
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేలోని ఫతేహాబాద్ టోల్ ప్లాజా వద్ద సిబ్బంది అన్ని గేట్లను తెరిచి, వేలాది వాహనాలు టోల్ ఛార్జీలు చెల్లించకుండానే ప్రయాణించడానికి వీలు కల్పించారు. దీపావళి బోనస్ కేవలం రూ.1100 మాత్రమే ఇవ్వడంతో కంపెనీపై కోపంతో ఇలా చేశారు. ఈ వివాదం టోల్ కార్యకలాపాలకు రెండు గంటల పాటు అంతరాయం కలిగించింది. ఇది పోలీసుల జోక్యానికి దారితీసింది. టోల్ అధికారులు 10 శాతం జీతం పెంపునకు హామీ ఇవ్వడంతో సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.