loader

డీప్‌టెక్ వద్దు… స్టార్టప్‌ ముద్దు..

ఇండియాలో డీప్‌టెక్‌పై పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సంజయ్‌ పేర్కొన్నాడు. దీనివల్ల దేశంలో స్టార్టప్‌ల సంఖ్య తగ్గుతుందని, ఆ రంగంలో పెట్టుబడులు కూడా తగ్గుతాయన్నారు. అంతేకాకుండా… ఇప్పటికే ఏఐ రంగంలో స్టార్టప్‌లు ప్రారంభించి అభివృద్ది చేస్తున్నవారిపై డీప్‌టెక్‌ ప్రభావం ఉంటుందని నూతన స్టార్టప్‌లకు పెట్టుబడి పెట్టేవారు తగ్గిపోతారని ఆయన హెచ్చరించారు.

విమాన ఖర్చులు ఇస్తాం.. వెళ్లిపోండి

అక్రమ వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ ఆఫర్‌ ఇచ్చారు. స్వచ్ఛందంగా దేశం వీడాలనుకొనే వారికి విమాన టికెట్లు కొనిస్తాం, ఖర్చులకు కొంత డబ్బు కూడా ఇస్తామని ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అమెరికాలో అక్రమ వలసదారులకు స్వచ్ఛందంగా దేశాన్ని, వీడే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు.దీనిలో భాగంగా అలా వెళ్లేవారికి విమాన చార్జీలతో పాటు ఖర్చులకు కొంత మొత్తం ఇస్తామని చెప్పారు. వారు మంచిగా ఉంటే, మేము వారిని తిరిగి దేశానికి తీసుకురావాలనుకుంటే, […]

తిరుపతి గోశాలపై రగులుతున్న రాజకీయం- రేపు పవన్ టూర్

తిరుమల అంశం మరోసారి రాజకీయ కాకకు కారణమవుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో ఆవులు భారీగా చనిపోయాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటిదేమీ లేదని టీటీడీ ప్రకటించింది. అక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తిరుమల వెళ్తున్నారు. వైసీపీ ఆరోపణలు చేస్తున్న టైంలో పవన్ కల్యాణ్ చేస్తున్న తిరుమల పర్యటన ఆసక్తిగా మారుతోంది. తన కుమారుడు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చిందుకు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

సినీ నటుడు రాజ్‌తరుణ్‌ ఇంటి వద్ద హైడ్రామా

సినీ నటుడు రాజ్‌ తరుణ, లావణ్య వివాద వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.  కోకాపేటలో తన కుమారుడు రాజ్‌ తరుణ్‌ కొనుగోలు చేసిన ఇంటిలో తాము ఉంటామంటూ బుధవారం ఆయన తల్లిదండ్రులు బసవరాజు, రాజేశ్వరిలు చేరుకున్నారు, వారు ఇంటి ముందు ఆందోళన దిగారు. ఇంట్లోకి వచ్చి తనను బలవంతంగా బయటకు నెట్టివేయాలని కుట్రలో భాగంగానే రాజ్‌ తరుణ్‌ తల్లిదండ్రులు ఇంట్లో ఉంటామని చెప్తున్నారంటూ లావణ్య ఆరోపిస్తున్నారు. మా ఇద్దరి మధ్య వ్యవహారం ఇంకా కోర్టులో కొనసాగుతుందని అప్పటివరకు […]

జపాన్ చేరుకున్న సీఎం రేవంత్.. ఎంబసీలో విందు

వారం రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం జపాన్ చేరుకుంది. బుధవారం టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్‌లో భారత రాయబారి శిబు జార్జ్‌తో సీఎం బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ బృందానికి ఎంబసీలో విందు భోజనం ఏర్పాటు చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళి, కాంగ్రెస్ ఎంపీ కే రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి నెపోలియన్, పలువురు అధికారులు ఈ విందులో పాల్గొన్నారు.

ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ అగ్రనేతల కీలక భేటీ..

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నూతన రథసారథి ఎవరన్న దానిపై త్వరలో స్పష్టత రానుంది. బీజేపీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో బుధవారం(ఏప్రిల్ 16) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక గురించి కూడా చర్చ జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శి […]

సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తాం:మంత్రి శ్రీధర్ బాబు

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై చట్టప్రకారం తాము ముందుకు వెళతామని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫొటోను షేర్ చేసినందుకు పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడంపై ఆయన స్పందించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని మంత్రి తెలిపారు.

గ్లోబల్ ఇండియన్ ప్రవాసి కబడ్డీ లీగ్ 2025

కబడ్డీ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబల్ ఇండియన్ ప్రవాసీ కబడ్డీ లీగ్ (GI-PKL) గురుగ్రామ్ విశ్వవిద్యాలయంలో 2025 ఏప్రిల్ 18 నుండి అట్టహాసంగా ప్రారంభం కానుంది. GI-PKL ప్రారంభ సీజన్‌లో 15 దేశాల కబడ్డీ క్రీడాకారులు (పురుషులు మరియు మహిళలు) పోటీపడతారు. ప్రారంభ మ్యాచ్‌లు ఏప్రిల్ 18, 2025 తమిళ లయన్స్ vs పంజాబీ టైగర్స్ (పురుషులు) హర్యానా షార్క్స్ vs తెలుగు పాంథర్స్ (పురుషులు) మరాఠీ వల్చర్స్ vs భోజ్‌పురి లెపర్డ్స్ (పురుషులు)

జీటీ4 కార్ రేస్‌లో సింగిల్‌గా దుమ్మురేపిన అజిత్ కుమార్

ఐరోపాలో జరుగుతున్న జీటీ4 కార్ రేస్‌లో దుమ్మురేపాడు స్టార్ హీరో అజిత్ కుమార్, ఒంటరిగా ఈ రేస్ లో పాల్గొని అదరగొట్టాడు స్టార్ హీరో. సినిమాతో పాటు కార్ రేస్‌ అంటే అజిత్‌కి ఎంతో ఇష్టం. ఐరోపాలో జీటీ4 కార్ రేస్ మొదలైంది. ఇద్దరు పాల్గొనే ఈ రేస్‌లో అజిత్ ఒక్కడే పాల్గొన్నాడు. రూల్స్ ప్రకారం ఇద్దరు ఉంటే ఒకరు రేస్ పూర్తి చేశాక మరొకరు కారు నడుపుతారు. ఒక్కరే అయితే కారు ఆపి దిగి మళ్ళీ […]

పెళ్లి పీటలెక్కిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

సినీ నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన చిన్ననాటి స్నేహితుడు, చిరకాల ప్రేమికుడైన వేగేశ్న కార్తీక్‌ తో మూడు ముళ్ళు వేయించుకొని, ఏడడుగులు వేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో బుధవారం ఈ వివాహం వైభవంగా జరిగింది. అభినయ భర్త హైదరాబాద్ వాసి. అత‌నికి పలు వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తోంది. అభినయతో అతనికి 15 సంవత్సరాల నుంచే పరిచయం ఉంది. మాట‌, వినికిడి శ‌క్తి లేనప్పటికీ త‌న టాలెంట్‌తో మంచి న‌టిగా పేరు తెచ్చుకుంది […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON