loader

ఉద్యోగులకు బహుమతిగా కార్లు

చెన్నైలో టెక్ సర్వీసెస్ సంస్థ అజిలిసియం తన 10 ఏళ్ల ప్రస్థానంలో తమతో కలిసి ప్రయాణించిన ఉద్యోగులకు 25 కొత్త హ్యుందాయ్ క్రెటా SUVలను బహుమతిగా ఇచ్చింది. సంస్థలోని ప్రతి స్థాయిలో వ్యక్తిగత పనితీరు ఆధారంగా వేతన పెంపును కూడా ప్రకటించింది. చెన్నై కంపెనీ ఉద్యోగుల పట్ల చూపించిన ఉదారత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రయత్నం ఆలోచనాత్మక కార్పొరేట్ కృతజ్ఞతకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిందని పలువురు ప్రశంసించారు.

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్..

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్. దశాబ్దాల పోరాటానికి త్వరలో న్యాయం జరగనుంది. కడుపుకట్టుకుని కూడబెట్టుకున్న సొమ్ము.. మళ్లీ తిరిగి ఇచ్చేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఆస్తుల పునరుద్ధరణ ద్వారా ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) ద్వారా జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను బాధితులకు పంపిణీ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఆస్తుల మార్కెట్ విలువ సుమారు రూ. 6 వేల కోట్లుగా అంచనా వేయడం జరిగింది.

తెలుగు రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు..

వస్తు సేవల పన్ను (జీఎస్​టీ) ఆదాయం రికార్డు స్థాయిలో రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. మే లో మొత్తం రూ.2.01 లక్షల కోట్ల వసూళ్లు నమోదైనట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో రూ. 5310 కోట్ల ఆదాయంతో 9 స్థానంలో ఉంది. మరోవైపు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ మే నెలలో రూ. 3803 కోట్ల ఆదాయంతో 12వ స్థానంలో ఉంది.

ఫుడ్ డెలివరీ రంగంలోకి ర్యాపిడో

బైక్ టాక్సీ లతో మార్కెట్లోకి ప్రవేశించి అంచలంచలుగా ఎదిగిన రాపిడో ఇప్పుడు ఫుడ్ డెలివరీ సర్వీసులోకి కూడా అడుగుపెట్టేసింది, ఈ రంగంలో ఇప్పటికే స్విగ్గి జొమాటో పోటీ పడుతున్న నేపథ్యంలో, ఇప్పుడు తాజాగా రాపిడో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం రాపిడో ఒక ప్రత్యేకమైన మార్కెటింగ్ స్ట్రాటజితో అడుగుపెడుతోంది. ఈ స్టేటస్ వల్ల ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి స్విగ్గి జొమాటోలను చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోందని చెప్పవచ్చు.

చరిత్రలోనే అతిపెద్ద విరాళం.. రూ.151 కోట్లు

ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ICT)కి రూ.151 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది చరిత్రలో ఇది అతిపెద్ద విరాళం. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ సంస్థ నుండి చదువుకున్నారు.  ICTని గతంలో యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (UDCT) అని పిలిచేవారు. దీనిని 1933లో బొంబాయి విశ్వవిద్యాలయం స్థాపించింది. అనితా పాటిల్ రాసిన ‘ది డివైన్ సైంటిస్ట్’ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా అంబానీ ICTకి ఈ […]

ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ప్రయాణీకులకు ఛార్జీల మోత..!

Rapido వినియోగదారులకు షాక్ ఇచ్చింది. Rapido కొత్త ఛార్జింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది ప్రయాణీకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు మీ రైడ్ సమయంలో భారీ ట్రాఫిక్ ఉండి ప్రయాణం ఆలస్యం అయితే, దాని ఖర్చును కూడా మీరే భరించాలి. 10 నిమిషాల కంటే ఎక్కువ ట్రాఫిక్ ఆలస్యం అయితే నిమిషానికి రూ.0.50 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. దీని గరిష్ట పరిమితి రూ.30గా నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల మహా నగరాల్లో రాపిడోపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఈ వ్యక్తి బ్రాండ్‌నే కొట్టేశాడు- వీడు మామూలోడు కాదు

ఎవరైనా డబ్బులు కొట్టేస్తారు.. బంగారం కొట్టేస్తారు.. కానీ బ్రాండ్ ను కొట్టేయడం సాధ్యమా ?. సాధ్యమేనని నిరూపించాడు యశ్వంత్ అనే వ్యక్తి. నకిలీ పత్రాల ద్వారా 1979 నుండి మద్రాస్ ఫిల్టర్ కాఫీ వ్యాపారంలో ఉన్నామంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులను, కోర్టు లను బురిడీ కొట్టించి ట్రేడ్ మార్క్ లైసెన్స్ తెచ్చుకొని ప్రజల్ని మోసం చేస్తున్నట్లుగా గుర్తించారు. ఫ్రాంచైజీలు అమ్ముకోవడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు గడించి సాటి వ్యాపారస్తులను ముంచేశాడు.

ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్క్. . . దిల్లీలో చంద్రబాబు

ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తామని మఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పారిశ్రమలను ప్రోత్సహించి బిజినెస్ ప్రారంభమైతేనే ఆదాయం పెరుగుతుందని అన్నారు. అప్పుడే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇవ్వగలమని పేర్కొన్నారు. ఇప్పుడు చాలా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. దిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక మీటింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఏపీ ప్రభుత్వ విధానాలు, పెట్టుబడుల అవకాశాలు వచ్చిన వాళ్లకు వివరించారు.

త్రీ గోర్జెస్ డ్యామ్‌ లాంటి అద్భుతం కాళేశ్వరం- కేటీఆర్

ధృడ నాయకత్వం, ప్రజల జీవితాలను మార్చాలన్న చిత్తశుద్ది ఉంటే అద్భుతమైన ప్రగతి సాధ్యమని తెలంగాణ నిరూపించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన విజయాలు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సంపదను సృష్టించడంతో పాటు దాన్ని సమాజంలోని అట్టడుగు వర్గాలకు సమానంగా పంచడమే తెలంగాణను దేశంలో ప్రత్యేకంగా నిలిపిందన్నారు తెలంగాణ ఎందుకు ముఖ్యం? అన్న అంశంపై లండన్ బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ ప్రధాన […]

టాటా కెమికల్స్‌కు చంద్రశేఖరన్ రాజీనామా..

టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ టాటా కెమికల్స్ బోర్డు డైరెక్టర్, ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. తన ఇతర బాధ్యతలను పేర్కొంటూ చంద్రశేఖరన్ టాటా కెమికల్స్‌లో ఉన్నత పదవికి రాజీనామా చేశారు. కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆయన రాజీనామాను ధృవీకరించింది. నా ప్రస్తుత, భవిష్యత్తు బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని బోర్డు నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నా పదవీకాలంలో నాకు లభించిన మద్దతు, భాగస్వామ్యానికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని ఎన్ చంద్రశేఖరన్ బోర్డుకు రాసిన లేఖలో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON