loader

జపాన్ చేరుకున్న సీఎం రేవంత్.. ఎంబసీలో విందు

వారం రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం జపాన్ చేరుకుంది. బుధవారం టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్‌లో భారత రాయబారి శిబు జార్జ్‌తో సీఎం బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ బృందానికి ఎంబసీలో విందు భోజనం ఏర్పాటు చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళి, కాంగ్రెస్ ఎంపీ కే రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి నెపోలియన్, పలువురు అధికారులు ఈ విందులో పాల్గొన్నారు.

ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ అగ్రనేతల కీలక భేటీ..

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నూతన రథసారథి ఎవరన్న దానిపై త్వరలో స్పష్టత రానుంది. బీజేపీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో బుధవారం(ఏప్రిల్ 16) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక గురించి కూడా చర్చ జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శి […]

సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తాం:మంత్రి శ్రీధర్ బాబు

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై చట్టప్రకారం తాము ముందుకు వెళతామని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫొటోను షేర్ చేసినందుకు పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడంపై ఆయన స్పందించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని మంత్రి తెలిపారు.

గ్లోబల్ ఇండియన్ ప్రవాసి కబడ్డీ లీగ్ 2025

కబడ్డీ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబల్ ఇండియన్ ప్రవాసీ కబడ్డీ లీగ్ (GI-PKL) గురుగ్రామ్ విశ్వవిద్యాలయంలో 2025 ఏప్రిల్ 18 నుండి అట్టహాసంగా ప్రారంభం కానుంది. GI-PKL ప్రారంభ సీజన్‌లో 15 దేశాల కబడ్డీ క్రీడాకారులు (పురుషులు మరియు మహిళలు) పోటీపడతారు. ప్రారంభ మ్యాచ్‌లు ఏప్రిల్ 18, 2025 తమిళ లయన్స్ vs పంజాబీ టైగర్స్ (పురుషులు) హర్యానా షార్క్స్ vs తెలుగు పాంథర్స్ (పురుషులు) మరాఠీ వల్చర్స్ vs భోజ్‌పురి లెపర్డ్స్ (పురుషులు)

జీటీ4 కార్ రేస్‌లో సింగిల్‌గా దుమ్మురేపిన అజిత్ కుమార్

ఐరోపాలో జరుగుతున్న జీటీ4 కార్ రేస్‌లో దుమ్మురేపాడు స్టార్ హీరో అజిత్ కుమార్, ఒంటరిగా ఈ రేస్ లో పాల్గొని అదరగొట్టాడు స్టార్ హీరో. సినిమాతో పాటు కార్ రేస్‌ అంటే అజిత్‌కి ఎంతో ఇష్టం. ఐరోపాలో జీటీ4 కార్ రేస్ మొదలైంది. ఇద్దరు పాల్గొనే ఈ రేస్‌లో అజిత్ ఒక్కడే పాల్గొన్నాడు. రూల్స్ ప్రకారం ఇద్దరు ఉంటే ఒకరు రేస్ పూర్తి చేశాక మరొకరు కారు నడుపుతారు. ఒక్కరే అయితే కారు ఆపి దిగి మళ్ళీ […]

పెళ్లి పీటలెక్కిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

సినీ నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన చిన్ననాటి స్నేహితుడు, చిరకాల ప్రేమికుడైన వేగేశ్న కార్తీక్‌ తో మూడు ముళ్ళు వేయించుకొని, ఏడడుగులు వేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో బుధవారం ఈ వివాహం వైభవంగా జరిగింది. అభినయ భర్త హైదరాబాద్ వాసి. అత‌నికి పలు వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తోంది. అభినయతో అతనికి 15 సంవత్సరాల నుంచే పరిచయం ఉంది. మాట‌, వినికిడి శ‌క్తి లేనప్పటికీ త‌న టాలెంట్‌తో మంచి న‌టిగా పేరు తెచ్చుకుంది […]

డా|| సర్వేపల్లి రాధాకృష్ణ వర్దంతి

డా|| సర్వేపల్లి రాధాకృష్ణ వర్దంతి 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నారు

ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి శుభవార్త..

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే సీనియారిటీ జాబితా రూపొందించి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలని కమిషనర్ కృష్ణతేజ అధికారులకు సూచించారు. ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

AI సంచలనం.. ఫస్ట్ ఏఐ మూవీ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న తరుణంలో, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి AI సినిమా కన్నడలో వచ్చింది. ఈ ‘లవ్ యూ’ అనే సినిమాను కేవలం 10 లక్షలతో AI ద్వారా రూపొందించడం విశేషం. దర్శక నిర్మాత నరసింహ మూర్తి, AI నిపుణుడు నూతన్ తప్ప నటన, సంగీతం, పాటలు, నేపథ్య సంగీతం, డబ్బింగ్ అన్నీ AIతోనే చేశారు. 95 నిమిషాల సినిమా:  “95 నిమిషాల నిడివి గల సినిమాలో 12 పాటలున్నాయి. సెన్సార్ బోర్డు సభ్యులు […]

విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు యూరప్ పర్యటనకు బయలుదేరుతున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 20న తన పుట్టినరోజు వేడుకలను అక్కడే నిర్వహించనున్నారు. ఈ పర్యటన వ్యక్తిగతమైనదిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరి, అక్కడి నుంచి విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర ఈ పర్యటనకు సంబంధించి ఏ దేశానికి వెళ్లనున్నారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON