కులాల వారి గణనను నిలిపివేయాలనే ప్రజావ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన పిటిషనర్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా మందలించారు. పిటిషన్లో వాడిన పదజాలంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో అనుచిత భాష వాడారు. ఎవరు ఈ పిటిషన్ మీకు రాసి ఇచ్చారని ప్రదాన న్యాయమూర్తి నిలదీశారు. కులగణనకు సరైన మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉందని పేర్కొంటూ పిటిషనర్ పిల్లో వాడిన పదాలు వివాదాస్పదం అయ్యాయి.

