రాజీవ్ విగ్రహాన్ని తీసి.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని బరాబర్ పెడుతం : కేటీఆర్
సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసి తల్లి తెలంగాణ విగ్రహం బరాబర్ పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షులు ఉద్యమ కాలంలో ఎక్కడున్నారో ఎవరికీ తెలియదని విమర్శించారు. ఆయన కూడా ఈ రోజు తెలంగాణ ఉద్యమం గురించి కేసీఆర్ దీక్ష గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

