పశ్చిమాసియాలో సంఘర్షణ వల్ల ఇరాన్ మూసివేసిన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరువడంపై చర్చించేందుకు సుమారు 40 దేశాలను బ్రిటన్ ఆహ్వానించింది. ఇందులో భాగంగా భారత్కు కూడా ఆహ్వానం అందినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. బ్రిటన్లో ఇవాళ జరుగనున్న ఈ సమావేశంలో భారత్ తరపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రాతినిధ్యం వహిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

