loader

‘AI తర్వాత మరో భారీ టెక్ విస్ఫోటనం’- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

ఇప్పుడు యావత్ ప్రపంచంలో ‘కృత్రిమ మేధస్సు’ (ఏఐ) బూమ్ నడుస్తోంది. అయితే, దీని తర్వాత జరగబోయే భారీ టెక్ విస్ఫోటనం గురించి హింట్ ఇస్తూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు మరో ఐదేళ్లలోగా అత్యంత ఉత్తేజకరమైన దశకు, పరాకాష్టకు ‘క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ’ చేరుకుంటుందని పిచాయ్ అంచనా వేశారు. ఐదేళ్ల క్రితం ఏ దశలో ఏఐ ఉందో, ఐదేళ్ల తర్వాత అదే దశలో ‘క్వాంటమ్ కంప్యూటింగ్’ ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు.

ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

దక్షిణ గోవాలోని కెనకోనా తాలూకా, పార్తగాలి గ్రామంలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగాలి జీవోత్తం మఠంలో 550వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని 77 అడుగుల ఎత్తైన శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరాముడి విగ్రహం కావడం విశేషం. ఈ విగ్రహం మొత్తం 77 అడుగుల ఎత్తు ఉంది. దీనిని పూర్తిగా కాంస్య లోహంతో తయారు చేశారు. ఇందులో శ్రీరాముడు ధనుస్సు, బాణం పట్టుకుని ఉన్న పౌరాణిక యోధుడి […]

జమిలి ఎన్నికలు.. లోక్‌సభ, అసెంబ్లీ పదవీకాలం మార్పుపై లా కమిషన్ కీలక ప్రతిపాదన

లోక్‌సభ, అసెంబ్లీల ఐదేళ్ల పదవీకాలాన్ని మార్చడానికి  పార్లమెంట్‌కు రాజ్యాంగబద్ధంగా అధికారం ఉందని జమిలీ ఎన్నికల బిల్లుపై అధ్యయనానికి వేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి లా కమిషన్ తెలిపింది. డిసెంబర్ 4న జరిగే జేపీసీ సమావేశానికి ముందు లా కమిషన్ ఈ మేరకు తన నివేదికను సమర్పించింది. దేశ ప్రయోజనాల కోసం ఈ పదవీకాలాన్ని మార్చవచ్చని, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 83, 172లలో పేర్కొన్న కాలపరిమితి శాశ్వతం కాదని స్పష్టం చేసింది.

పంటలను నాశనం చేయొద్దన్న రైతులు.. దాడికి పాల్పడిన ఇసుక క్వారీ నిర్వాహకులు

ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు శృతిమించి పోతున్నాయి. ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడుతూ ప్రాణాలు సైతం తీస్తున్నారు. వెంకటాపురం నూగూరు మండల పరిధిలోని అబ్బాయిగూడెంలో ఇసుక లారీల కారణంగా మిర్చి తోటలు దెబ్బతింటున్నాయని లారీలను రైతులు అడ్డుకున్నారు. దీంతో ఇసుక సొసైటీ సభ్యులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామస్తులు, రైతులు రాస్తారోకో చేస్తుండగా మహిళలతో పాటు రైతులపై ఇసుక క్వారీ నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ మహిళ సొమ్ముసొల్లి పడిపోయింది.

పుతిన్ భారత పర్యటన షెడ్యూల్ ఖరారు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 23వ భారతదేశం- రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా డిసెంబర్ 4-5 వరకు ఆయన భారతదేశంలో పర్యటించనున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ-పుతిన్‌ రెండు దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలపై చర్చిస్తారని తెలిపారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రష్యా నాయకుడిని రాష్ట్రపతి భవన్‌కు స్వాగతించి, ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేయనున్నారు.

కల్వకుంట్ల కవిత అరెస్ట్.. ధర్నా నుంచి లాకెళ్లిన పోలీసులు..

కామారెడ్డిలో రైలు రోకో నిరసన సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. బీసీ సమాజానికి విద్య, ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కవిత ఈ ఆందోళన చేపట్టారు. జాగృతి నేతలతో కలిసి రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. రైలు ట్రాఫిక్‌కు అడ్డంకి కలిగిన నేపథ్యంలో పోలీసులు ఆమెను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో కామారెడ్డిలో […]

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర రియాక్షన్ ఇదే

సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకుల గురించి ఎప్పుడూ ఏదోక చర్చ నడుస్తుంది. “వార్తలు ఏదైనా సరే అది నిజమా.. కాదా పక్కన పెడితే దానివల్ల మీకు ఏమైనా పనికొస్తదా..అది తెలుసుకోవడం వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా.. బేవర్స్ మాటలకు సమయం లేదు..ఈ విషయం నీకు ఎందుకు ఉపయోగపడుతుంది అని.. ఒకరి పర్సనల్ లైఫ్ ఎందుకు.. కావాలంటే నాకు టైమ్ ఉన్నప్పుడు మాట్లాడుతాను. అప్పటివరకు వెయిట్ చేయ్” అని ఓ యూట్యూబ్ ఛానల్లో హేమచంద్ర కామెంట్స్ వైరల్ […]

మాజీ మావోయిస్టు ప్రాణం తీసిన యూట్యూబ్ ఇంటర్వ్యూ..

యూట్యూబ్ ఇంటర్వ్యూలో తాను చేసిన హత్యల గురించి వివరించడం.. ఆ మాజీ మావోయిస్టు ప్రాణాలకే ముప్పు తెచ్చింది. ఆ ఇంటర్వ్యూ చూసిన ఓ వ్యక్తి, తన తండ్రిని చంపిన మావోయిస్టుపై పగ పెంచుకున్నాడు. యూట్యూబ్ ఇంటర్వ్యూ పేరుతో అతన్ని పిలిపించి.. మభ్యపెట్టి, మద్యం తాగించి, బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపింది. నిందితుడిని నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు.

జంట హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులకు సుప్రీం కోర్టులో చుక్కెదురు

ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లకు సుప్రీం కోర్టు లో చుక్కెదురయ్యింది . వారిద్దరికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను కొట్టివేసింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకుల జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు కూడా నిందితులుగా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి సోదరులు మొదట హైకోర్టును ఆశ్రయించారు. కానీ వారికి ఉపశమనం లభించలేదు. దీంతో సుప్రీంకోర్టును […]

అమరావతిలో అభివృద్ధి పనులు – సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్

అమరావతిలో జరుగుతున్న ప్రాజెక్టులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులపై సీఎం ప్రజెంటేషన్​లో వెల్లడించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై నిర్మలా సీతారామన్‌కు వివరించారు. రాజధాని అమరావతికి మరింత ఆర్థికసాయం అందించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం అన్నివిధాలుగా ఏపీకి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. అభివృద్దే లక్ష్యంగా రాష్ట్రానికి అన్ని విధాలా సహరించాలని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి అభివృద్ధిపై, పలు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON