కేంద్రం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ పథకానికి(యూపీఎస్) ఉద్యోగుల నుంచి పేలవమైన స్పందన వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ను ప్రారంభించినప్పటికీ, మొత్తం 25 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కేవలం లక్ష మంది లేదా 4 శాతం మంది మాత్రమే ఈ పథక ఎంపికను ఉపయోగించుకున్నారు. యూపీఎస్ స్వీకరణకు మొదట గడువును జూన్ 30గా ప్రకటించిన కేంద్రం తర్వాత దానిని సెప్టెంబర్ 30కు, తదుపరి నవంబర్ 30కు పొడిగించింది.

