మయన్మార్ మధ్య ప్రాంతంలోని సగైంగ్ బౌద్ధ మఠంపై శుక్రవారం మయన్మార్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో 14మంది మరణించారు. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడినట్లు తెలుస్తోంది. వాళ్లంతా వారం రోజుల పాటు జరిగే ధ్యాన శిబిరంలో పాల్గొంటున్న సమయంలో దాడి జరిగినట్లు స్థానిక నివాసి ఒకరు తెలిపారు. అయితే ప్రభుత్వమే ఈ దాడి చేసినట్లు ప్రతిపక్ష గ్రూపు ఆరోపిస్తోంది. మ్యాంగ్ టౌన్షిప్లోని స్వెల్ లే ఓహ్ గ్రామంలో ధ్యాన శిబిరం ఆవరణలో ఒక జెట్ ఫైటర్ బాంబు దాడి జరిగిందని తెలిపారు.