ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మెరుపు శతకంతో చెలరేగింది. కేవలం 50 బంతుల్లోనే 12 ఫోర్లు, మూడు సిక్సులతో శతకం సాధించింది. అత్యంత తక్కువ బంతుల్లోనే శతకం సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్ గా రికార్డు సాధించింది. ఓవరాల్ గా రెండో బ్యాట్స్ ఉమెన్ గా నిలిచింది. 413 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టును విజయం దిశగా తీసుకెళ్తున్నారు.

