loader

ముగిసిన ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం.. గాజాలో శాంతి పవనాలు వీచినట్టేనా..!

గాజా మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్‌, హమాస్‌లు అంగీకరించినందుకు గర్వంగా ఉందన్నారు అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ నిర్ణయంతో హమాస్‌ చేతిలో బందీగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదల అవుతారన్నారు. ఇజ్రాయెల్‌ తన బలగాలను వెనక్కి తీసుకుంటుందని తెలిపారు. దీర్ఘకాలికమైన శాంతిని సాధించే క్రమంలో సైనికుల ఉపసంహరణ తొలి అడుగుగా నిలిచిపోతుందన్నారు ట్రంప్‌. ఈ మేరకు తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు. రెండేళ్ల గాజా యుద్ధాన్ని ముగింపు పలికేందుకు ఇదొక అపూర్వ […]

సీజేఐపై దాడికి యత్నం.. సుప్రీంకోర్టులోకి ఆ న్యాయవాది ఎంట్రీ రద్దు

సీజేఐపై దాడికి యత్నించిన న్యాయవాది రాకేష్‌ కిశోర్‌ని సస్పెండ్‌ చేస్తున్నట్లు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. రాకేష్‌ సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటూ సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించకుండా ఆయన ఎంట్రీ కార్డును రద్దు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాకేష్‌ కిశోర్‌ చేసిన దాడి స్వతంత్ర న్యాయవ్యవస్థపై.. పవిత్రమైన కోర్టు గది కార్యకలాపాలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది.

సీనియర్ల వేధింపుల కారణంతోనే IPS ఆఫీసర్‌ ఆత్మహత్య

హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి వై పురాన్ కుమార్ అక్టోబర్‌ 7న సూసైడ్ చేసుకున్నారు. మరణానికి ముందు రాసిన 9 పేజీల సూసైడ్‌ నోట్‌ ఆయన జేబులో లభ్యమైంది. ఇందులో 12 మంది అధికారులు తనను మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు ఆరోపించారు. హర్యానా డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్, రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియా తన భర్తపై మానసిక వేధింపులు, కుల ఆధారిత వివక్ష, హింసకు పాల్పడ్డారని ఆయన భార్య ఐఏఎస్ అమ్నీత్ పి కుమార్ […]

స్కూల్ బ‌స్సులో పొగ‌లు.. 25 మంది విద్యార్థులు సుర‌క్షితం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప‌రిధిలో ఘోర ప్ర‌మాదం త‌ప్పింది. స్కూల్ విద్యార్థుల‌తో వెళ్తున్న ఓ ప్ర‌యివేటు పాఠ‌శాల బ‌స్సులో ఆక‌స్మికంగా పొగ‌లు వ‌చ్చాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన డ్రైవ‌ర్ బ‌స్సును రోడ్డు ప‌క్క‌న నిలిపి ఉంచాడు. అనంత‌రం పిల్ల‌లంద‌రిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. పిల్ల‌లంద‌రూ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డార‌ని, ఎవ‌రికీ ఎలాంటి హానీ క‌ల‌గ‌లేద‌న్నారు. డ్రైవ‌ర్ కూడా ఈ ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నాడు. పిల్ల‌ల‌ను మ‌రో బ‌స్సులో పాఠ‌శాల‌కు త‌ర‌లించిన‌ట్లు ఇన్‌స్పెక్ట‌ర్ తెలిపారు.

డీకే శివకుమార్ జోక్యంతో.. తెరుచుకున్న బిగ్ బాస్

కన్నడ బిగ్‌బాస్ షోకు ఎదురైన పెద్ద అడ్డంకి ఇప్పుడు తొలగిపోయింది. ఇటీవల కాలుష్య నియంత్రణ మండలి అధికారులు షో కోసం ఏర్పాటు చేసిన బిగ్‌బాస్ హౌస్‌పై సీల్ వేసి షో నిర్వహణను నిలిపివేయగా, ఇది ,అభిమానులకు, షో నిర్వాహకులకు ఇబ్బందిని కలిగించింది. ఈ విషయం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. స్టూడియోకు మరో అవకాశం ఇవ్వాలని బెంగళూరు సౌత్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ కు ఆదేశాలు జారీ చేశారు.

ఆర్టీసీ ఎండీని కలిసిన కేటీఆర్‌ బృందం.. బస్‌ చార్జీలు తగ్గించాలని డిమాండ్‌

సిటీ బస్సులో పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ‘చలో బస్‌ భవన్‌’ కార్యక్రమాన్ని BRS చేపట్టింది. తీవ్ర నిర్బంధాల నడుమ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్టీ నేతలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి బస్‌ భవన్‌ చేరుకున్నారు. అనంతరం టీజీఎస్‌ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కేటీఆర్‌ బృందం. భేటీ అయ్యారు. గ్రేటర్‌ పరిధిలో పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ తరఫున లేఖ అందజేశారు.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మొదటి విడతకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు అధికారులు ప్రత్యేక ప్రకటన చేశారు. మొదటి దశలో 292 జడ్పీటీసీ, 2, 963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న వాటిని పరిశీలిస్తారు. 15 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. నవంబర్‌ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందని […]

పీపీపీ మెడికల్ కాలేజీల నిర్ణయాలపై హై కోర్టుకు వెళ్లిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట దక్కింది. రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను నిర్మించి, నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఉందని, కాబట్టి టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తున్నామని తెలిపింది.

ఏపీలో 4 బ్యాంకులు విలీనం.. 5 రోజులు బ్యాంక్ సేవలు బంద్.. కస్టమర్లకు అలర్ట్

కొద్ది రోజుల కిందట.. ఆర్బీఐ గ్రామీణ బ్యాంకుల విలీనం గురించి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌లోని 4 గ్రామీణ బ్యాంకులు.. ఒకే బ్యాంకింగ్ గ్రూప్‌గా ఏర్పాటు కానున్నాయి. దీంతో 4 బ్యాంకులు ఇక మీదట కనిపించవు. విలీన ప్రక్రియలో భాగంగా.. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అనుసంధానంలో భాగంగా.. సాంకేతిక కారణాలతో.. దాదాపు 5 రోజుల పాటు చాలా వరకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటన విడుదల చేసింది.

చలో బస్ భవన్.. బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్ట్

చలో బస్‌ భవన్‌కు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ముందస్తు చర్యల్లో భాగంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే వివేకానంద గౌడ్, శంభీర్ పూర్ రాజు, సాయుబాబా తదితరులను కూడా గృహనిర్బంధం చేశారు పోలీసులు. మాజీ మంత్రి , మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON