దేశంలో 2029 నాటికి చట్టసభలలో మహిళా రిజర్వేషన్ కోటా అమలులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు ఇప్పుడు కేంద్రంతలపెట్టిన రాజ్యాంగ సవరణలకు, చట్టం రూపకల్పనకు అంతా ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ, లోక్సభలలోని పలు పార్టీల సభాపక్ష నేతలకు లేఖలు రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణల ఆమోదానికి ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ పార్లమెంట్ మూడు రోజుల ప్రత్యేక సిట్టింగ్ను ఖరారు చేశారు.

