
ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో ఇవాళ దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి హత్యకు గురయ్యాడు. కైలాష్ భవన్ రోడ్డులో టిఫిన్ సెంటర్ వద్ద కొబ్బరికాయల కత్తితో జ్యూటూరి బుజ్జి(50) అనే వ్యక్తిని దుండగుడు నరికి చంపారు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు. దుండగుడు స్కూటీపై మాస్క్ వేసుకొని వచ్చి హత్య చేసి పరార్ అయినట్టు స్థానికులు చెబుతున్నారు. మృతుడు అమర్తులూరు మండలం కోడితాడిపర్రు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.