అమరావతికి పూర్వ వైభవం వస్తున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ రోజు సాయంత్రం అన్ని గ్రామాల్లో ప్రజలు, కూటమి నాయకులు కలిసి పండగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఐదేళ్ల చీకటి పాలన ముగిసి రాజధాని నిర్మాణానికి మార్గం సుగమమైందని, ఈ విజయాన్ని ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన కోరారు. గ్రామ గ్రామాన అమరావతి నినాదం మార్మోగాలని సూచించారు.

