పవర్స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ సినిమా ‘ఉస్తాద్ భగత్సింగ్’ , హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ఈనెల 19న వరల్డ్వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఉస్తాద్ సినిమాకు బెనిఫిట్ షోతో పాటుగా టికెట్ రేట్ పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్చి 19న తెల్లవారుజామున 4- 5గంటల మధ్యలో బెనిఫిట్ షో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షో టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్స్లో రూ.100, మల్టీప్లెక్స్ల్లో రూ.125 చొప్పున పెంచుకునే వీలు కల్పించింది.

