loader

హైకోర్టు స్టే ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టినట్టు గుర్తించాల్సిందే..

ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుగాని, హైకోర్టుగాని స్టే ఇచ్చిన దాఖలాలు లేవని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా రాష్ట్రపతి, గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలపకపోతే.. ఆమోదం పొందినట్టుగా భావించాల్సి ఉంటుందని చెప్పిందని గుర్తుచేశారు రిజర్వేషన్లపై జడ్జిమెంట్ రావడం అంటే ప్రజాస్వామ్యం గురించి చాలా లోతుగా అసెంబ్లీలో, పార్లమెంట్లో చర్చ జరగాలని ఆయన సూచించారు.

బిసి బాలికల వసతి గృహం నుంచి ముగ్గురు బాలికలు మిస్సింగ్

నగరంలో బిసి బాలికల వసతి గృహం నుంచి ముగ్గురు బాలికలు మిస్సింగ్ అయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. కోటగల్లి బాలికల పాఠశాలలో వెనకబడిన తరగతుల వసతిగృహం నుంచి పదో తరగతికి చెందిన ఇద్దరు, తొమ్మిదో తరగతికి చెందిన ఓ విద్యార్థిని బుధవారం తెల్లవారుజాము నుంచి హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కనిపించకుండా పోయారని హాస్టల్ వార్డెన్ రెండవ టౌన్‌లో ఫిర్యాదు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై తెలంగాణ హైకోర్టు స్టే

తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 9 అమలుపై కోర్టు మధ్యంతర స్థాయిలో స్టే విధించింది. జీవో అమలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించగా, బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

వైఎస్ జగన్‌కు మహిళల ఘన స్వాగతం..

విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికిన అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా నర్సీపట్నం బయలుదేరిన వైఎస్ జగన్. ఆయనకు విశాఖ ఎన్ఏడి కొత్త రోడ్డు సెంటర్‌లో మహిళలు దిష్టి తీశారు. వైఎస్ జగన్ విశాఖ, అనకాపల్లి టూర్. ఈ టూర్‌కి మొదటి నుంచి ప్రభుత్వం రకరకాల అడ్డంకులు పెట్టింది. జగన్ విశాఖ ఎయిర్‌పోర్టులో దిగారో లేదో.. జన సందోహం మొదలైంది. దారి పొడుగునా.. కాన్వాయ్ సాగుతున్నంతసేపూ.. జనం బ్రహ్మరథం పడుతున్నారు.

ఫోర్బ్స్ కుబేరుల జాబితా… దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ

భారత్‌లోని 100 మంది సంపన్నుల ఫోర్బ్స్ జాబితాలో ముకేశ్‌ అంబానీ మొదటి స్థానం సొంతం చేసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తర్వాత 92 బిలియన్‌ డాలర్లతో గౌతమ్ ఆదానీ రెండో స్థానంలో ఉన్నారు. ఓపీ జిందాల్‌కు చెందిన సావిత్రి జిందాల్ 40 బిలియన్‌ డాలర్లతో మూడోస్థానంలో, టెలికా దిగ్గజం సునీల్‌ మిట్టల్‌ 34 బిలియన్‌ డాలర్లతో నాలుగో స్థానంలో, టెక్‌ బిలియనీర్‌ శివ నాడార్‌ 33 బిలియన్‌ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచారు.

ప్ర‌స‌వం కోసం.. బురద రోడ్డులో 2 కి.మీ. న‌డిచిన గ‌ర్భిణి..

కంగ్టి మండ‌ల ప‌రిధిలోని ఓ గిరిజ‌న తండాకు చెందిన నిఖిత భాయ్‌కు ఉద‌యం పురిటినొప్పులు వ‌చ్చాయి. ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించేందుకు అంబులెన్స్‌కు  స‌మాచారం అందించారు.  తండాకు స‌రైన రోడ్డు  లేక‌పోవ‌డం, ఉన్న రోడ్డు బుర‌ద‌మ‌యంగా మార‌డంతో.. అంబులెన్స్ అక్క‌డికి చేరుకోవ‌డం క‌ష్ట‌మైంది. చేసేదేమీ లేక నిండు గ‌ర్భిణి తండా నుంచి 1.5 కిలోమీట‌ర్ల మేర కాలిన‌డ‌క‌న వెళ్లారు. పురిటి నొప్పులు భ‌రిస్తూనే ఆమె బుర‌ద‌లో న‌డిచింది. ఆ త‌ర్వాత ఆమెను అంబులెన్స్‌లో కంగ్టి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పండంటి […]

చే గువేరా

ఏర్నెస్టో”చే” గువేరా(జూన్ 14,1928 – అక్టోబరు 9, 1967) చే గువేరా , ఎల్ చే , చే అని పిలుస్తారు. ఈయన ఒక అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవములో ప్రముఖవ్యక్తి. ఆయన మరణించిన తరువాత, అతడి విలక్షణ శైలి కలిగిన ముఖాకృతి ప్రపంచవ్యాప్తంగా విప్లవభావాల సంస్కృతికి ప్రపంచ చిహ్నంగా మారింది.

డిప్యూటీ సీఎం ఉదయనిధి సంచలన కామెంట్స్..

నాలుగేళ్లుగా గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతూనే ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయన్నారు. అయితే ఒక్కరు మాత్రం రెండు రోజుల క్రితం ప్రచారం చేపట్టారని, ఆయన మరెవరో కాదు, రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అని అన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌తో పోరాడుతూనే ఉందని, తప్పకుండా తమిళనాడు పోరాడి గెలుస్తుందన్నారు. ఎడప్పాడి పళనిస్వామి లాగే ముఖ్యమంత్రి కూడా అణగిమణిగి ఉంటారని గవర్నర్‌ భావిస్తున్నారని, అయితే ఆ ఆశలు […]

ఏపీలో రేపటి నుంచి NTR హెల్త్ సేవలు నిలిపివేత

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ వైద్య సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడనుంది. ప్రభుత్వం రావాల్సిన బకాయిలు ఇంకా విడుదల కాలేదని ఆర్థిక భారం పెరిగిందని నెట్‌వర్క్ ఆసుపత్రులు తెలిపాయి. ప్రభుత్వం నుంచి దాదాపు 2700 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని వెల్లడించాయి. వాటిని చెల్లించే వరకు సేవలు కొనసాగించలేమని ఓ ప్రకటన చేశాయి. గత రెండు రోజులుగా అనేక సందర్భాల్లో ఆందోళన చేశామని ప్రజాప్రతినిధులను కలిశామని అయినా రావాల్సిన బకాయిలపై స్పందన లేదని అన్నారు.

భారత్-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన అనేది గతంలో కుదిరిన భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా ఇప్పుడు పర్యటిస్తున్నారు. కీర్ స్టార్మర్ ముంబైలోని వైఆర్‌ఎఫ్‌ స్టూడియోను సందర్శించారు. ర్‌ స్టార్మర్‌ పర్యటన సందర్భంగా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ 2026 నుంచి తమ మూడు పెద్ద సినిమాలను యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే) లోని లొకేషన్లలో చిత్రీకరించనున్నట్లు ప్రకటించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON