ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (BWF) ఆటలో వేగాన్ని పెంచేందుకు ప్రస్తుతం ఉన్న 3×21 పాయింట్ల విధానం స్థానంలో 3×15 (లేదా 5×11) పాయింట్ల స్కోరింగ్ విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 21 పాయింట్ల విధానం ఎంతో బాగుంది. గత కొన్నేళ్లుగా ఆటగాళ్లందరూ ఈ స్కోరింగ్కే ఆలవాటు పడ్డారు. ఒకవేళ స్కోరింగ్లో మార్పులు చేస్తే.. ర్యాలీలు ఆడడంపై, పోటీతత్వంలో సమతుల్యం కూడా దెబ్బతింటుంది. ఏదిఏమైనా.. క్రీడాకారులు సంక్షేమంపై దృష్టి సారించాలని బీడబ్ల్యూఎఫ్ను సైనా కోరింది.

