సుడాన్ దేశంలో మానవత్వం మంటగలిసేలా జరిగిన ఆసుపత్రి దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పారామిలిటరీ దళాలు, ఆర్మీ మధ్య సాగుతున్న అంతర్యుద్ధం చివరకు పసిపిల్లలు, వైద్యులను బలితీసుకోవడం పట్ల అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.మృతుల్లో ఇద్దరు మహిళా నర్సులు, ఒక డాక్టర్ కూడా ఉన్నారని సమాచారం. ఆసుపత్రిలోని పిల్లల విభాగం, ప్రసూతి వార్డు, అత్యవసర విభాగం ఈ దాడిలో పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనివల్ల ఆసుపత్రి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

