టీ20 వరల్డ్ కప్ 2026లో సంజూ శాంసన్ విశ్వరూపం చూపించాడు. వెస్టిండీస్తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ పోరులో సంజూ శాంసన్ ఒంటిచేత్తో భారత్ను గెలిపించాడు.కేవలం 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినా, తన అజేయమైన విన్నింగ్ నాక్ తో భారత్ సెమీస్ బెర్త్ను కన్ఫర్మ్ చేశాడు. అపనమ్మకాలను పటాపంచలు చేస్తూ, తానేంటో ప్రపంచానికి చాటిచెప్పిన సంజూ శాంసన్ ఇప్పుడు రియల్ హీరో !. సంజూ శాంసన్ 50 బంతుల్లో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఇందులో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

