
మహారాష్ట్రకు చెందిన కొందరు యువకులు నాగపూర్ నుంచి తిరుపతికి వెళ్తున్నారు. గూగుల్ మ్యాప్ ని నమ్ముకుని జనగామ జిల్లా మీదుగా వెళ్తుండగా కారు గుంతలో పడింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డవారిని రక్షించారు. యాక్సిడెంట్ జరిగిన దగ్గర బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో ఎలాంటి హెచ్చరికల బోర్డులు పెట్టకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు.