పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఆసక్తికర పరిణామాల మధ్య కొనసాగుతున్నాయి. ఒకవైపు రాజ్యసభలో పదవీ విరమణ పొందుతున్న సభ్యులకు వీడ్కోలు పలుకుతూ ప్రధాని మోదీ ప్రసంగించగా, మరోవైపు ఎల్పీజీ సంక్షోభంపై విపక్షాలు కేంద్రాన్ని చుట్టుముట్టాయి. రాజ్యసభ నుంచి పదవీ విరమణ పొందుతున్న ఎంపీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. దేశ నిర్మాణంలో, పార్లమెంటరీ చర్చల్లో వారు పోషించిన పాత్రను కొనియాడారు. సభలో చోటుచేసుకున్న ఈ మార్పును ఒక పరివర్తన కాలంగా ఆయన అభివర్ణించారు.

