
గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. ఢిల్లీలోని మాన్సింగ్ హోటల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు.