ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అందుకున్నారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా 14 ఏళ్ల ఆ క్రికెటర్ అవార్డును స్వీకరించారు. ఢిల్లీలో ఇవాళ ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ధైర్యసాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణం, ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి బాల పురస్కారాన్ని ప్రతి ఏడాది అందజేస్తారు.

