మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి పదవీ వ్యామోహం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారని, ఆయన నైజం చూస్తుంటే గతంలో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు నిజమేనని అనిపిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు నాడు వ్యక్తమైనా, సభ్య సమాజంలో ఎవరైనా తండ్రికి అలా చేస్తారా అని తాము నమ్మలేదని, కానీ ఇప్పుడు జగన్ ప్రవర్తన చూస్తుంటే ఆ అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు.

