loader

చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. మరో 44 వేల ఎకరాల భూ సేకరణకు సన్నద్ధం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటోంది. అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రాజధానిలో పెరుగుతున్న అవసరాలు, కీలక పౌర సదుపాయాలకు స్థలాభావం కారణంగా మరో 44,676 ఎకరాల భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీని కోసం సంబంధిత అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. గతంలో 29 గ్రామాల్లో 34,689 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన సీఆర్డీఏ, ఇప్పుడు ఫేజ్-2 భూ […]

ప్రపంచంలో ఎల్పీజీ రేటు భారత్‌లోనే ఎక్కువ !

పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను పెరిగిన గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు మరింత కుదేలు చేస్తున్నాయి. ఎల్పీజీ ధర ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ తొలి స్థానంలో నిలిచింది. అలాగే పెట్రోల్‌ రేటులో మూడు, డీజిల్‌ రేటులో ఎనిమిదో స్థానాన్ని సాధించింది. ఈ మేరకు నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ప్రజల కొనుగోలు శక్తితుల్యత (పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ-పీపీపీ) విధానాన్ని బట్టి ఏఐ చాట్‌బాట్‌ ‘గ్రోక్‌’ సమాధానాలు ఇచ్చింది.

వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అరెస్టు !

ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేశారు. భారత సీబీఐ అధికారులు కోరిక మేరకు మెహుల్‌ ఛోక్సీ బెల్జియం పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో అతడిని అప్పగించాలని భారత్‌ కోరింది. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్‌ చేసినట్టు తెలిసింది.  పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటపడటానికి కొద్ది వారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు […]

తిరుమల ఘాట్ రోడ్ల రూపురేఖలు మారబోతున్నాయి.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

తిరుమల ఘాట్ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.12 కోట్లతో రెండు ఘాట్ రోడ్ల మరమ్మతులకు ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్లు గుంతలమయంగా మారాయని, వాటిని బాగు చేయాలని టీటీడీ ఛైర్మన్ కోరారు. అలాగే, 2025లో తిరుమలలో జరిగే గరుడ సేవల తేదీలను, రద్దు చేసిన తేదీలను కూడా ప్రకటించారు. ఇటీవల ఒంటిమిట్ట రామాలయ కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఆ సమయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, […]

వరంగల్‌ జాబ్‌మేళాలో అపశృతి.. ప్రవేశ ద్వారం వద్ద తొక్కిసలాట!

వరంగల్ జాబ్‌మేళాలో 65 ప్రైవేటు కంపెనీలు పాల్గొనగా దాదాపు 23 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరైనారు. ఆ స్థాయిలో నిరుద్యోగులు వస్తారని ఊహించని అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. ప్రభుత్వం స్వయంగా ఏర్పాటుచేసిన జాబ్‌ మేళా కావడంతో నిరుద్యోగులు పోటెత్తారు. సుమారు 6వేల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని ప్రచారం చేయడంతో గంపెడు ఆశలతో యువత అక్కడికి చేరుకుంది. కానీ అరకొర ఏర్పాట్ల కారణంగా అక్కడికి వచ్చిన అభ్యర్థులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. క్రౌడ్‌ ఎక్కువ […]

నేటి నుంచి ఎస్‌సి వర్గీకరణ అమలు

ఎస్‌సి వర్గీకరణ అమలుకు ముహూర్తం ఖరారయ్యింది. ఏప్రిల్ 14 నుండి ఎస్‌సి వర్గీకరణ అమలులోకి రానుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. భారత రా జ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దశాబ్దాలు గా పెండింగ్‌లో ఉన్న వర్గీకరణ అంశం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలులోకి తెచ్చామని ఆయన తెలిపారు.

భారత్‌లో ఐఫోన్‌ల ఉత్పత్తిని పెంచిన యాపిల్

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ చైనా కేంద్రంగా జరుగుతున్న ఐఫోన్‌ల ఉత్పత్తిని క్రమంగా భారత్‌కు విస్తరిస్తోంది. ప్రస్తుతం 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌ల ఉత్పత్తికి భారత్‌ వేదికైంది. బ్లూమ్‌‌బర్గ్ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని ఐఫోన్‌లల్లో 20 శాతం భారత్‌లోనే తయారవుతున్నాయి.ప్రస్తుతం దక్షిణాదిలోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో అధిక శాతం ఐఫోన్లను అసెంబుల్ చేస్తున్నారు. టాటా గ్రూప్‌కు చెందిన ఎలక్ట్రానిక్ విభాగం కూడా ఐఫోన్ అసెంబ్లీలో కీలకంగా ఉంటోంది.

‘హెచ్‌సీయూ’లో ప్రజాస్వామ్యం ఖూనీ

హెచ్‌సీయూలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అర్బన్‌ వాటర్‌ అండ్‌ క్లైమెట్‌ చేంజ్‌ నిపుణుడు బీవీ సుబ్బారావు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం మొత్తంలో ఉన్న భూవినియోగంలో 35 శాతం అడవులకు కేటాయించాలని ఆయన సూచించారు. ప్లానింగ్‌ దశలో ఐదు అంశాలను తప్పనిసరిగా జోడించాలని పేర్కొన్నారు. భూమి, నీరు, గాలి, శక్తి, ఓపెన్‌ స్పేస్‌లను ఐదు అంశాలుగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. హెచ్‌సీయూ భూమి ప్రజల ఆస్తి అని, విద్యార్థులు చేసే ఆందోళనలకు ప్రజలు కూడా బాసటగా నిలవాలని కోరారు. […]

తిరుమలలో కొడుకు కోసం మొక్కు తీర్చుకున్న అన్నా లెజినోవా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా తిరుమల తిరుపతి లో శ్రీవారిదర్శనం చేసుకున్నారు. అంతకు ముందు ఆమె గుండుచేయించుకుని, శ్రీవారికి తలనీలాల మొక్కులు కూడా చెల్లించుకున్నారు. సింగపూర్ లో అగ్నిప్రమాదం నుంచి తన తనయుడు మార్క్ శంకర్ బయటపడటంతో ఆమె తన మొక్కులు చెల్లించుకున్నారు. సాధారణ భక్తుల్లాగానే కళ్యాణకట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించుకున్నారు అన్నాలెజినోవా, పవన్ కళ్యాణ్ భార్య వచ్చారని తెలిసి ఆమెను చూడటానికి భక్తులు ఎగబడ్డారు.

లేజర్ అస్త్రాన్ని విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ,

భారత రక్షణ శాఖ అమ్ములపొదిలో మరో సరికొత్త అస్త్రం వచ్చి చేరింది.  ‘వాహనంలో అమర్చిన లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్(DEW) ఎంకే-II(ఏ) ల్యాండ్ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించాం. ఇది యూఏవీ, డ్రోన్లను విజవయంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతోపాటు నిఘా సెన్సార్లను పనిచేయకుండా చేసింది. దీని ద్వారా లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్ చేరింది’ అని డీఆర్డీవో తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్  కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON