loader

నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పునఃప్రారంభం

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్య శ్రీ సేవలు) నేటి నుంచి యథాతథంగా కొనసాగనున్నాయి. బకాయిలు రూ. 500 కోట్ల తక్షణం విడుదలకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దాంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నెట్‌వర్క్ హాస్పిటల్స్ సమ్మె విరమించాయి. ఎన్టీఆర్ వైద్య సేవలు మంగళవారం నుంచి ఏ ఆటంకం లేకుండా కొనసాగుతాయని పేద ప్రజలకు శుభవార్త చెప్పారు.

యూజీసీలో ఒకలా.. రాష్ట్రంలో మరోలా!

యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వం జారీచేసిన జీవోపై అభ్యంతరాలొస్తున్నాయి. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పీహెచ్‌డీ అభ్యర్థులకు 30 మార్కులు కేటాయించాలని యూజీసీ స్పష్టంచేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోలో పీహెచ్‌డీ ఉంటే 10 మార్కులు కేటాయిస్తామని పేర్కొన్నారు. దీంతో పీహెచ్‌డీ అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆరోపిస్తున్నారు. జీవోతో 20 మార్కులు కోల్పోవాల్సి ఉంటుందని పీహెచ్‌డీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కాన్వాయ్.. విద్యార్థులు పరీక్షకు దూరం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కాన్వాయ్ కారణంగా విశాఖలో దాదాపు 30 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. పవన్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేయడంతో అదే మార్గంలో వెళ్లాల్సిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్ మార్నింగ్ షిఫ్ట్ కి సకాలంలో వెళ్లలేక పరీక్షకు దూరం అయ్యారు. దీంతో ఇన్నేళ్ల తమ కష్టానికి ఫలితం లేకుండా పోయిందని విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. ఇప్పుడా విద్యార్థుల పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ చొరవ చూపి మళ్లీ పరీక్ష రాసే […]

కొన్ని సినిమాలపై ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు..

తమిళంలోనూ ఓ సినిమాపై ఇలాంటి క్రేజే ఉంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. అలా రిలీజ్ అయిందో లేదో.. సోషల్ మీడియా అంతా తగలబడిపోతుంది ఆ దెబ్బకుగుడ్ బ్యాగ్ అగ్లీ ట్రైలర్ చూసి ఫిదా అయిపోతున్నారు అజిత్ ఫ్యాన్స్. చాలా ఏళ్ళ తర్వాత అజిత్‌లోని స్టైలిష్ యాంగిల్ బయటికి తీసుకొచ్చారు దర్శకుడు అధిక్. ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రమోషన్స్ అయితే ఏం చేయట్లేదు.. అజిత్ కూడా బయటికి రావట్లేదు కానీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. […]

కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు,

వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారింది. కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు నమోదవుతున్నాయి. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట మెన్షనింగ్ జరిగింది. ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ సీజేఐ ఎదుట ఆ పిటిషన్లను మెన్షన్ చేశారు. ఈ పిటిషన్లను సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలని రిక్వెస్ట్ చేశారు. ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు రాజకీయ పార్టీలు, నేతలు పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మెన్షనింగ్‌ను పరిశీలిస్తామన్నారు. […]

నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. మాకేం భయం లేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామెంట్స్..

ఆదాయపు పన్ను శాఖ నటుడు-దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు కూడా నోటీసు జారీ చేసింది. 2022లో విడుదలైన మూడు సినిమాల నుండి పృథ్వీరాజ్ సంపాదించిన ఆదాయం గురించి వివరాలను స్పష్టం చేయాలని నోటీసులో కోరారు. ఎంపురాన్ సినిమా విడుదలైనప్పటి నుంచి రాజకీయ వివాదాలను రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై పృథ్వీరాజ్ తల్లి మల్లికా సుకుమారన్ రియాక్ట్ అయ్యారు. “నా కొడుకు ఏ తప్పు చేయలేదు. మేము ఎలాంటి దర్యాప్తుకూ భయపడము” ఈ విషయంలో మాకు మద్దతు ఇస్తోన్న వారికి కృతజ్ఞతలు […]

ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. రూ.3,500 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకు నెట్ వర్క్ నోటీసులు ఇచ్చింది. 600 ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి.పేరుకు ఏపీ రైజింగ్ స్టేట్.. కానీ వైద్య సేవలకు దిక్కులేదు. పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదు అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యం.ఆరోగ్య శ్రీ పథకానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని […]

మైక్రోసాఫ్ట్ వేడుకల్లో గేట్స్ ఎదుటే సత్య నాదెళ్లను నిలదీసిన ఉద్యోగి..

మైక్రోసాఫ్ట్ 50వ వార్షికోత్సవం సందర్బంగా మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల; మాజీ CEOలు స్టీవ్ బాల్మర్, బిల్ గేట్స్ వేదికపై కంపెనీ గురించి మాట్లాడుతుండగా.. భారతీయ అమెరికన్ వానియా అగర్వాల్ గట్టిగా నినాదాలు చేశారు. ‘మీ అందరికీ సిగ్గుండాలి.. మీరంతా కపట వ్యక్తులు.. మైక్రోసాఫ్ట్ టెక్నాలజీతో గాజాలో 50,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు తీశారు.. మీకు ఎంత ధైర్యం. వారి రక్తంతో వేడుకలు చేసుకుంటున్నందుకు మీ అందరికీ సిగ్గుండాలి.. ఇజ్రాయేల్‌తో సంబంధాలు తెంచుకోండి’ వానియా గట్టిగా కేకలు […]

అడవితల్లి బాటలో పవన్ కళ్యాణ్

గిరిజన గ్రామాలలో రోడ్ల సౌకర్యం లేక గర్భిణీలను డోలీలు కట్టుకొని ఆసుపత్రులకు తీసుకు వెళ్లిన అనేక ఘటనలు మనం చూసాం. అయితే అటువంటి పరిస్థితి గిరిజన గ్రామాల్లో ఉండకుండా అడవితల్లి బాట పేరుతో రోడ్లను అభివృద్ధి చేయాలని సంకల్పించింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండురోజుల పాటు గిరిజన గ్రామాలలో పర్యటించనున్నారు. నేడు, రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.

మరోసారి బ్యాంకుల విలీనం.. కేంద్రం ప్రకటన..

బ్యాంకుల విలీనానికి మరోసారి తెరలేపింది కేంద్ర ప్రభుత్వం. బ్యాంకుల కార్యకలాపాల సామర్థ్యం పెంచడం, ఖర్చుల హేతుబద్ధీకరణ చేపట్టడమే లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈమేరకు దేశంలోని 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు లను 28కి కుదించనున్నట్లు పేర్కొంది. ఒక రాష్ట్రం- ఒక ఆర్ఆర్‌బీ(Regional Rural Bank) ప్రణాళికను అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON