loader

కేబినెట్‌ మీటింగ్‌లో తప్పుడు ప్రజంటేషన్.. ఆ ప్రభుత్వ ఉద్యోగిపై వేటు

కేబినెట్ సమావేశంలో తప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు చెందిన సెక్షన్‌ ఆఫీసర్‌ కె.విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. హోర్డింగ్‌ల లైసెన్సింగ్‌పై చర్చ జరగాల్సిన సమయంలో పొరపాటున మరో ఫైల్ రావడంతో సీఎం, మంత్రులు అసహనానికి గురయ్యారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సరైన ప్రజెంటేషన్‌ను సమర్పించారు. అనంతరం ఆ అధికారి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించి అతడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

3 ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యంలో విద్యుత్ ఉత్పత్తే కీలకం : భట్టి విక్రమార్క

విద్యుత్‌ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు తయారు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని భట్టి విక్రమార్క అన్నారు. సీఎం, కేబినెట్‌ సహచరులు కలిసి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా చేరడానికి పెట్టుబడులు రావాలని, రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేయాలని వెల్లడించారు. ఆ దిశగా విద్యుత్‌ తయారు చేసుకోవాలని ప్రణాళికలు చేస్తున్నామని, ఎనర్జీ వినియోగంలో భారత్ ఆరో స్థానంలో […]

ద‌ళిత మ‌హిళ‌ను వంట చేయ‌కుండా అడ్డుకున్న ఆరుగురికి జైలుశిక్ష‌

ప్ర‌భుత్వం ఉన్న‌త పాఠ‌శాలో 44 ఏళ్ల ప‌ప్పాల్ కుక్‌గా చేసింది. ఆరుగురు వ్య‌క్తులు.. విద్యార్థుల పేరెంట్స్‌. త‌మ పిల్ల‌ల‌కు వంట చేయ‌కుండా ఓ ద‌ళిత మ‌హిళ‌ను అడ్డుకున్న ఆరుగురు గ్రామ‌స్థుల‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది త‌మిళ‌నాడు కోర్టు. 2018లో జ‌రిగిన ఈ ఘ‌టన‌పై శుక్ర‌వారం స్పెష‌ల్ కోర్టు తీర్పునిచ్చింది. ఎస్సీ-ఎస్టీ చ‌ట్టం కింద కేసు కొన‌సాగింది. ప‌ళ‌నిస్వామి గౌండ‌ర్, శ‌క్తివేల్‌, ష‌న్ముగ‌మ్‌, వెల్లంగిరి, దురైస్వామి, సీతా ల‌క్ష్మీపై కుల‌వివ‌క్ష కేసు కింద శిక్ష‌ను ఖ‌రారు చేశారు.

అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం

రాజధాని ప్రాంత రైతుల్లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు వారి సమస్యలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అందుకే రైతుల సమస్యల పరిష్కారానికి పెమ్మసాని చంద్రశేఖర్‌, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ కుమార్ ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. రాజధాని ప్రాంత రైతుల సమస్యల పరిష్కారానికి కమిటీ సమావేశమైంది. రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఇంకా పరిష్కారం కాని ఇష్యూలను వివరించారు ఒకేసారి అన్ని సమస్యలకు పరిష్కారం లభించదని ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు […]

నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు ‘ఫ్లాష్ ఫ్లడ్స్’ అలర్ట్

శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రస్తుతం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ, ఆంధ్రప్రదేశ్ వైపు వస్తోంది. ఈ తుఫాను రేపు (ఆదివారం) తెల్లవారుజామునకు తీవ్ర వాయుగుండంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి, మరియు దక్షిణ కోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 24 గంటల్లో నెల్లూరు,కడప,చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఫ్లాష్ ఫ్లడ్స్’ (ఆకస్మిక వరదలు) హెచ్చరికలు జారీ చేసింది. కోస్తా తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు […]

సీఎం సిద్ధ‌రామ‌య్య ఇంట్లో డీకే శివ‌కుమార్ బ్రేక్‌ఫాస్ట్‌

క‌ర్నాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య ఇంట్లో ఇవాళ డిప్యూసీ సీఎం డీకే శివ‌కుమార్ బ్రేక్‌ఫాస్ట్ చేశారు. గ‌త కొన్నాళ్ల నుంచి క‌ర్నాట‌క‌లో అధికార మార్పిడి జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని ఊహానాగాలు వినిపిస్తున్న నేప‌థ్యంలో ఈ భేటీకి ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ వ‌ర‌కు శివ‌కుమార్ సీఎం బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌న్న వార్త‌లు వ్యాపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ ఇద్ద‌రు నేత‌ల భేటీ కీల‌కంగా మారింది. అయితే శివ‌కుమార్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపుతున్న‌ట్లు కొన్ని విశ్వాస వ‌ర్గాల ద్వారా […]

తెలంగాణ గమ్యాన్ని మార్చిన చారిత్రక రోజు.. దీక్షా దివస్ సందర్భంగా కేటీఆర్ ట్వీట్

దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమం నాటి రోజులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక మలుపుగా నిలిచిన రోజు 2009 నవంబర్ 29 అని అన్నారు. రాష్ట్ర సాదనకు 16 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు నాంది పలికిందని అన్నారు. తెలంగాణ గమ్యాన్ని మార్చిన చారిత్రాత్మక రోజు అని తెలిపారు. కరీంనగర్‌లో కేసీఆర్‌ను అరెస్టు చేసిన సమయంలో ప్రజల్లో నుంచి వచ్చిన ఆగ్రహ జ్వాలలు తెలంగాణ ఉద్యమానికి కొత్త […]

ర్యాపిడో బైక్‌ రైడర్‌ ఖాతాలో రూ.331 కోట్లు.. రంగంలోకి దిగిన ఈడీ.

రాపిడో బైక్ డ్రైవర్ ఖాతాలో రూ. 331 కోట్ల లావాదేవీ జరిగిన షాకింగ్ మనీలాండరింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈకేసులో ED చర్యలు ప్రారంభించింది. ఆ క్యాబ్ డ్రైవర్ పేరు, పత్రాలను ఉపయోగించి ఒక మ్యూల్ అకౌంట్ సృష్టించబడింది. ఆ డబ్బును ఉదయపూర్ లో జరిగిన వీఐపీ వివాహానికి నిధులు సమకూర్చారని . ఉదయ్‌పూర్‌లో నేత్ర మంతెన–వంశీ గాదిరాజుల పెళ్లి వేడుకలపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. గుజరాత్ యువ రాజకీయ నాయకుడికి, ఫార్మా కింగ్ మంతెన రామరాజు […]

ఎయిర్‌బస్‌లో సాంకేతిక సమస్య.. ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో విమానాలపై ఎఫెక్ట్

ఫ్రెంచ్ విమానయాన దిగ్గజం ఎయిర్‌బస్ ఎ320 మోడల్‌ విమానాల్లో సోలార్‌ రేడియేషన్‌ కారణంగా సాంకేతిక సమస్య తలెత్తిందని.. దీని కారణంగా విమాన నియంత్రణ వ్యవస్థలకు సంబంధించిన కీలకమైన డేటా దెబ్బతిన్నట్టు పేర్కొంది. విమాన నియంత్రణపై ప్రభావం చూపవచ్చని పేర్కొంది. విమానాల్లో సాఫ్ట్‌వేర్ మార్చులు చేయాల్సి ఉందని తెలిపింది. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 6వేల ఎయిర్‌బస్‌ విమానాల్లో ఈ మార్పులు చేయాలని స్పష్టం చేసింది. భారత్‌కు ఎయిర్ ఇండియా, ఇండిగో వద్ద ఎ320 విమానాలు 560 […]

ఏపీ మంత్రి సంధ్యారాణి కుమారుడు, పీఏపై లైంగిక ఆరోపణలు! వేధిస్తున్నారని మహిళ ఫిర్యాదు!

ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ, పీఏ సతీష్‌ తనను లైంగికంగా వేధిస్తున్నారని, గంట వచ్చి వెళ్లమన చెబుతున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చిన ఓ మహిళ. మంత్రి కుమారుడు పృథ్వీ కూడా తనకు మెసేజ్ చేశాడని మహిళ ఆరోపిస్తోంది. తన ఫ్రెండ్స్‌ దగ్గరకు వెళ్లాలని చెప్పాడని చెప్పుకొచ్చింది. తన భర్త కరోనాతో చనిపోయాడని, ఉద్యోగం ఇప్పిస్తానని ఐదు లక్షలు సతీష్ తీసుకున్నారని చెప్పింది. స్థానిక పోలీసులు కనీసం ఫిర్యాదు తీసుకోవడానికి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON