loader

ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీలకు షాక్

కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో చేట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) గుడువును ఫిబ్రవరి 14 వరకు పొడిగించింది. ఈ మేరకు ఆదివారం సీఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఓటర్ల జాబితా గణన కోసం డిసెంబర్ 4 వరకు అధికారులకు ఈసీ సమయం ఇచ్చింది. అయితే ఇప్పుడు దానికి డిసెంబర్ 16 వరకు పొడిగించింది. తుది జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన ప్రకటిస్తామని ఎన్నికల […]

రేపట్నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..

పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు విపక్షాల సహకారం కోరుతూ ఆదివారం కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లో ముఖ్యంగా పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేట్ రంగానికి స్వాగతం పలికేందుకు ఉద్దేశించిన బిల్లుతోపాటు ప‌ది బిల్లులను ఈసారి పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టాలని మోదీ స‌ర్కారు నిర్ణయించింది. అణు ఇంధన బిల్లు, 2025 తోపాటు కార్పోరేట్ చట్టాల (సవరణ) బిల్లు-2025, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు-2025, జాతీయ రహదారు ల(సవరణ) బిల్లులను ఉభయసభల ముందుకు తీసుకురానున్నారు.

సీఎం స్వగ్రామంలో మాజీ మావోయిస్టు ఏకగ్రీవం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో మాజీ మావోయిస్టు మల్లేపాకుల వెంకటయ్య (అలియాస్ మోహన్) సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మావోయిస్టు పార్టీలో మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, గంగన్న, పాన్‌గల్ దళాల్లో చురుకుగా పనిచేశారు. 2001లో వెంకటయ్య కల్వకుర్తి పోలీసుల సమక్షంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. ఈసారి కొండారెడ్డిపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వుడు కావడంతో, ముఖ్యమంత్రి చొరవతో గ్రామస్థులు వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. వెంకటయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబానికి […]

బలహీన పడుతున్న దిత్వా తుఫాన్… తిరుపతి, చిత్తూరులో భారీ వర్షాలు

దిత్వా తుఫాన్ బలహీన పడుతోంది. తీరాన్ని తాకే అవకాశం లేదని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు- పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఉత్తరం వైపు తుఫాన్ కదులుతుంది. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిత్వా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. తీరం వెంబడి గంటకు 45- 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ […]

నేషనల్ హెరాల్డ్‌ కేసు.. సోనియా, రాహుల్‌పై నేరపూరిత కుట్ర అభియోగాలు..!

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తోపాటు మరో నలుగురిపై కొత్త ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఇచ్చిన సమాచారంతో వారిపై నేరపూరిత కుట్ర అభియోగాలు మోపినట్లు ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు తెలిపారు. వీరు కుట్ర, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది. వీరందరూ కుట్రపూరితంగా కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి.. అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (AJL‌) కు చెందిన రూ.2వేల కోట్ల విలువైన ఆసులపై అధికారాన్ని పొందారని వెల్లడించింది.

లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. ఇద్దరు మృతి

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేరేడిగొండ మండలం బోథ్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి యూపీలోని గోరఖ్‌పూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 […]

గురజాడ అప్పారావు

గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 – 1915 నవంబర్ 30) ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. హేతువాది.వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది., తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. అతనుకు *కవి శేఖర*అనే బిరుదు ఉంది

కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం… 32 షాపులు దగ్ధం

జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద శనివారం అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక అభయ హనుమాన్ విగ్రహం సమీపంలో బొమ్మల దుకాణంలో మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున మంటల చెలరేగడంతో 32 దుకాణాలు అగ్నికి అహుతిగా మారాయి. ఒక్కో దుకాణంలో రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బొమ్మలు ఉన్నాయని నిర్వహకులు తెలిపారు. సమ్మక్క-సారలమ్మ జాతర ఉండడంతో పెద్ద మొత్తంలో బొమ్మలు దిగుమతి చేసుకున్నామని వ్యాపారులు చెబుతున్నారు. కోట్లలో ఆస్తి నష్టం జరిగిందని వ్యాపారులు పేర్కొన్నారు.

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో నలుగురు సజీవదహనం

దేశ రాజధాని ఢిల్లీలోని టిగ్రి ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల భవనంలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మొదట సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని చెప్పుల షూ షాపులో మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ తర్వాత పై అంతస్తులకు వ్యాపించి, మొత్తం భవనాన్ని చుట్టుముట్టాయి.మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. ప్రమాద స్థలంలో కాలిపోయిన మూడు మృతదేహాలను గుర్తించి.. బయటకు […]

డీజీపీలతో ప్రధాని సమావేశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం 60వ అఖిల భారత డీజీపీలు/ఐజీపీల సమావేశం రాయ్‌పూర్‌లో జరిగింది. ఈ సమావేశంలో దేశ భద్రతకు సంబంధించిన వేర్వేరు అంశాలపై విస్తృత చర్చలు జరిగాయని మోదీ ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపారు. ఈ రంగంలో ఉత్తమ ఆచరణలు, నూతన ఆవిష్కరణల గురించి పంచుకోవడానికి ఇది గొప్ప వేదిక అని చెప్పారు.డీజీపీలు తమ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరాలకు సంబంధించిన పరిస్థితులను వివరించారు. నేరాలను అరికట్టేందుకు తాము చేపట్టిన చర్యలను తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON