనను, సినిమాను ఎంతగానో ప్రేమిస్తున్నా కాబట్టే ఇలా అనిపిస్తోంది. నాకు వంద జన్మలు ఉన్నా ప్రతీ జన్మలోనూ రజనీకాంత్‌గానే పుట్టాలి, నటుడిగానే ఉండాలి అని ఆ దేవుడిని కోరుకుంటారు” అని రజనీకాంత్ భావోద్వేగంగా చెప్పారు

నెల్లూరు పెంచలయ్య హత్య కేసులో నిందితులపై పోలీస్ కాల్పులు

నెల్లూరులో సంచలనం రేపిన పెంచలయ్య హత్య కేసు నిందితులని పట్టుకునే క్రమంలో నెల్లూరు రూరల్ పోలీసులు ఫైర్ ఓపెన్ చేశారు. ఈ ఘటనలో నిందితుడు, హెడ్ కానిస్టేబుల్‌కి తీవ్రగాయాలయ్యాయి. సీపీఎం ఆర్డీటీ కాలనీ శాఖ సభ్యుడు, ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్య అనే వ్యక్తి హత్యకు గురైన సంగతి తెలిసిందే. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో గంజాయి మాఫియాని నడుపుతున్న అరవ కామాక్షమ్మ తొమ్మిది సభ్యుల గంజాయి గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకుని పెంచలయ్య హత్యకి పురమాయించినట్టు […]

లొంగిపోయిన మావోయిస్టు అనంత్ టీమ్.. లేఖ విడుదల చేసిన 24 గంటల్లోనే సరెండర్

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ 10 మంది మావోయిస్టులతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఐదు రాష్ర్టాల్లో ఆయనపై రూ కోటి రివార్డు ఉంది. జనవరి 1వ తేదీన లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని తాజాగా అనంత్ ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖ విడుదల చేసిన 24 గంటలు తిరగకముందే ఆయన పోలీసులకు లొంగిపోవడం గమనార్హం.

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

కర్నూలు జిల్లా  పరిధిలో శనివారం ఉదయం రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని కొటేకల్ గ్రామం వద్ద ఓ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు కార్లు ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు . మరో నలుగురు గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరిని కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా చిక్కహోసల్లి

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదాజియాకు తీవ్ర అస్వస్థత

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా(80) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆదివారం రాత్రి ఢాకా లోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో చేర్పించినట్టు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారని బిఎన్‌పి సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రూల్ ఇస్లాం అలంఘీర్ వెల్లడించారు. ఆమె త్వరగా కోలుకోవాలని పార్టీ ప్రత్యేక ప్రార్థనలు చేసింది.

కాళోజీ యూనివర్సిటీ వీసీ నందకుమార్ రాజీనామా..

కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రాజీనామా చేశారు. యూనివర్సిటీలో ఇటీవల పలు అవకతవకల నేపథ్యంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు చెలరేగాయి. పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇన్ ఛార్జీల నియామకం తదితర ఘటనలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీలో ఏం జరుగుతోందో వివరణ ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇది జరిగిన కాసేపటికే వీసీ నంద కుమార్ రాజీనామా చేసినట్టు ప్రకటించారు.

కోకాపేటలో ఎకరం రూ. 144 కోట్లు.. రికార్డు స్థాయిలో పలికిన ధరలు

హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ కోకాపేటలోని నియోపోలీస్ భూములకు రెండో విడత ఈ వేలం నిర్వహించింది. శుక్రవారం ఈ భూములకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ప్లాట్ నెంబర్ 15లో ఎకరానికి రూ.151. 25 కోట్ల ధర పలికింది. ఇక ప్లాట్ నెంబర్ 16లో ఎకరానికి రూ.147.75 కోట్లు ధర వచ్చింది. రెండో విడతలో వేలం 9.06 ఎకరాలకు 1,352 కోట్లను హెచ్‌ఎండీఏ పొందింది. ప్లాట్ నెంబర్16లో 5.03 ఎకరాలకు రూ. 743 కోట్లు హెచ్‌ఎండీఏకి వచ్చాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON