loader

ప్రైవేటు లాడ్జిలో అనుమానాస్పదంగా ఇద్దరు మహిళలు..

టెంపుల్ సిటీకి గంజాయి చేర్చుతున్న ముఠాలపై తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా పెంచింది. గంజాయి స్మగ్లింగ్‌పై మరింత ఫోకస్ పెట్టింది. రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్‌బీఎస్ లాడ్జిలో రూమ్ నెంబర్ 207 లో ఉన్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద నుంచి రెండు సూట్ కేసులలో దాచిన 24.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాళ్లు వెస్ట్ బెంగాల్‌కు చెందిన మమోని ముండాల్, సమిత ముండాల్‌ ను కోర్టులో హాజరుపరిచి […]

వేయిస్తంభాల గుడిలో, రామప్ప ఆలయంలో మిస్‌ వరల్డ్ బ్యూటీస్

మిస్‌‌వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన సుందరీమణులు వరంగల్‌లోని రామప్ప ఆలయం, వేయి స్తంభాల దేవాలయాలను సందర్శించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు స్వాగతం పలికారు సుందరీమణులు మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. సంప్రదాయ డోలు వాయిద్యాలతో స్థానికులు సాదదరంగా ఆహ్వానించారు. కాకతీయుల చారిత్రక కట్టడాల వద్ద వివిధ దేశాల సుందరీమణులకు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం లభించింది.

ఇంటి ముందు ఎస్పీ. . ఖంగుతిన్న తెనాలి రౌడీ షీటర్లు..!

తెనాలి రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో దాడులకు పాల్పడుతున్నారు‌.. స్థానికులను వేధిస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గుంటూరు ఎస్పీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేరుగా తెనాలిలో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆయనే నేరుగా రౌడీ షీటర్ల నివాసాలకు వెళ్లి, ప్రస్తుతం వారి ప్రవర్తనపై ఆరా తీశారు. రౌడీ షీటర్లు క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ వెళుతున్నారా లేదా అనే విషయాన్ని, వాళ్ళ ప్రవర్తనను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా కుటుంబ సభ్యులు […]

తలకొన అడవిలో అసాంఘిక కార్యకలాపాలు..

అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని అడవుల్లో అసాంఘిక కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి.తలకోన ఫారెస్ట్‌ను సందర్శించాలంటే పక్కాగా అధికారుల అనుమతి తీసుకోవాలి. ఇటీవల కాలంలో తలకోనలో మందు పార్టీల సందడి పెరిగింది. సైట్‌ సీయింగ్‌తో పాటు పార్టీలు చేసుకోవచ్చంటూ కొందరు కేటుగాళ్లు సోషల్‌ మీడియా గ్రూపుల ద్వారా యువతకు గాలం వేస్తున్నారు. మందుపార్టీలపై సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మందు పార్టీలు చేసుకుంటున్న పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. యువకులతో పాటు వాళ్లలో ఇద్దరు యువతులు […]

ఇది పాకిస్తాన్ బ్రాండ్ కాదు.. మాకు అండగా నిలవండి.. కరాచీ బేకరీ యజమానుల ఆవేదన

భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ కరాచీ బేకరీపై దాడి జరిగింది. బజరంగ్‌దళ్ కార్యకర్తలు బేకరీ ఫర్నీచర్ ధ్వంసం చేసి, పేరు మార్చాలని హెచ్చరించారు. ఈ దాడులపై కరాచీ బేకరీ యజమాని వారసులు మీడియాతో మాట్లాడారు. ఈ కష్ట సమయంలో  అండగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ, కమిషనర్‌లను కోరారు. తాము హైదరాబాద్‌కు చెందిన వారమని.. ఇది పాకిస్తాన్ బ్రాండ్ కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన భారతీయ బ్రాండ్ కాబట్టి.. సాధారణ ప్రజలు […]

విశాఖలో లేడీ పోలీస్ ఆఫీసర్ స్వర్ణలత మరో ఘనకార్యం..

విశాఖపట్నంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో రెండు వేల నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన ఆమె, ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో పట్టుబడ్డారు. జైలుకు వెళ్లొచ్చినా రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత బుద్ధి మాత్రం మారలేదు. తాజాగా ఆమె చేసిన మరో ఘనకార్యం బయటపడింది. తాజాగా స్వర్ణలత, సుధాకర్ కలిసి విశాఖపట్నంలో సబ్ రిజిస్ట్రార్‌ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు..

ఎలివేటెడ్‌పై మరోసారి గ్రామసభలు

ఎలివేటేడ్‌ కారిడార్‌ భూసేకరణపై గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ప్యారడైజ్‌ నుంచి శామీర్‌పేట్‌ రింగ్‌రోడ్డు వరకు 18 కిలోమీటర్ల మేర నిర్వహించనున్న కారిడార్‌ నిర్మాణానికి  భూ సేకరణ పక్రియకు ఓ వైపు రక్షణ శాఖ కొర్రీలు, మరోవైపు స్థానికుల వ్యతిరేకతతో బ్రెక్‌ పడిన విషయం విదితమే. భూ సేకరణ పక్రియపై ఇదివరకు ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలను గ్రామస్తులు బహిష్కరించి న్యాయస్థానాలను ఆశ్రయించారు. తిరిగి ఈనెల 9న గ్రామాలకు సంబంధించిన గ్రామసభను లోతుకుంటలో రెవెన్యూ అధికారులు నిర్వహించనున్నట్లు […]

నాడు రక్షకభట నిలయం.. నేడు విజ్ఞాన కేంద్రం

1995లో తిర్యాణి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో పోలీస్‌స్టేషన్‌ పాక్షికంగా దెబ్బతిన్నది. పేల్చివేతకు గురైన తిర్యాణి పోలీస్‌స్టేషన్‌ ఇప్పుడు యువతకు విజ్ఞానాన్ని అందించే లైబ్రరీగా మారింది. ఆసిఫాబాద్‌ ఏఎస్పీ చిత్తరంజన్‌ చొరవతో పోలీస్‌స్టేషన్‌ను లైబ్రరీగామార్చారు. ఈ ప్రాంతంలో ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే నిరుద్యోగ గిరిజన యువతకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నారు. గిరిజన యువతతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ వారిలో మార్పు తీసుకొస్తున్నారు.

ఒంగోలు వీరయ్య చౌదరి హత్యకేసులో మరో ట్విస్ట్!

ఏపీలో సంచలనంగా మారిన తెలుగుశేం పార్టీ నేత, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితలుకు సంబంధించి కూడా క్లారిటీ లేకుండా పోయింది. ముప్పవరపు వీరయ్య చౌదరికి రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నవారు.. ఒంగోలుకు చెందిన యువకుడితో కలిసి ఈ హత్య చేయించినట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరయ్యచౌదరి హత్యకేసులో ఒంగోలుకు చెందిన యువకుడు ఎందుకు భాగస్వామి అయ్యాడనే చర్చ సాగుతోంది.

అల్లూరి జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో గత వారం రోజులనుంచి ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టుల అంతం కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మరోవైపు ఎపిలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని యు జీడిపాలెం పంచాయతీ పరిధిలో రెండు చోట్ల మావోయిస్టు కదిలికలను గుర్తించారు. మావోయిస్టులను గమనించిన పోలీసులు కాల్పులు జరుపగా, అప్రమత్తమైన మావోయిస్టులు ఎదురుకాల్పు జరిపి చివరి నిమిషంలో తప్పించుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON