
వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ముంబై-పుణే ఎక్స్ప్రెస్వేపై పెద్ద ప్రమాదం జరిగింది.20 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. సుమారు 16 మంది గాయపడ్డారు. హైవేలోని లోనావాలా-ఖండాల ఘాట్ వద్ద కంటైనర్ వాహనం బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. నియంత్రణ కోల్పోయిన ఆ కంటైనర్ ముందున్న ఒక వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో మందున్న పలు వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. పలు కార్లతో సహా సుమారు 20 వాహనాలు దెబ్బతిన్నాయి.