శాసన సభలో మూసీ పునర్నిర్మాణంపై కెటిఆర్ మాట్లాడారు. రూ.16 వేల కోట్లయ్యే ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్షన్నర కోట్లు అని చెబుతున్నారని, మూసీ డిపిఆర్ తయారు చేసేందుకు 18 నెలలు పడుతుందని జనవరిలో మంత్రి చెప్పారని, ఇప్పుడేమో డిపిఆర్ పూర్తయిందని మంత్రి చెబుతున్నారని, 18 నెలలు పడుతుందని చెప్పి రెండు నెలల్లోనే పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. ఒకవేళ డిపిఆర్ పూర్తి చేసి ఉంటే తమ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు

