loader

సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన యూపీఐ ట్రాన్సాక్షన్స్

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్‌లో జనవరి నెలలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ నెలలో కొనుగోళ్ల చెల్లింపుల లావాదేవీలు ఎక్కువగా యూపీఐ ద్వారా జరగడంతో వీటి సంఖ్య, విలువ భారీగా పెరిగినట్లు నేషనల్ పేమెంట్స్,కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) తెలిపింది. జనవరిలో ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా రికార్డు స్థాయిలో రూ.28.33 లక్షల కోట్లు లావాదేవీలు నమోదయ్యాయి.

బడ్జెట్ 2026లో కొత్త పన్ను శ్లాబులు…ఏ వస్తువులు చౌక?

బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీలు తగ్గించడం, ఎగ్జెంప్షన్లు ఇవ్వడం వల్ల కొన్ని వస్తువుల ధర తగ్గుతాయ్ . ఇవి ముఖ్యంగా ఎక్స్ పోర్ట్ ప్రమోషన్, హెల్త్ కేర్, మేక్ ఇన్ ఇండియా సోపోర్ట్ కోసం  మొబైల్ ఫోన్లు | EV బ్యాటరీలు | మైక్రోవేవ్ ఓవెన్స్, పార్ట్స్ | క్యాన్సర్ మెడిసిన్స్ | సోలార్ ప్యానెల్స్ | డయాబెటిస్ మెడిసిన్స్ | స్పోర్ట్స్ ఎక్విపిమెంట్ | స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లెట్స్ | ఎలక్ట్రిక్ వెహికల్స్

స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టే వారికి భారీ షాక్.. బడ్జెట్ ఎఫెక్ట్‌తో సెన్సెక్స్, నిఫ్టీ ఢమాల్!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టే వారికి ఇది షాక్ అని చెప్పుకోవచ్చు. కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రసంగంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెంపును నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫ్యూచర్స్ విభాగంలో విక్రయాల విలువపై పన్నును ప్రస్తుతమున్న 0.02 శాతం నుండి 0.05 శాతానికి పెంచారు. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి.

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు..

పసిడి, సిల్వర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. గతవారం రోజులుగా ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి.పసిడి ఒక్కరోజే 10 శాతం తగ్గింది. దీంతో ఒక్కరోజులోనే తులం బంగారం ధర దాదాపు 20 వేల రూపాయలు తగ్గింది. ధరలు పడిపోయిన అనంతరం ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల(తులం) బంగారం ధర రూ.1,60,580కు దిగి రాగా,వెండి ధర ఏకంగా లక్ష రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి […]

బంగారం మార్కెట్లో భూకంపం… కుప్పకూలిన గోల్డ్ రేట్స్…

రికార్డుల మీద రికార్డులు సృష్టించిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒక్కరోజులో తులం బంగారం ధర ఏకంగా రూ.8 వేల పైనే పడిపోయింది. నిన్న ఒక్కరోజే తులం బంగారంపై రూ.11 వేలు పెరిగితే, ఇవాళ ఏకంగా రూ.8 వేలు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పతనం కావడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌పై కనిపించింది. హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 24 క్యారట్ గోల్డ్ ధర ఏకంగా రూ.8,230 పతనమైంది. రూ.1,78,850 నుంచి […]

ఇండిగోపై చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. 700 కి పైగా విమానాలు రద్దు!

దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో, దేశీయ విమానాశ్రయాలలో 700 కి పైగా స్లాట్‌లను వదులుకుంది. భారత విమానయాన నియంత్రణ సంస్థ DGCA కఠినమైన చర్య తరువాత, ఎయిర్‌లైన్ తన శీతాకాలపు విమానాలను తగ్గించుకోవాలని ఆదేశించింది. గత సంవత్సరం డిసెంబర్ ప్రారంభంలో సంభవించిన భారీ అంతరాయం నేపథ్యంలో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కఠినమైన చర్యలు తీసుకుంది. ఇండిగో శీతాకాల షెడ్యూల్‌ను 10 శాతం తగ్గించింది.

మళ్లీ నష్టాల బాట పట్టిన సూచీలు.. ఒత్తిడిలో అదానీ గ్రూప్ షేర్లు..

శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఉదయం లాభాల్లోనే కొనసాగాయి. మధ్యాహ్నం తర్వాత సూచీలు భారీగా పతనమయ్యాయి. చివరకు సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో 81,537 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 241 పాయింట్ల నష్టంతో 25,048 వద్ద స్థిరపడింది అదానీలకు అమెరికా రెగ్యులేటరీ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చట్టబద్ధమైన సమన్లు పంపడానికి యూఎస్ కోర్టు అనుమతి కోరడంతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు […]

రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి చరిత్రలో తొలిసారిగా అత్యంత తక్కువ స్థాయికి పడింది. ఇవాళ ట్రేడింగ్‌లో రూపాయి ఒక దశలో ₹91.74 వద్ద all-time low ను నమోదు చేసింది. నిన్న 90.97 వద్ద ముగిసిన రూపాయి, ఉదయం 91.05 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ఒక్కరోజే 77 పైసల వరకు విలువ కోల్పోయింది. ఈ పతనానికి  కారణాలు  దేశీయ మార్కెట్ల నుండి విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) తమ పెట్టుబడులను ఉపసంహరించడం, బంగారం మరియు వెండి దిగుమతుల […]

గోల్డ్ ఆల్ టైమ్ రికార్డు..ఇక, సామాన్యులు కొనడం కష్టమే

బంగారం ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి. గత రికార్డు ధరలను బద్దలు కొడుతూ పసిడి దూసుకుపోతోంది. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.5,020 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ.4600 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల(తులం) బంగారం ధర రూ.1,54,800కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,41,900కు పెరిగింది. ఇక, కేజీ వెండి ధర రూ.3,40,000గా […]

ఒక్కసారిగా పెరిగిన పసిడి, వెండి ధరలు!..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బకు పసిడి, వెండి రేట్స్ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. నేడు మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1040 మేర పెరిగి రూ.1,47,280ల రికార్డు స్థాయికి చేరింది. 22 క్యారెట్‌ల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.1,35,000కు ఎగబాకింది. నగరంలో వెండి ధర కూడా చుక్కలనంటింది. ఒక్కరోజులో ఏకంగా రూ. 12 వేల మేర పెరిగి రూ.3,30,000కు చేరుకుంది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON