loader

చెన్నైకి చేరక ముందే విమానం అద్దంలో పగుళ్లు

మదురై నుంచి 76 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం శనివారం చెన్నైలో ల్యాండ్ కాకముందే దాని పైలట్ విండ్ షీల్డ్‌లో(అద్దంలో) పగుళ్లు కనిపించాయని అధికారులు తెలిపారు. ఇది గమనించిన పైలట్ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే విమానాశ్రయంలో తగు ఏర్పాట్లు చేశారు. విమానం చివరికి సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానాన్ని పార్కింగ్ కోసం ప్రత్యేక బే కి తీసుకెళ్లి, తర్వాత ప్రయాణికులను సురక్షితంగా దింపామని అధికారులు వివరించారు.

మంత్రి పొంగులేటిపై సిఎంకు ఫిర్యాదు చేసిన మంత్రి కొండా

వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఆ జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, పార్టీ అధిష్టానానికీ ఫిర్యాదు చేశారు. మేడారం ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ. 71 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కాగా ఈ మేరకు టెండర్లను పిలవడం జరిగింది. అయితే ఈ టెండర్‌ను తన అనుచరునికి ఇప్పించుకోవాలని మంత్రి పొంగులేటి ప్రయత్నిస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు […]

బిసి రిజర్వేషన్ ఇచ్చాకే స్థానిక ఎన్నికలు: మహేశ్‌కుమార్ గౌడ్

బిసి రిజర్వేషన్ ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని, రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తామని పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను తమ ప్రభుత్వం కట్టుబడి అమలు చేస్తామని పేర్కొన్నారు. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసే యోచనలో ఉన్నామని అన్నారు. ఇప్పటివరకు మూడు చట్టాలు, ఒక ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.

బెంగాల్‌లో మరో షాకింగ్‌ ఘటన… ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

బెంగాల్‌లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్‌లో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. శుక్రవారం రాత్రి క్యాంపస్‌కు వచ్చే సమయంలో యువతి వద్దకు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మొబైల్ ఫోన్ లాక్కున్నారు. అయితే ముగ్గురు వ్యక్తులు దగ్గరకు వచ్చే సమయంలో ఆమెతో పాటు ఉన్న ఫ్రెండ్ అక్కడి నుంచి పారిపోయినట్టుగా చెబుతున్నారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. క్యాంపస్‌కు కొంత దూరంలోనే ఈ ఘటన జరిగింది.

నటుడు శ్రీకాంత్‌పై సిసిఎస్‌లో ఫిర్యాదు

మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శనివారం పోలీసులకు (సిసిఎస్) ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాంత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘మా’ అసోసియేషన్ సభ్యత్వం నుంచి నటుడు శ్రీకాంత్‌ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.సినిమాటోగ్రఫీ మంత్రితో పాటు ‘మా’ అసోసియేషన్‌కు, చిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థకూ ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లనో కార్యకర్తలు […]

ఐపీఎస్ ఆత్మహత్య.. స్పందించిన సీఎం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హర్యానా కేడర్ ఐపీఎస్ అధికారి, ఏడీజీపీ వై.పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కులం కారణంగా బలవంతంగా ఆత్మహత్య చేసుకున్న ఘటనకు ఈ ఐపీఎస్ అధికారి మృతి ఒక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. అడిషనల్ డీజీపీ స్థాయి అధికారిని కులం పేరుతో వేధించడం చూస్తే.. సామాన్య ప్రజల […]

ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన రామ్ చరణ్ దంపతులు

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. శనివారం మోడీతో రామ్ చరణ్ దంపతులు భేటీ అయ్యారు. ఇటీవల ఢిల్లీలో ఆర్చరీ లీగ్ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని రామ్ చరణ్ లాంచ్ చేశారు. ఆ లీగ్ సక్సెస్ అయిన సందర్భంగా మోడీని కలిసినట్లు రామ్ చరణ్ సోషల్‌మీడియాలో ఆ ఫోటోలను పంచుకున్నారు. ఆర్చరీ లీగ్‌ ఈ ఏడాది తొలిసారిగా నిర్వహించారు.

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి వేడెక్కింది. తాజాగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు.ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సవాలు చేయాలని నిర్ణయించింది. దీనికి అవసరమైన చట్టపరమైన చర్యలను తీసుకునేందుకు అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్‌లతో ప్రభుత్వం చర్చలు జరిపింది.

నకిలీ మద్యం కేసులో జనార్దనరావును రహస్య ప్రదేశంలో విచారిస్తున్న అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందుతుడు అద్దేపల్లి జనార్దనరావును పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఇవాళ ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆయన విచారణలో మరిన్ని కీలకాంశాలు బయటపడతాయని ఎక్సైజ్అధికారులు భావిస్తున్నారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేస్తోంది. టీడీపీకి చెందిన నేతలే ఈ కేసులో ఉండటంతో వారిపై చర్యలు తీసుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయినా కూటమి నేతలపై […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON