loader

గూగుల్ పే, ఫోన్ పే యూజర్లూ.. QR షేరింగ్‌తో UPI పేమెంట్లు బంద్.

ర్సన్ టూ మెర్చంట్ (P2M) క్యూఆర్ కోడ్ షేర్ అండ్ పే ఆధారిత ఇంటర్నేషనల్ యూపీఐ ట్రాన్సాక్షన్లను ఆపేస్తున్నట్లు ఎన్‌పీసీఐ తెలిపింది. అంటే విదేశాల్లో ఉన్న షాపు లేదా మర్చంట్ వద్ద ఏదైనా కొనుగోలు చేసినప్పుడు వారు మీకు క్యూర్ కోడ్ షేర్ చేస్తారు. దానిని మీరు స్కాన్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇకపై అలా క్యూఆర్ కోడ్ షేర్ చేసి స్కాన్ చేసే ఇంటర్నేషనల్ పేమెంట్లకు అవకాశం ఉండదు. ఏప్రిల్ 4, 2025 […]

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ భేష్‌.. సిబ్బంది సేవల్లో మొదటి స్థానం..

హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకుంది. 2025 సంవత్సరానికి దక్షిణాసియా, భారత్‌లో అత్యుత్తమ విమానాశ్రయ సిబ్బంది సేవ అవార్డును నాలుగోసారి దక్కించుకుంది. వాయు రవాణా రేటింగ్‌ సంస్థ స్కైట్రాక్స్‌ ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌పోర్టులను ఎంపిక చేయగా దానిని స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగిన ప్యాసింజర్‌ టెర్మినల్‌ ఎక్స్‌పో 2025లో ప్రకటించి, అందజేశారు. తమకు ఈ అవార్డు రావడం పట్ల జీఎంఆర్‌ యాజమాన్యం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేసింది.

ట్రంప్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చేందుకు… చైనా గట్టిగానే యత్నిస్తోందిగా

చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 125 శాతం సుంకం విధించి వాణిజ్య యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. దీంతో బీజింగ్ యూరోపియన్ యూనియన్ (EU), ఆసియాన్ దేశాలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి అమెరికాను వెనక్కి తగ్గించే ప్రయత్నం చేస్తోంది. చైనా వాణిజ్య మంత్రి వాంగ్ వెంటావో, యూరోపియన్ కమిషనర్ ఫర్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ మరోస్ సెఫ్కోవిక్ మంగళవారం వీడియో ద్వారా చర్చలు జరిపారు.

కియా పరిశ్రమలో భారీ చోరీ..ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం

కియా పరిశ్రమలో భారీ చోరీ..ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 19న ఈ ఘటనపై కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కియా ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణ కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల […]

అట్లుంటది మనతోని.. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సరికొత్త రికార్డు..

హైదరాబాద్ నగరంలోని శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవల ప్రయాణికుల రాకపోకలలో ఆశ్చర్యకరమైన వృద్ధిని నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విమానాశ్రయం 15.20 శాతం వృద్ధితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణికులు ఈ ఏడాది RGIA విమానాశ్రయం ద్వారా ప్రయాణించడం గమనార్హం. ఇదే రీతిలో రద్దీ కొనసాగితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు కోట్ల మార్కును దాటి మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశముందని అంచనా..

ఆ నలుగురి సంపద రూ.85వేల కోట్లు ఆవిరి

ప్రపంచ ఆర్థిక మాంద్యం భయం కారణంగా భా రత దేశంలోని టాప్ 4 బిలియనీర్లు అయిన ముకేశ్ అంబానీ, గౌత మ్ అదానీ, సావిత్రి జిందార్, ఫ్యామిలీ, శివ్‌నాడార్‌ల సం పద ఒకే రోజులో 10.3 బిలియన్ డాలర్లు (రూ.88,460 కో ట్లు) క్షీణించింది.భారతదేశపు అత్యంత ధనవంతుడైన సంపద 3.6 బిలియన్ డాలర్లు తగ్గి 87.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గౌతమ్ అదానీ కూడా 3 బిలియన్ డాలర్లు కోల్పోగా, ఇప్పుడు ఆయన సంపద 57.3 బిలియన్ […]

LPG గ్యాస్ షాక్.. సిలిండర్ ధర పెంపు..

గృహావసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా రూ.50 మేర పెంచింది. ఈ పెరిగిన ధరలు మంగళవారం నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.21.45 కోట్లు అదనంగా చెల్లిస్తుంది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.905కు, నల్గొండలో రూ.927కు, విజయవాడలో రూ.875.50కి చేరింది.

మరోసారి బ్యాంకుల విలీనం.. కేంద్రం ప్రకటన..

బ్యాంకుల విలీనానికి మరోసారి తెరలేపింది కేంద్ర ప్రభుత్వం. బ్యాంకుల కార్యకలాపాల సామర్థ్యం పెంచడం, ఖర్చుల హేతుబద్ధీకరణ చేపట్టడమే లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈమేరకు దేశంలోని 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు లను 28కి కుదించనున్నట్లు పేర్కొంది. ఒక రాష్ట్రం- ఒక ఆర్ఆర్‌బీ(Regional Rural Bank) ప్రణాళికను అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేశారు.

భారత్‌ సహా 14 దేశాల వీసాలు రద్దుచేసిన సౌదీ అరేబియా..

ఉమ్రా, బిజినెస్‌, ఫ్యామిలీ విజిట్‌ వీసాల జారీపై సౌదీ అరేబియా తాత్కాలిక నిషేధం విధించింది. సరైన రిజిస్ట్రేషన్‌ లేకుండా హజ్‌ యాత్ర చేయడానికి జరిగే ప్రయత్నాలను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. చాలా దేశాల నుంచి ఇటువంటి వీసాలపై వచ్చి, గడువు ముగిసినప్పటికీ సౌదీ అరేబియాలోనే ఉంటూ, అధికారిక ధ్రువీకరణ లేకుండా హజ్‌లో పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. హజ్‌ యాత్ర సజావుగా, సురక్షితంగా నిర్వహించేందుకు వీసాల జారీపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్టు తెలిపింది.

ఫోర్బ్స్ రిచ్ లిస్ట్: పాపం అంబానీ.. మరీ ఇంతలా పడిపోయాడేంటి?

ప్రపంచ కుబేరుల జాబితా విడుదల చేసిన ప్రతిసారీ మన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తప్పకుండా టాప్ 10లో ఉండేవారు. ఈసారి మాత్రం ఏకంగా 18వ స్థానానికి పడిపోయారు. కొంతకాలంగా రిలయన్స్ షేర్లు కుదేలవడమే  అందుకు కారణం. అంబానీ రూ.7.85 లక్షల కోట్లతో 18వ స్థానంలో ఉన్నారు. అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ 28వ స్థానంలో నిలిచారు. ప్రపంచంలో 3028 మంది బిలియనీర్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON