
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి సుధావల్లి అన్నారు. దక్షిణ ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో 7.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది అని తెలిపారు. ఇది రానున్న 24 గంటలలో ఈ అల్పపీడనం బలపడుతుందని తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.