loader

లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బస్తర్ రీజియన్‌ దంతెవాడ జిల్లాలో ఆదివారం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 27 మందిపై మొత్తం రూ.65 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘లోన్ వర్రాటు’, ‘పూనా మర్గం’ పథకాలకు ఆకర్షితులై వారు లొంగిపోయారని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టుల్ల 12 మంది మహిళలు ఉన్నారు. 2020ల్లో పోలీసులు, భద్రతా బలగాలపై దాడులు, కాల్పులు, అలాగే IEDలు అమర్చడం వీరికి ప్రమేయం […]

మన్‌ కీ బాత్‌లో కరీంనగర్‌ సిల్వర్‌ ఫిలిగ్రీ ఆర్ట్‌పై మోదీ ప్రశంసలు..

కరీంనగర్ లో ప్రసిద్ది చెందిన సంప్రదాయ పూల ఆకృతితో ఉన్న సిల్వర్ మిర్రర్‌ను ఇటలీ ప్రధానికి బహుకరించానని ప్రధాని మోదీ చెప్పడంతో ఇప్పుడు ఫిలిగ్రీపై చర్చ నడుస్తుంది. కరీంనగర్ వాసులు అంతర్జాతీయ సమాజం ముందు తమలోని కళాత్మకతను ప్రదర్శించిన విషయాన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మన్ కీ బాత్ లో పీఎం ఫిలిగ్రీ కళ గురించి ప్రస్తావించారు. కరీంనగర్‌లో తయారు చేసిన సిల్వర్ ఫిలిగ్రీ బహుమతులు.. వివిధ దేశాధినేతలకు అందించానని అన్నారు. ఈ బహుమతిలు తీసుకున్న నేతల సంతోషాన్ని […]

సర్గమ్ 2025లో అలరించిన దేశభక్తి గీతాలు..పవన్ కళ్యాణ్ హాజరు..!

డిసెంబర్ 4న జరగబోయే నేవీ డే ఉత్సవాలకు ముందస్తు వేడుకగా విశాఖపట్నంలో నిర్వహించిన ‘సర్గమ్ 2025.. ఇండియన్ నేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా’ కార్యక్రమం సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శనివారం సాయంత్రం సముద్రిక ఆడిటోరియంలో నిర్వహించిన ఈ వేడుక సముద్రతీర నగరానికి మరింత శోభ తీసుకొచ్చింది.

హెచ్‌ఐవీ నియంత్రణలో ఏపీ టాప్.. ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా?

హెచ్‌ఐవీ కేసుల నియంత్రణలో AP దేశంలోనే టాప్ లో నిలిచినట్లు వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. జాతీయ స్థాయిలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (న్యాకో) నిర్దేశించిన 80% లక్ష్యంలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ (ఏపీ శాక్స్) ఏకంగా 76.96% సాధించిందని ఆయన తెలిపారు. 2015-16లో 2.34%గా ఉన్న పాజిటివిటీ రేటు, 2024-25 నాటికి 0.58% కు తగ్గిందని ఆయన స్పష్టం చేశారు. 2024-25 నాటికి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల మరణాల సంఖ్య 88.72% మేర […]

రెండు బస్సులు ఢీ.. 11 మంది మృతి, 40 మందికి గాయాలు

ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. దీంతో మృతుల సంఖ్య పెరుగవచ్చని తెలుస్తున్నది. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో కరైకుడి వైపు వెళ్తున్న ప్రభుత్వ బస్సు, మదురై వైపు వెళ్తున్న మరో ప్రభుత్వ బస్సు తిరుపత్తూరు సమీపంలోని రహదారిపై […]

సచిన్‌-ద్రవిడ్‌ను అధిగమించిన రోహిత్‌-కోహ్లీ జోడీ..!

సౌతాప్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీం ఇండియా  స్టార్ బ్యాట్స్‌మెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు విధ్వంసం సృష్టించారు. విరాట్ కోహ్లీ.. 48 బంతుల్లో అర్థశతకం సాధించాడు. మరోవైపు రోహిత్ శర్మ కూడా నిలకడగా ఆడుతు.. హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటేశాడు. ఇది రోహిత్-కోహ్లీ కలిసి 392వ ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌. గతంలో ఎవరూ భారత్‌ తరఫున మరే జంట కలిసి ఇన్ని మ్యాచ్‌లు ఆడలేదు. రోహిత్‌-కోహ్లీ జోడీ.. సచిన్‌-రాహుల్‌ ద్రవిడ్‌ రికార్డును అధిగమించారు. సచిన్ టెండూల్కర్ – […]

సిక్సర్ల కింగ్ రోహిత్ శర్మ.. వన్డేలలో అత్యధిక సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పుడు వన్డే ఇంటర్నేషనల్స్ (ODI)లో చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. 19.4వ బంతిని రోహిత్ సిక్సర్ కొట్టాడు. రోహిత్ కెరీర్‌ లో 352వ సిక్స్. తద్వారా షాహిద్ ఆఫ్రిది రికార్డును బద్దలుకొడుతూ భారత ఓపెనర్ సిక్సర్ల కింగ్ […]

‘ఆ విమానాల్లో సాఫ్ట్‌వేర్ సమస్య పరిష్కారమైంది’.. వెల్లడించిన డీజీసీఏ

భారత్‌ ఎయిర్‌లైన్స్‌ వాడే ఎయిర్‌బస్‌ ఏ320 (Airbus A320) విమానాల్లో సాఫ్ట్‌వేర్‌ సమస్య (Software glitch) ను పరిష్కరించినట్లు డీజీసీఏ (DGCA) ఆదివారం వెల్లడించింది. మొత్తం 323 విమానాల్లో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసినట్లు తెలిపింది. భారత్‌ ఎయిర్‌బస్‌కు చెందిన ఏ320 రకం విమానాలు 338 వినియోగిస్తోంది. సూర్యుడి వేడి కారణంగా ఎయిర్‌బస్‌ ఏ320 విమానాల్లో సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. ఇవి ప్రధానంగా ఇండిగో, ఎయిరిండియా, ఇండియా ఎక్స్‌ప్రెస్‌ వద్ద ఉన్నాయి.

కృష్ణా జలాల వినియోగం.. నీటి కేటాయింపులపై చర్చ జరగాలి: టీడీపీ ఎంపీ

కృష్ణా నదీ జలాల వినియోగం.. నీటి కేటాయింపుల్లో స్పష్టతపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని అఖిల పక్ష సమావేశంలో కోరినట్లు లోక్‌సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. పార్లమెంట్‌లో ఏడు అంశాలపై చర్చించాలని కోరామన్నారు. ఓటర్ల జాబితా క్రమబద్దీకరణ సర్ (SIR)ను స్వాగతిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సత్వరమే సర్ (SIR) ప్రక్రియను ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు. ఆక్వా రైతుల సమస్యలపై చర్చ జరిపి.. పార్లమెంట్ వేదికగా వారికి స్పష్టమైన హామీతోపాటు భరోసా ఇవ్వాలని కోరినట్లు వివరించారు.

తెలుగు తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో తెలుగు తమ్ముళ్లకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. పేదల సేవలో కార్యక్రమంలో నేతలు అందరూ పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో నిరంతరం ఉంటేనే మంచి రాజకీయ నేతలుగా రాణించగలరని సూచించారు. ఫించన్ల పంపిణీలో అందరూ నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని.. ఇది పేదల సేవగా భావించాలని సూచించారు. ఫింఛన్ల పంపిణీలో నేతలు భాగస్వామ్యంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON