
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు జారీ చేసిన స్టే ఆర్డర్ రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్ని బీసీ సంఘాల సమన్వయంతో ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రిజర్వేషన్లపై స్టే విధించడం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్య అని ఆయన వ్యాఖ్యానించారు.