
సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబరు 1, 2025 న ఒక కీలక GO జారీ చేసింది. రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికలపై నియంత్రణ, బాధ్యత, ఫేక్ వార్తలు, దుర్వినియోగం వంటి అంశాలపై కేంద్రీకృత మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడం ఈ GO లక్ష్యం.. మంత్రులు లోకేష్, సత్యకుమార్, హోమ్, పార్థసారథి, నాదెండ్ల మనోహర్ లు సభ్యులుగా ఉంటారు. ఐ అండ్ పీఆర్ కమిషనర్ కమిటీ కన్వీనర్గా వ్యవహరిస్తారు.