శుక్రవారం ఉదయం ఫ్లాట్గా మొదలైన సెన్సెక్స్ ఉదయం లాభాల్లోనే కొనసాగాయి. మధ్యాహ్నం తర్వాత సూచీలు భారీగా పతనమయ్యాయి. చివరకు సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో 81,537 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 241 పాయింట్ల నష్టంతో 25,048 వద్ద స్థిరపడింది అదానీలకు అమెరికా రెగ్యులేటరీ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చట్టబద్ధమైన సమన్లు పంపడానికి యూఎస్ కోర్టు అనుమతి కోరడంతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు భారీగా పతనమయ్యాయి.

