loader

OG టికెట్ ధరలను వెంటనే తగ్గించండి.. రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ ధరలను థియేటర్లు, మల్టీప్లెక్స్‌ లు తక్షణమే తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సింగిల్‌ స్క్రీన్స్‌ తో పాటుగా మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమా టికెట్‌ ధరల పెంపును తెలంగాణ హైకోర్టును సస్పెండ్‌ చేయడాన్ని, ఆ తర్వాత పరిణామాలను జీవోలో […]

బాలయ్యపై 300 చోట్ల ఫిర్యాదు చేయాలని ఫ్యాన్స్ నిర్ణయం.. వారించిన చిరంజీవి

హైదరాబాద్‌లో బ్లడ్‌ బ్యాంక్‌ సమీపంలోని ఓ హోటెల్‌లో మెగా అభిమానుల అత్యవసర సమావేశం నిర్వహించారు. మీటింగ్‌లో ఆంధ్రా, తెలంగాణ ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 300 పీఎస్‌లలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. విషయం తెలుసుకుని అభిమానుల వారించారు చిరు. అలాంటి పనులు చేయొద్దని అభిమానులకు స్పష్టం చేశారు. చిరంజీవి పిలుపుతో ప్రస్తుతానికి ఆగాల్సి వచ్చిందంటున్నారు. అయితే, తమ పోరాటం మాత్రం ఆగదని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నేత మోహన్ స్పష్టం చేశారు.

‘ది రాజా సాబ్’ ట్రైలర్ వచ్చేసింది.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే..

ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ది రాజా సాబ్. సలార్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత డార్లింగ్ నటిస్తోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2026 జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది . అయితే సినిమా రిలీజ్ కు వంద రోజులు ఉండగానే ది రాజా సాబ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు […]

‘కాంతార చాప్టర్ 1’పై NTR ప్రశంసల జల్లు

కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన రిషబ్, టీంపై ప్రశంసలు కురిపించారు. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు తన అమ్మమ్మ ఊరి కథలు చెప్పేవారని… అలాంటి కథలతో ‘కాంతార’ను తెరకెక్కించి రిషబ్ శెట్టి అద్భుతం చేశారని నేను విన్న ఆ కథల గురించి ఓ దర్శకుడు ఓ మూవీ తీస్తాడని. అది నిజం చేశారు నా సోదరుడు రిషబ్ శెట్టి. ‘కాంతార’ను చూసి నాకు నోట మాట రాలేదు అని అన్నారు ఎన్టీఆర్. […]

రామ్ చ‌ర‌ణ్‌కి ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 18 ఏండ్లు.. తండ్రిగా గర్వంగా ఉందన్న‌ చిరంజీవి

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సినీ పరిశ్రమలో నేటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా అభిమానులు, సినీ వర్గాలు ఆయ‌న‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ.. విజయోస్తు…! తండ్రి మెగాస్టార్ […]

ఒక్క ఉత్తరంతో దుర్మార్గుల నోరు మూయించినందుకు చిరంజీవికి అభినందనలు

మాజీ మంత్రి పెర్ని నాని, చిరంజీవి రాసిన ఒక లేఖను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. చిరంజీవి లేఖ దుర్మార్గుల నోరు మూయించిందని నాని వ్యాఖ్యానించారు. ఈ ఉత్తరం ద్వారా తప్పుడు మాటలు మాట్లాడే వారిని, నిందలు వేసేవారిని చిరంజీవి నిశ్శబ్దం చేశారని పెర్ని నాని అన్నారు. కామినేని శ్రీనివాసు, బాలకృష్ణ వంటి వారు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇటువంటి ఆరోపణలు కొనసాగుతున్నాయని పెర్ని నాని పేర్కొన్నారు.

హైకోర్టు కోర్టు ఉత్వర్వులపై డీవీవీ హేళనకరమైన పోస్ట్..

ఓజీ సినిమా టికెట్ రేట్లుపెంపుని సవాల్ చేస్తూ పిటీషన్ వేసిన పిటీషనర్‌ను హేళన చేస్తూ పోస్ట్ పెట్టింది డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.ఇది పిటిషనర్ బార్లా మల్లేష్ యాదవ్‌కు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి మేము అతనికి ఏదైనా నిజాం థియేటర్‌లో టికెట్‌పై రూ.100 తగ్గింపును అందిస్తున్నాము. మల్లేష్ గారూ.. మా అభిమానులు ఆస్వాదించినట్లే మీరు ఓజీ సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ లవ్ సింబల్ ❤️ ఎమోజీని షేర్ చేశారు.

బాలయ్య వ్యాఖ్యలపై భగ్గుమంటోన్న మెగా ఫ్యాన్స్.. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్

మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బాలయ్య వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బాలకృష్ణ కుటుంబం తీవ్ర వేధింపులకు గురై, జైలు పాలైనప్పుడు అండగా నిలుచుంది, అధికారంలోకి రావడానికి అహర్నిశలూ కృషి చేసింది మెగా కుటుంబమే. కానీ ఈ విజ్ఞత మరిచి, అధికార మదం తలకెక్కించుకున్న బాలకృష్ణ చట్టసభల్లో సైతం చిరంజీవి గారి ప్రతిష్టను దిగజార్చేవిధంగా మాట్లాడేందుకు తెగించారు. బాలకృష్ణ ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం’ అని అఖిల భారత చిరంజీవి […]

‘A’ సర్టిఫికెట్ సినిమాకు పిల్లాడితో జ‌న‌సేన ఎమ్మెల్యే మాధ‌వి.. నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఓజీ చూశాను అంటూ  జ‌న‌సేన ఎమ్మెల్యే మాధ‌వి సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్‌లో ఒక చిన్న‌పిల్ల‌వాడు క‌నిపిస్తున్నాడు. ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చిన సినిమాకు పిల్ల‌ల‌ను ఎలా అనుమ‌తించారంటూ థియేట‌ర్ యాజ‌మాన్యంతో పాటు ఇటు జ‌న‌సేన ఎమ్మెల్యే మాధ‌విని విమ‌ర్శిస్తున్నారు. పిల్ల‌ల‌ను ‘A’ రేటింగ్ సినిమాకు తీసుకురాకుడ‌ద‌ని తెలియ‌దు. నువ్వు ఒక ఎమ్మెల్యే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (1946 జూన్ 4 – 2020 సెప్టెంబరు 25) నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన్ను ఎస్పీబీ అని కూడా పిలవడం కద్దు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON