loader

రాజీవ్‌ విగ్రహాన్ని తీసి.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని బరాబర్‌ పెడుతం : కేటీఆర్‌

సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసి తల్లి తెలంగాణ విగ్రహం బరాబర్ పెడతామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన దీక్షా దివస్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షులు ఉద్యమ కాలంలో ఎక్కడున్నారో ఎవరికీ తెలియదని విమర్శించారు. ఆయన కూడా ఈ రోజు తెలంగాణ ఉద్యమం గురించి కేసీఆర్‌ దీక్ష గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

బాబు నిజస్వరూపం రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమౌతుంది: అంబటి

ప్రపంచవ్యాప్తంగా ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అప్పులు తీసుకొస్తున్నారని వైసిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అమరావతిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు భూములను దోచుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి రాగానే భూముల ధరలు తగ్గాయని, అమరావతి కోసం ఇన్నీఅప్పులు తీసుకొచ్చి రూ.3 వేల కోట్లకే టెండర్లు పిలిచారని విమర్శించారు. చంద్రబాబు నిజస్వరూపం రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమౌతుందని, రాజధానిని పూర్తి చేయకుండా సీరియల్ కథలా నడపాలన్నది చంద్రబాబు ప్లాన్ […]

పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. కోనసీమ పచ్చదనం అంశంలో తెలంగాణకు ముడిపెట్టి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని సృష్టిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే డి. అనిరుధ్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌ను వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ సినిమా ‘ఓజీ’కు 800 రూపాయల టికెట్ ధర పెట్టి కొని ప్రొడ్యూసర్లను కాపాడామని, కానీ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తే ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు.

శ్రీలంకలో దిత్వా తుపాను దెబ్బకు 123 మంది బలి

దిత్వా తుపాను శ్రీలంకలో బీభత్సం సృష్టించింది. అతి భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సహా కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా ఇప్పటివరకు 123 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 34 మంది ఆచూకీ గల్లంతైంది. 35 శాతం గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని వివరించింది. శుక్రవారం కెలాని నది ఒడ్డు మునిగిపోయిందని, వందల మందిని తాత్కాలిక పునరావాసాలకు తరలించామని పేర్కొన్నారు.

‘దిష్టి’ ఎమోజీతో రూమర్స్‌కు చెక్ పెట్టిన స్మృతి-పలాశ్

భారత మహిళల జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన- సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం అనూహ్యంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో పలు రూమర్లు జోరుగా చక్కర్లు కొట్టాయి. స్మృతిని పలాశ్ మోసం చేశాడని.. వీరు పూర్తిగా పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో స్మృతి-పలాశ్ దిష్టి రక్ష ఎమోజీతో ఈ వార్తలకు చెక్ పెట్టారు. ఇరువురు తమ ఇన్‌స్టా బయోను అప్‌డేట్ చేశారు.

ఇమ్రాన్ ఖాన్ ను చూపించాలంటూ పాక్ లో భారీ ర్యాలీలు.. భారత్ అప్రమత్తం

పాకిస్తాన్ లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు  మళ్లీ వార్తలు రావడంతో ఆయన పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని పాక్ సైనికాధికారి తెలిపినా.. అద్వాల జైలు వద్ద భారీ ర్యాలీలు నిర్వహిస్తుండడంతో పాక్ లో ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారత్ పై ఉగ్రదాడులు చేసే అవకాశం ఉందని […]

తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్.. దీక్షా దివస్‌పై డాక్యుమెంటరీని ఆవిష్కరించిన కేటీఆర్

హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి,ప్రో|| జయశంకర్ ‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష, 2009 నుంచి 2013 వరకు జరిగిన ఉద్యమం, స్వరాష్ట్ర సాధన, గెలుపు, పదేళ్ల సంక్షేమంపై చిత్ర ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిషన్‌ను తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేశారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమంపై […]

కేబినెట్‌ మీటింగ్‌లో తప్పుడు ప్రజంటేషన్.. ఆ ప్రభుత్వ ఉద్యోగిపై వేటు

కేబినెట్ సమావేశంలో తప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు చెందిన సెక్షన్‌ ఆఫీసర్‌ కె.విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. హోర్డింగ్‌ల లైసెన్సింగ్‌పై చర్చ జరగాల్సిన సమయంలో పొరపాటున మరో ఫైల్ రావడంతో సీఎం, మంత్రులు అసహనానికి గురయ్యారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సరైన ప్రజెంటేషన్‌ను సమర్పించారు. అనంతరం ఆ అధికారి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించి అతడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

3 ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యంలో విద్యుత్ ఉత్పత్తే కీలకం : భట్టి విక్రమార్క

విద్యుత్‌ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు తయారు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని భట్టి విక్రమార్క అన్నారు. సీఎం, కేబినెట్‌ సహచరులు కలిసి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా చేరడానికి పెట్టుబడులు రావాలని, రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేయాలని వెల్లడించారు. ఆ దిశగా విద్యుత్‌ తయారు చేసుకోవాలని ప్రణాళికలు చేస్తున్నామని, ఎనర్జీ వినియోగంలో భారత్ ఆరో స్థానంలో […]

ద‌ళిత మ‌హిళ‌ను వంట చేయ‌కుండా అడ్డుకున్న ఆరుగురికి జైలుశిక్ష‌

ప్ర‌భుత్వం ఉన్న‌త పాఠ‌శాలో 44 ఏళ్ల ప‌ప్పాల్ కుక్‌గా చేసింది. ఆరుగురు వ్య‌క్తులు.. విద్యార్థుల పేరెంట్స్‌. త‌మ పిల్ల‌ల‌కు వంట చేయ‌కుండా ఓ ద‌ళిత మ‌హిళ‌ను అడ్డుకున్న ఆరుగురు గ్రామ‌స్థుల‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది త‌మిళ‌నాడు కోర్టు. 2018లో జ‌రిగిన ఈ ఘ‌టన‌పై శుక్ర‌వారం స్పెష‌ల్ కోర్టు తీర్పునిచ్చింది. ఎస్సీ-ఎస్టీ చ‌ట్టం కింద కేసు కొన‌సాగింది. ప‌ళ‌నిస్వామి గౌండ‌ర్, శ‌క్తివేల్‌, ష‌న్ముగ‌మ్‌, వెల్లంగిరి, దురైస్వామి, సీతా ల‌క్ష్మీపై కుల‌వివ‌క్ష కేసు కింద శిక్ష‌ను ఖ‌రారు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON