loader

ఈ నెల 14న తెలంగాణ బంద్ : R.కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు జారీ చేసిన స్టే ఆర్డర్ రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్ని బీసీ సంఘాల సమన్వయంతో ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రిజర్వేషన్లపై స్టే విధించడం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్య అని ఆయన వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయ బాలికా దినోత్సవం

అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహించబడుతోంది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్‌ రూజ్‌వెల్ట్‌, 192 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్ర్తీ, పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాన్‌ అన్న పదాన్ని పీపుల్‌గా మార్చింది.

సీఎం కీలక నిర్ణయం.. రూ. 60 కోట్లు విడుదల

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో తరచూ ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ వెల్ఫేర్ సొసైటీ స్థాయి హాస్టల్స్‌లోని సమస్యలను పరిష్కరించేందుకుగాను రూ. 60 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్స్‌ను ఆయన విడుదల చేశారు. ఒక్కో ఎస్సీ, బీసీ సొసైటీకి రూ. 20 కోట్లు.. అలాగే ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ. 10 కోట్ల […]

మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌ తన రాజకీయ ప్రయాణాన్ని ముగించి ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో కొత్త దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఆయన అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో పాటు ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) Startup) ఆంత్రోపిక్‌లో సీనియర్ సలహాదారుగా నియమితులయ్యారు.త్వరలో జరగబోయే మైక్రోసాఫ్ట్ (Microsoft) వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.

అట్టుడికిపోతున్న పాకిస్తాన్.. ఇస్లామాబాద్ సహా అనేక నగరాల్లో హింసాత్మక నిరసనలు!

పాకిస్తాన్‌లో మళ్లీ భారీ హింస చెలరేగింది. గాజాలో ఇజ్రాయెల్‌ దాడులకు నిరసనగా TLP సంస్థ చేపట్టిన ర్యాలీల్లో అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. లాహోర్‌ , ఇస్లామాబాద్‌ , పెషావర్‌, క్వెట్టాతో సహా పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఇస్లామాబాద్‌లో అమెరికా ఎంబసీ ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. లాహోర్‌లో పోలీసు కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఐదుగురు పోలీసులు కూడా గాయపడ్డారు. పలు చోట్ల పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఇంటర్నెట్‌ను […]

బెంగాల్ జాబ్ స్కామ్ .. మంత్రి సుజిత్ బోస్ నివాసాలపై ఇడి దాడులు

ఉద్యోగ కుంభకోణం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) బెంగాల్ రాష్ట్ర మంత్రి సుజిత్ బోస్ నివాసంపై శుక్రవారం భారీ స్థాయిలో దాడులు జరిపింది. మున్సిపాల్టీ మాజీ అధికారుల నివాసాలపై ఇడి సోదాలతో కలకలం చెలరేగింది. మున్సిపాల్టీలలో భారీ స్థాయి జాబ్ స్కామ్ జరగడంతో ఇడి రంగంలోకి దిగింది.మంత్రి ఇంటి నుంచి ఇప్పటికైతే పలు ఒఎంఆర్ షీట్లను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. మంత్రికి చెందిన ఓ రెస్టారెంట్ మేనేజర్‌ను కూడా ఇడి అధికారులు ప్రశ్నించారు. ఈ స్కామ్ కేసు […]

అల్యుమినియం ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

ిరుపతి జిల్లా ఏర్పేడు మండలం రాజులపాలెం సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. సిఎంఆర్ ఎకో అల్యూమినియం పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో పరిశ్రమ సగానికి పైగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఏర్పేడు-వెంకటగిరి ప్రధాన రహదారి పక్కన పరిశ్రమ ఉండటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.

ఏసీబీ దాడుల్లో కోట్ల కొద్దీ ఆస్తులు దొరికాయి.. అలాగే 17 టన్నుల తేనె కూడా

మధ్యప్రదేశ్ లోకాయుక్త అధికారులు రిటైర్డ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) చీఫ్ ఇంజనీర్ GP మెహ్రా ఇళ్లు, ఆఫీసులపై దాడులు చేశారు. ఈ దాడులు పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడ్డాయి. మొత్తం రూ.36.04 లక్షల నగదు, 2.649 కేజీల బంగారు, 5.523 కేజీల వెండి, అనేక ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బీమా పాలసీలు, షేర్ల డాక్యుమెంట్లు, ఫామ్‌హౌస్‌లో 17 టన్నుల తేనే దొరికింది. మొత్తం ఆస్తుల విలువ ఎన్ని కోట్ల రూపాయలకు చేరుకుంటుందో అంచనా వేయడానికి  ఫోరెన్సిక్ టీమ్‌లు […]

మెడికల్‌ కాలేజీ వాటర్‌ ట్యాంకులో మృతదేహం.. పది రోజులుగా ఆ నీటిని తాగిన విద్యార్థులు

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో మహామృషి దేవరహ బాబా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలోని వాటర్‌ ట్యాంకు నీటి నుంచి దుర్వాసన రావడాన్ని గ్రహించారు. వాటర్‌ ట్యాంకును పరిశీలించగా అందులో కుళ్లిన మృతదేహం కనిపించింది. అయితే గత పది రోజులుగా ఆ ట్యాంకులోని నీటిని మెడికల్‌ విద్యార్థులు, సిబ్బంది తాగారు. ఈ విషయం తెలిసి వారు షాక్‌ అయ్యారు.

బీపీఈడీ, డీపీఈడీ పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుల (బీపీఈడీ, డీపీఈడీ) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శశికాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON