వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జులై 9వ తేదీ చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించునున్నారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు స్పష్టం చేశారు. వైఎస్ జగన్ బంగారుపాలెం పర్యటన సందర్భంగా హెలిపాడ్ వద్ద 30 మందికి మాత్రమే అనుమతి ఉందన్నారు. అలాగే మామిడికాయల మార్కెట్ యార్డులో 500 మంది మామిడి రైతులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.
అనుమతులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు.

