loader

రిజర్వేషన్లు, ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక సమీక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై సమీక్షలు నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఆయన ఈరోజు పలు సమావేశాలు నిర్వహించారు. కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పీసీసీ కోర్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మీనాక్షి, భట్టి, మహేశ్, ఉత్తమ్, శ్రీధర్ బాబు వంటి కీలక నేతలు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చించారు.

విశాఖలోని పాఠశాలలకు రెండు రోజులు సెలవులు

విశాఖపట్నం జిల్లా అన్ని యాజమాన్య పాఠశాలలకు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 20, 21 తేదీలలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 20, 21లలో పాఠశాలలో ఉదయం సమయాలలో యోగా కార్యకలాపాలు విధిగా నిర్వహించాలన్నారు. అంటే విద్యార్థులు యోగా చేసి వెళ్తే చాలు. సంబంధిత ఫోటోలను లీప్ యాప్ నందు అప్లోడ్ చేయవలసిందిగా తెలియజేశారు.

ఉప్పల్ భారత్ పెట్రోల్ పంపులో ఘరానా మోసం

వాహనదారులను పెట్రోల్ పంపుల యజమానులు మోసాలకు పాల్పడుతుండడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్ మండలం పరిదిలో నల్ల చెరువుకట్ట భారత్ పెట్రోల్ పంపులో మీటర్ రిసెట్ చేయకపోవడంతో పాటు ఎలక్ట్రానిక్ చిప్‌లు పెట్టి మోసం చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. భారత్ పెట్రోల్ పంపులో పెట్రోల్ బాటిల్ లో నింపించుకోవడంతో మోసం వెలుగులోకి వచ్చింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెట్రోల్ బంకు యాజమానిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

అడవిలో 7 కిలోమీటర్లు బైక్ పై ఆదిలాబాద్ ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అడవిలో ఓ గ్రామానికి వెళుతూ ఏడు కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించారు. బీంపూర్ మండలంలోని మారుమూల గ్రామాలైన గుబిడి, టెకిడి రాంపూర్, కరంజీ, భగవాన్ పూర్ గ్రామాలను సందర్శించి ప్రజలతో పోలీసు మీకోసం కార్యక్రమాలను నిర్వహించారు. యువతకు కల్పించిన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని గ్రామ పేరును కీర్తి ప్రతిష్టలను పెంపొందించాలని ఎస్పి అఖిల్ మహజన్ అన్నారు. అదేవిధంగా గ్రామాలలో మాదకద్రవ్యాలకు దూరం ఉండేలా, ఎలాంటి గంజాయిని పండించకూడదని, ఎవరూ సేవించకూడదని […]

వందే భారత్ రైలుపై రాళ్ల దాడి… ముగ్గురు అరెస్టు

ప్రకాశం జిల్లా ఒంగోలులో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. గంగవరపు రిషీంద్రబాబు, షేక్ ఖాదర్ బాషా, షేక్ ఆదిష్ కరీముల్లా అనే ముగ్గురు విద్యార్థులు ఒంగోలులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. రైల్వే ట్రాక్ పక్కన మద్యం సేవిస్తూ సాయంత్రం 6:11 నుంచి 6:25 మధ్య వందే భారత్ రైలుపై రాళ్లతో దాడి చేయగా అద్దాలు పగిలిపోయాయి.

పల్నాడు జిల్లా లో ఫిట్ ఇండియా మెగా సైక్లింగ్ ఈవెంట్

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఎర్త్ హీరో ఫౌండేషన్ వారి భాగస్వామ్యంతో స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ మరియు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో  నరసరావుపేట మున్సిపల్ స్టేడియం నుంచి ఒక్క గంట పాటు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్, డిఎస్డివో నరసింహారెడ్డి, విద్యార్థులు పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేసినారు

ప్రైవేటు లాడ్జిలో అనుమానాస్పదంగా ఇద్దరు మహిళలు..

టెంపుల్ సిటీకి గంజాయి చేర్చుతున్న ముఠాలపై తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా పెంచింది. గంజాయి స్మగ్లింగ్‌పై మరింత ఫోకస్ పెట్టింది. రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్‌బీఎస్ లాడ్జిలో రూమ్ నెంబర్ 207 లో ఉన్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద నుంచి రెండు సూట్ కేసులలో దాచిన 24.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాళ్లు వెస్ట్ బెంగాల్‌కు చెందిన మమోని ముండాల్, సమిత ముండాల్‌ ను కోర్టులో హాజరుపరిచి […]

వేయిస్తంభాల గుడిలో, రామప్ప ఆలయంలో మిస్‌ వరల్డ్ బ్యూటీస్

మిస్‌‌వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన సుందరీమణులు వరంగల్‌లోని రామప్ప ఆలయం, వేయి స్తంభాల దేవాలయాలను సందర్శించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు స్వాగతం పలికారు సుందరీమణులు మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. సంప్రదాయ డోలు వాయిద్యాలతో స్థానికులు సాదదరంగా ఆహ్వానించారు. కాకతీయుల చారిత్రక కట్టడాల వద్ద వివిధ దేశాల సుందరీమణులకు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం లభించింది.

ఇంటి ముందు ఎస్పీ. . ఖంగుతిన్న తెనాలి రౌడీ షీటర్లు..!

తెనాలి రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో దాడులకు పాల్పడుతున్నారు‌.. స్థానికులను వేధిస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గుంటూరు ఎస్పీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేరుగా తెనాలిలో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆయనే నేరుగా రౌడీ షీటర్ల నివాసాలకు వెళ్లి, ప్రస్తుతం వారి ప్రవర్తనపై ఆరా తీశారు. రౌడీ షీటర్లు క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ వెళుతున్నారా లేదా అనే విషయాన్ని, వాళ్ళ ప్రవర్తనను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా కుటుంబ సభ్యులు […]

తలకొన అడవిలో అసాంఘిక కార్యకలాపాలు..

అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని అడవుల్లో అసాంఘిక కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి.తలకోన ఫారెస్ట్‌ను సందర్శించాలంటే పక్కాగా అధికారుల అనుమతి తీసుకోవాలి. ఇటీవల కాలంలో తలకోనలో మందు పార్టీల సందడి పెరిగింది. సైట్‌ సీయింగ్‌తో పాటు పార్టీలు చేసుకోవచ్చంటూ కొందరు కేటుగాళ్లు సోషల్‌ మీడియా గ్రూపుల ద్వారా యువతకు గాలం వేస్తున్నారు. మందుపార్టీలపై సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మందు పార్టీలు చేసుకుంటున్న పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. యువకులతో పాటు వాళ్లలో ఇద్దరు యువతులు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON