loader

నెల్లూరుకు నీటి కొరత లేకుండా చేస్తాం…సీఎం చంద్రబాబు నాయుడు

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఈదగాలి గ్రామంలో విశ్వసముద్ర గ్రూపునకు చెందిన వివిధ ప్రాజెక్టులను శుక్రవారం సీఎం ప్రారంభించారు. ”నెల్లూరు జిల్లాలో ఇప్పుడు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులతో పాటు.. కీలక పరిశ్రమలు వచ్చాయి. సోమశిల, కండలేరు లాంటి మంచి ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. 150 టీఎంసీల నీళ్లు ఈ రెండు ప్రాజెక్టుల్లో ఉంటాయి. భవిష్యత్తులో నీటి కొరత లేకుండా ఈ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఉంచుతాం.” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు […]

మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు

అమరావతి లో రూ.212 కోట్లతో రాజ్‌భవన్‌ నిర్మాణానికి ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ సమావేశంలో మొత్తం 26 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఆర్టీసీ బస్సులన్నింటినీ వచ్చే మూడేళ్లలో ఎలక్ట్రిక్ గా మార్చాలని ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద రూ. 1,200 కోట్లతో బీడీఎల్‌ ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీకి , విశాఖలో రూ.87 వేల కోట్లతో మూడు ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు, గూగుల్‌ డేటా సెంటర్‌కు 480 ఎకరాల కేటాయింపునకు కేబినెట్‌ గ్రీన్‌ […]

నకిలీ మద్యం కేసులో జనార్దన్‌ రావు అరెస్ట్..

ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌతాఫ్రికా నుంచి విజయవాడ వచ్చిన జనార్దన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో జనార్దన్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఏ1గా జనార్దన్‌రావు ఉన్న విషయం తెలిసిందే.

పంచాయతీ సెక్రెటరీలు కాదు..ఇకపై డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు : ఏపీ కేబినెట్‌ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో ఇక పంచాయతీ సెక్రెటరీ లను పంచాయతీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లుగా పిలువనున్నారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చాలని, ఆదాయం బట్టి పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

ఆర్జేడీని గెలిపిస్తే ఇంటికో ఉద్యోగం.. బీహారీలకు తేజస్వియాదవ్‌ హామీ

అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్‌ లో యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్‌ కీలకమైన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కోటికిపైగా ఉన్న యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇచ్చేందుకు అనువుగా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోపు ప్రత్యేక చట్టం తెస్తామని, 20 నెలల్లో ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తామని తేజస్వి ప్రతిజ్ఞ చేశారు.

నోబెల్ బహుమతి వచ్చిన వెనిజులా ఐరన్ లేడీని ప్రశంసించిన ట్రంప్‌- వైరల్ అవుతున్న పోస్ట్‌

మరియా కొరినా మచాడో పేరును చాడో పేరును నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసింది. మరియా కొరినా మచాడో గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత ప్రకటన ఒకటి వైరల్ అవుతోంది. జనవరి 2025లో వెనిజులా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించినందుకు మరియా కొరినాను ట్రంప్ ప్రశంసించారు. “నార్వేజియన్ నోబెల్ కమిటీ వెనిజులా ప్రజల కోసం ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడానికి, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యంలోకి న్యాయబద్ధమైన, శాంతియుత మార్పు కృషికి మరియా కొరినా మచాడోకు 2025 […]

అపోలో యూనివర్సిటీ గర్ల్స్ బ్లాక్‌లో

చిత్తూరులోని అపోలో యూనివర్సిటీ గర్ల్స్ బ్లాక్‌లో హేయమైన ఘటన బయటపడింది. గర్ల్స్ టాయిలెట్లలో హిడెన్ కెమెరా స్టూడెంట్ కంటపడటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. హిడెన్ కెమెరా వ్యవహారం యూనివర్సిటీలో. విషయం పేరెంట్స్ దాకా చేరడంతో చర్చగా మారింది. ఇలాంటి పనికి పాల్పడిన నీచుడు యూనివర్సిటీలో జరుగుతున్న నిర్మాణ పనులు పర్యవేక్షించే సైట్ ఇంజినీర్‌ రూబెన్‌గా    గుర్తించిన యూనివర్సిటీ యాజమాన్యం.. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన చిత్తూరు […]

ఉరి వేసుకుని ఇద్దరు పదో తరగతి విద్యార్థుల ఆత్మహత్య..!

మహారాష్ట్రలో స్కూల్ ఆవరణలోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పాల్ఘర్‌లోని వాడా తాలూకాలోని అంబిస్టేలోని ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు మైనర్లు పదో తరగతి విద్యార్థులు పాఠశాలలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారి మరణాలు పాఠశాల ఆవరణలో తీవ్ర కలకలం రేపాయి సంఘటన ఆశ్రమశాల క్యాంపస్ అంతటా, వాడా తాలూకాలో తీవ్ర కలకలం రేపింది. విద్యార్థి ఆత్మహత్య తర్వాత, పోలీసులకు సంఘటన గురించి సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం తరలించి, కేసు […]

వెనిజులా ఎంపీ మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. మరియా కొరినా మచాడో కు ఈ ఏడాదికి సంబంధించిన నోబెల్ శాంతి పురస్కారం వరించింది. మరియా కొరినా మచాడో వెనిజులా పార్లమెంట్ సభ్యురాలు. వెనిజులా ప్రజల కోసం మరియా కొరినా మచాడో చేసిన అవిశ్రాంత కృషి, వారి హక్కుల కోసం చేసిన పోరాటం ఫలితంగానే ఆమెకు ఈ నోబెల్ బహుమతి దక్కినట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ వెల్లడించింది.

ఆటో పల్టీ.. విద్యార్థులకు తప్పిన ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సోమారం గ్రామానికి చెందిన విద్యార్థులు కొలనుపాక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఉదయం బస్సు రాకపోవడంతో గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు కాలేజీ విద్యార్థులు, మ‌రో ఇద్దరు ఇతరులు ఆటో ఎక్కారు. కొలనుపాక గ్రామ పరిధిలో ఆటో ప్రమాదవశాత్తు పల్టీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద ప్రమాదం జరగకపోయినప్పటికీ బస్సు వచ్చి ఉంటే ప్రమాదం తప్పేదని గ్రామస్తులు ఆరోపించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON