loader

అదానీ కంపెనీల్లో పెట్టుబడులపై ఎవరి ఒత్తిళ్లు లేవు: ఎల్‌ఐసీ

అదానీ గ్రూప్ కంపెనీల్లో జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ ప్రమేయం ఉందంటూ వచ్చిన ఆరోపణలపై జీవిత బీమా సంస్థ స్పందించింది. ఈ పెట్టుబడులపై తమది స్వతంత్ర నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేసింది. ఓవైపు అప్పులు, మరోవైపు అమెరికా సంస్థల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ ఏడాది మొదట్లో అదానీ గ్రూప్ కంపెనీల్లో జీవిత బీమా సంస్థ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టిందని వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ఓ […]

రూ.855 కోట్లతో ‘రిలయన్స్​ ఏఐ వెంచర్’​- అందులో ఫేస్​బుక్​ వాటా 30 శాతం

ఇండియన్ బిలియనీర్​ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్​ ఇప్పుడు కృత్రిమ మేధ సేవల (ఏఐ సర్వీసులు)పై దృష్టి కేంద్రీకరించింది. రిలయన్స్​ ఎంటర్​ ప్రైజెస్​, మెటాకు చెందిన అనుబంధ సంస్థ ఫేస్​బుక్​ ఓవర్సీస్​, ఐఎన్​సీ కలిసి ఈ జాయింట్​ వెంచర్​ను ప్రారంభించనున్నాయి. రూ.855 కోట్ల పెట్టుబడితో ప్రారంభించనున్న ఈ జాయింట్ ఏఐ వెంచర్​లో రిలయన్స్ ఎంటర్​ప్రైజెస్​​ 70 శాతం వాటా కాగా, మెటా అనుబంధ సంస్థ అయిన ఫేస్​బుక్​ ఓవర్సీస్​ 30 శాతం వాటాను కలిగి ఉంటాయని […]

సాహితీ ఇన్‌ఫ్రా ఆస్తులను జప్తు చేసిన ఈడీ

హైదరాబాద్‌లోని సాహితీ ఇన్‌ఫ్రా ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. రూ.12.65 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసిన చేసింది. ఫ్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో సాహితీ ఇన్‌ఫ్రా మోసం చేసినట్లు గుర్తించిన అధికారులు.. కంపెనీ డైరెక్టర్ పూర్ణచందర్‌రావుతో పాటు కుటుంబ సభ్యులపై మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంస్థ ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో బాధితుల నుంచి రూ.842 కోట్లు వసూలు చేసినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది

26 వేల మార్క్ దాటిన నిఫ్టీ.. సూచీలకు భారీ లాభాలు..

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు దేశీయ సూచీల్లో జోష్ నింపాయి. భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరే సూచనలు, భారత్ ఎగుమతులపై అమెరికాలో సుంకాలు 50 నుంచి 15 శాతానికి దిగి వస్తాయనే అంచనాలు మదుపర్లలో విశ్వాసాన్ని పెంచాయి. దీంతో గురువారం దేశీయ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు సూచీలను పరుగులు పెట్టిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతన్నాయి

సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటనలో కీలకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటిస్తున్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్‌లోని ప్రముఖ సంస్థ శోభా రియాల్టి ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్‌తో భేటీ అయ్యారు. అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంధాలయం ఏర్పాటుకు శోభా గ్రూప్ చైర్మన్ పీఎన్సీ మీనన్ విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రియాల్టి, టౌన్ షిప్‌లు, లగ్జరీ హోటళ్ల నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.

అమెజాన్‌కు షాక్.. ముగ్గురు డైరెక్టర్లపై నాన్ బెయిలబుల్ వారెంట్..

ఒక ఫోన్‌కు బదులు మరో ఫోన్ డెలివరీ చేసిన కేసులో ముగ్గురు అమెజాన్ డైరెక్టర్లపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. బెంగళూరులోని ఇద్దరు, పాట్నాలోని ఒక డైరెక్టర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఐఫోన్ 15 ప్లస్‌కు బదులు ఐక్యూ ఫోన్ డెలివరీ అయింది. ఆధారాలతో కన్సూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించిన. అమెజాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఆగ్రహించిన కన్సూమర్ ఫోరమ్ ముగ్గురు అమెజాన్ డైరెక్టర్లపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ […]

ఉద్యోగుల తొలగింపుల మధ్య 22 శాతం పెరిగిన సత్య నాదెళ్ల వేతనం

ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో టెక్ రంగంలో ఉద్యోగులను తొలగిస్తున్నారు. అయితే దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వేతనం ఈ ఏడాది ఏకంగా 22 శాతం పెరిగింది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కొత్త వేతనం 96.5 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో ఇది సుమారుగా రూ.847 కోట్లు. గత ఏడాది సత్యనాదెళ్ల వేతనం 79 .1 మిలియన్ డాలర్లుగా ఉన్నది. వేతనంలో ఎక్కువ భాగం 84 మిలియన్లకు పైగా విలువైన స్టాక్ […]

DA బకాయిల ఉత్తర్వులు సవరిస్తూ GO జారీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల DA విడుదలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన GO నంబర్ 60, 61 లలో మార్పులు చేసింది చంద్రబాబు సర్కారు. ప్రభుత్వ ఉద్యోగులకు నేటి నుంచి ఏడాది లోపు మూడు వాయిదాలలో DA బకాయిలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ఉద్యోగుల GPF ఖాతాల్లో జమ చేయాలని GO లో సవరణలు తీసుకొచ్చారు. CPS ఉద్యోగులు, పెన్షనర్ లకు ఏడాది లోపు మూడు వాయిదాలలో చెల్లించాలని ఆదేశాలిచ్చారు. కొంచెంసేపటి క్రితం ఏపీ […]

నేటి ముహూరత్ ట్రేడింగ్‌లో రాకెట్‌లా దూసుకెళ్లే స్టాక్స్ ఇవే!

ఈ ఏడాది ముహూర్త ట్రేడింగ్ అక్టోబర్ 21న అంటే ఈ రోజు మధ్యాహ్నం 1.45 నుండి 2.45 మధ్యలో నిర్వహించనున్నారు. వాస్తవానికి ప్రతి ఏడాది దీపావళి రోజున స్టాక్ మార్కెట్‌లో ఒక గంట పాటు నిర్వహించే ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను ముహూరత్ ట్రేడింగ్ అంటారు. ముహూరత్ ట్రేడింగ్ సమయంలో పెట్టుబడిదారులకు లాభాలను అందించే అవకాశం ఉన్న కొన్ని స్టాక్‌లను సూచించారు. అదానీ పోర్ట్స్ & SEZ, టిటాగఢ్ రైల్ సిస్టమ్స్,పాలీక్యాబ్ ఇండియా,లార్సెన్ & టూబ్రో,  సిప్లా.

మూతపడనున్న పిజ్జా హట్‌ రెస్టారెంట్లు..

పిజ్జా హట్ UK రెస్టారెంట్ డైన్-ఇన్ రెస్టారెంట్ వ్యాపారం పరిపాలనలోకి వెళ్లిన తర్వాత 68 రెస్టారెంట్లను మూసివేస్తామని తెలిపింది. పిజ్జా హట్ UKలో 68 రెస్టారెంట్లు, 11 డెలివరీ సైట్‌లను మూసివేయనున్నట్లు సమాచారం, దీని ఫలితంగా వాటిని నిర్వహిస్తున్న కంపెనీ పరిపాలనలోకి ప్రవేశించడంతో 1,210 ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. పిజ్జా హట్ UK రెస్టారెంట్లను నిర్వహిస్తున్న DC లండన్ పై లిమిటెడ్, సోమవారం FTI కన్సల్టింగ్‌ను నిర్వాహకుడిగా నియమించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON